సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు):
ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులనుపంపిణీ చేశారు. గాంధీ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఐడీహెచ్ కాలనీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత కస్టమ్స్ భవన్ లో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. అమీర్ పేట లో ఎండ వేడిమి నుంచి ప్రజలు సేదా తీరేందుకు చలివేంద్రాలను ప్రారంభించారు. దాసారం బస్తీలో అన్నదానం నిర్వహించి, సనత్ నగర్ బస్టాప్ వద్ద పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ...తన పుట్టిన రోజున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ కోట నీలిమా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ లు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
