స్టీల్ కంపెనీలో రూ 46 లక్షల చోరి - ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్, జూన్ 22 (ప్రజామంటలు):
ఓ కంపనీలో జరిగిన రూ.46లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. సదరు సంస్థ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన పాత సంస్థకే టోకరా వేసి ఏకంగా లాకరు నుంచి రూ.46లక్షలు దొంగిలించి డబ్బులతో పరారీ అవుతుండగా పోలీసుల అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.46.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ ప్రాంతంలో గిరీష్ జైన్ సన్ స్టీల్ పేరుతో స్టీల్ కంపనీ నిర్వహిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి కంపనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి లాకర్ లో ఉన్న రూ.48లక్షలు దొంగిలించి పారిపోయాడు.ఈ విషయాన్ని మరుసటి రోజు గుర్తించిన కంపనీ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ జైన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఆ కంపనీ మాజీ ఉద్యోగి గిరిధారి సింగ్(28)గా గుర్తించారు. మధ్య ప్రదేశ్ పురేలీ ప్రాంతానికి చెందిన గిరిధారి సింగ్(28) ఈ కంపనీలో మూడేళ్ల పాటు పనిచేశాడు. అయితే అతను పనిచేసిన సమయంలో డబ్బులు లాకర్ లో భద్రపరిచే పనులు సైతం చేసేవాడు. కాగా అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కంపనీ యజమాని గిరీష్ జైన్ ఆరు నెలల క్రితం అతనిని పనిలో నుంచి తీసేశాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న గిరిధారి సింగ్ ఈనెల 20 అర్దరాత్రి పాటిగడ్డలోని స్టీల్ కంపనీకి వచ్చాడు. కంపనీ గోడ చాలా చిన్నదిగా ఉండటంతో గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాడు. గోద్రెజ్ లాకర్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న రూ.46 లక్షలు చోరీ చేశాడు . అ డబ్బులతో అదే రోజు రాత్రి సికింద్రాబాద్ కు చేరుకున్న గిరిధారిసింగ్ ఆదిలాబాద్ మీదుగా మధ్య ప్రదేశ్ పురేలీ వెళ్లేందుకు బస్సులో బయలు దేరాడు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 30 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు బస్సులో మధ్య ప్రదేశ్ వెళుతున్నట్లు ఆర్టీసీ బస్పును జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు.
నిందితున్ని ఆదిలాబాద్ పోలీసుల సహాకారంతో మహారాష్ర్ద బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
