ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో భోలక్ పూర్ లోని ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని, పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ లు 175 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు కూడా అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్లను అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం. శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్ లను చూపించారు. జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, నర్సింగ్ రావు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ శేఖర్ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, సతీష్ కుమార్, బాలభారతి, సుజాత శివరామకృష్ణ, ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటేష్, ఎల్లేశ్వర్, జానకిరాం, బిజెపి నాయకులు టి. రాజశేఖర్ రెడ్డి, శివలింగం, మహేష్, కిషన్, రఘురాం, హరినాథ్, నాగరాజు, కిషన్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
