ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో భోలక్ పూర్ లోని ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని, పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ లు 175 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు కూడా అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్లను అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం. శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్ లను చూపించారు. జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, నర్సింగ్ రావు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ శేఖర్ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, సతీష్ కుమార్, బాలభారతి, సుజాత శివరామకృష్ణ, ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటేష్, ఎల్లేశ్వర్, జానకిరాం, బిజెపి నాయకులు టి. రాజశేఖర్ రెడ్డి, శివలింగం, మహేష్, కిషన్, రఘురాం, హరినాథ్, నాగరాజు, కిషన్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
