బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

On
బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి
42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు
దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి - 

న్యూ ఢిల్లీ జూలై 08:

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలకు మోసం చేస్తున్నాయి. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది.బీసీ బిల్లును ఆమోదించకపోతే రెండున్నర కోట్ల బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఢిల్లీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

 తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా, బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత... “ఒక్క రైలు చక్రాన్ని కూడా కదలనివ్వబోము. డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చేదే లేదు. ఆ స్థాయిలో రైల్ రోకో చేపడుతాము. బిల్లును ఆమోదించకపోతే రెండున్నర కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారు” అని వ్యాఖ్యానించారు.  రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్ రోకో ను నిర్వహిస్తామని హెచ్చరించారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. రైల్ రోకోకు మద్ధతు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని తెలిపారు.

 IMG-20250708-WA0005
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాము చేసిన పోరాటాలు, ఉద్యమాలతో దిగొచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పియిన తర్వాత రాహుల్ గాంధీకి అకస్మాత్తు బీసీల పట్ల ప్రేమను ఒలకపోయడం మొదలుపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇంకా కులగణన నిర్వహించలేదని ఎండగట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లను అమలు చేయవచ్చని, కాబట్టి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ చేసి జీవో ఇవ్వమని ఎందుకు సూచించడం లేదు ? 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో జీవో ఇప్పించాలని రాహుల్ గాంధీకి డిమాండ్ చేశారు.

తాము ఓబీసీనని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయం చేసే అవకాశం లభించిందని, తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా చొరువ తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్ల తరహాలో తెలంగాణ బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని ప్రతిపాదించారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.  గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ముఖ్యమంత్రి అంత దూరం ఆలోచించకుండా ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బీజేపీ కృష్టి చేయాలని, అప్పుడే ఆ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా బీసీ బిల్లు గురించి మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు.  

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిదాటిపోయిందని, 16 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, కాబట్టి రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో అనేక లోపాలు ఉన్నాయని, 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో బీసీలు కేవలం 46 శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారని వివరించారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో హాఫ్ సెంచరీ చేశారని, రాష్ట్రంతో తక్కువ.. ఢిల్లీలో ఎక్కువగా ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని పరిరక్షించడమే కాకుండా అభివృద్ధి చేయడంలో ముందుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, తమిళనాడులో జయలలిత వంటి వారి నాయకత్వంలోని ఆయా పార్టీల ద్వారా ప్రజలకు లబ్ది జరిగిందని అన్నారు

Tags

More News...

Local News  State News 

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ గొల్లపల్లి (మేడిపల్లి) జూలై 9 (ప్రజా మంటలు):    మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గామాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి  సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు. సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) : కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి...
Read More...
Local News 

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ 📍 భీమదేవరపల్లి మండలం, జూలై 9 (ప్రజామంటలు) 🌿 ఆషాడ మాసం చివరదశలో భక్తి, ఆనంద, స్నేహ బంధాలతో సాగిన ఓ మధుర ఘట్టం… భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలను నిర్వహించారు. ప్రకృతి ఒడిలోని హరితవనంలో ఆటపాటలతో, మిఠపలుకులతో, హాస్యాలతో వెలిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిగా...
Read More...
Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...
Local News 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్  .మెట్ పల్లి జులై 7 ( ప్రజా మంటలు) మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆకస్మిక తనిఖీ చేశారు.. పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు..   పాఠశాల విద్యార్థులు హాజరు వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సీజనల్...
Read More...
Local News 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్    మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)   పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం...
Read More...