ఇబ్రహీంపట్నం హత్య కేసులో ఏడుగురు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష

On
ఇబ్రహీంపట్నం హత్య కేసులో ఏడుగురు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష

 జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు

 ఇబ్రహీంపట్నం జూన్ 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):


జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి ఈరోజు కీలక తీర్పును వెలువరించారు.

ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), 109 (దుష్ప్రేరణ), 506 (నేరపూరిత బెదిరింపు) r/w 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద నమోదైన ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

నిందితుల వివరాలు మరియు జరిమానా:
 సుంకే రమేష్, సుంకే రాజు,సుంకే రంజిత్, సుంకే సురేష్, సుంకే లక్ష్మి,సుంకే రాజేశ్వరి మరియు సుంకే దశరథ్
వీరందరూ ఇబ్రహీంపట్నం వాసులు.మొదటి ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరికి రూ. 3500/- చొప్పున, ఏడవ నిందితుని రూ. 4000/- జరిమానా విధించారు..


కేసు పూర్వాపరాలు:

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులైన ఏ1 నుండి ఏ7 వరకు మరియు మృతుడు పడాల రాజారెడ్డి, గాయపడిన పడాల చిన్న రాజారెడ్డి అందరూ ఒకే గ్రామానికి చెందిన మున్నూరుకాపు కులస్థులు. 2021, జూన్ 15వ తేదీ రాత్రి సుమారు 9:40 గంటలకు ఒక వివాహ కార్యక్రమం సందర్భంగా జరిగిన వాగ్వాదం ఈ దారుణ ఘటనకు దారితీసింది.

 సుంకే రమేష్ తన పరువుకు భంగం కలిగిందని భావించి, పడాల రాజారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అతని కుటుంబ సభ్యులైన మిగతా నిందితులు ఈ దాడిలో పాలుపంచుకున్నారు.

 కర్రలతో పడాల రాజారెడ్డిపై దాడికి పాల్పడగా, మిగిలిన నిందితులు ఏ3 నుండి ఏ7 వరకు వారిని రెచ్చగొట్టి, దాడికి సహకరించారు. ఈ ఘటనలో తొలుత నిందితులు చంపాలనే ఉద్దేశ్యంతో పడాల రాజారెడ్డిపై దాడి చేశారు. అక్కడే ఉన్న పడాల రాజారెడ్డి తమ్ముడు పడాల చిన్న రాజారెడ్డి ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతనిపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

గాయపడిన వారిని వెంటనే మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆర్మూర్ వద్ద అదే రోజు రాత్రి 11:55 గంటలకు పడాల రాజారెడ్డి మరణించారు.

దర్యాప్తు అధికారుల కృషికి అభినందనలు:

ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్రావు (FIR నమోదు చేసినవారు), సర్కిల్ ఇన్‌స్పెక్టర్   ఎల్. శ్రీను (నిందితులను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినవారు), అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. మల్లికార్జున్ (ఫోన్: 9885544463), మరియు కోర్టు కానిస్టేబుల్ టి. రంజిత్, పి.సి. 9659, సి.డి.ఓ. మెట్‌పల్లి సర్కిల్ (ఫోన్: 9032780526) CMS ఎస్సై శ్రీకాంత్ మరియు CMS కానిస్టేబుల్ కిరణ్ కుమార్ లను లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. న్యాయం అందించడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు``` .
Tags

More News...

Local News 

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత సారంగాపూర్ జూన్ 30 (ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన పెంబట్ల కురుమ సంఘం సభ్యులు.    సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామంలో బీరయ్య గుడి అభివృద్ధి పనుల నిమిత్తం సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు కాగా పెంబట్ల కుర్మ సంఘ సభ్యులకు 12ఈ...
Read More...
Local News 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం. 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.  (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 30: క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతున్న ఓ నిరుపేద  బాలుడి వైద్య ఖర్చులకోసం ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, గూడూరు గ్రామానికి చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతుల  కుమారుడు రిత్విక్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ జూన్ 30(  ప్రజా మంటలు    ) మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Read More...
Local News 

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము,

 మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము, గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు): ఉద్యోగ విరమణ పదవికి మాత్రమే పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు చేయవచ్చని జిల్లా విద్యాధికారి రాము అన్నారు గొల్లపల్లి మండల కేంద్రంలో భూస జమునా దేవి గెజిటెడ్ హెడ్మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట ఇన్చార్జ్ మండల విద్యాధికారి గొల్లపల్లి, ఉద్యోగ విరమణ సన్మాన...
Read More...
Local News 

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు):  కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో  ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించిన ఘటన సోమవారం ధర్మపురి పట్టణంలో కలకలం రేపింది వ్యక్తి ఆత్మహత్యయత్నానికి సంబందించిన సమాచారం అందుకున్న ధర్మపురి పోలీస్ సీఐ  రామ్ నర్సింహా రెడ్డి హుటాహుటిన తన సిబ్బంది తో...
Read More...
Local News 

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి  ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి  జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతి యుత దీక్షలు చేపట్టారు.  తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జెఎసి నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్...
Read More...
Local News 

వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన గొల్లపల్లి జూన్ 30  (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్,మహాత్మా జ్యోతిభ పూలే పాఠశాలనను రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సతీమణి కాంతా కుమారి  సందర్శించారు. పాఠశాలలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి మరియు నాయకులతో కలిసి మంత్రి సతీమణి...
Read More...
Local News 

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)పట్టణ 35వ వార్డు లో 13 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  భజన మందిరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయటం జరిగింది.ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.తడి పొడి చెత్త వేరు...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల జూన్ 30( ప్రజా మంటలు)               ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జూన్ 30    (   ప్రజా మంటలు) అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని  జిల్లా   ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల...
Read More...
Local News 

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం లోషెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత  అధ్యక్షతనఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు  పై పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జూన్ 30(ప్రజా మంటలు) పట్టణములోని శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. .అనంతరం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.,ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ...
Read More...