ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

(రామ కిష్టయ్య సంగన భట్ల.)

సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ మూల విరాట్టులకు, ప్రత్యేక పూజలు గావించారు.

మహా సంకల్పం, కలశ, గణపతి, విశ్వక్సేన, షోడశో పచార పూజలు, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, అభిషేకం, వస్త్రం, అలంకరణం, హరిద్రం, కుంకుమ, సుగంధ ద్రవ్యం, ధూపం, దీపం, నైవేద్యం, తదనంతరం ఏక, ద్వయ, త్రయ, పంచ, నాగ, నక్షత్ర, కుంభ హారతులు, మంత్ర పుష్పం, ఇత్యాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దైవాల జయంతి సందర్భంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు, రామాయణ, భారత, భాగవ పురాణ పారాయణాలు, నారసింహ శతక పద్యాలు, సంగీతం, సంకీర్తన యుక్త అవధారములు, సనాతన క్రమంలో నిర్వహించారు.

రాష్ట్రంలోనే గాక నారసింహ క్షేత్రాల్లో వేరే ఎక్కడా లేనివిధంగా, ఛిత్తి, శిక్ష, బ్రహ్మ, భృగు, నారాయణం, సున్నాల పన్నం మొదలైన పంచ ఉపనిషత్తులతో పూజించి, స్వామి వారిని అభిషేకించడం, ధర్మపురి క్షేత్రంలో మాత్రమే అనాదిగా ఆచరిస్తున్న నేపథ్యంలో, అర్చకులు వేదవిదులైన పండితులు, నరసింహుని ఉపనిషత్తులతో పంచ సూక్తములతో అభిషేకాలు, సహస్ర నామ అర్చనలు, భజనలు, కీర్తనలతో, వైభవంగా జయంతి వేడుకలను నిర్వహించారు. దేవస్థానం ఏ సి ఈ ఓ సంకటాల శ్రీనివాస్, మార్గదర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ పర్యవేక్షణలో,  వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహ మూర్తి, రమణాచార్య, కిరణ్, విజయ్, వంశీ, అశ్విన్, బొజ్జ సంతోష్, బొజ్జ సంపత్, బొజ్జ రాజగోపాల్ శర్మ, నంబి అరుణ్ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించ బడగా, భక్త్యా వేశాలతో చేసిన భజనలు మైకుల ద్వారా క్షేత్రంలో ప్రతిధ్వనించి, ఆనందాన్ని కలుగజేసాయి. అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక టిక్కెట్లు తీసుకుని పూజాదులలో పాల్గొన్నారు.

మంత్రి, విప్ పూజలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ నారసింహ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. లక్ష్మీ నారసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు అర్చకులు, మంత్రి రాజ నరసింహ, లక్ష్మణ్ కుమార్ కు వైదికాశీస్సులు అందజేశారు.

IMG-20250511-WA0012

 ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నరసింహ నవరాత్రి ఉత్సవ వేడుకలలో ప్రధాన మరియు ముగింపు ఘట్టమైన నరసింహ స్తంభోద్భవ పూజాదికాలను ఆది వారం రాత్రి నిర్వహించారు. సంధ్యా సమయాన ప్రారంభించి, రాత్రి వరకు కొనసాగిన ప్రత్యేక స్తంభోద్భవ కాల విశేష పూజలను, వైదిక మంత్రాలతో, చతుర్వేద ఘోషలతో, అఖండ వైభవంగా, విధి విధాన వేదోక్త సాంప్రదాయ పద్ధతిలో కొనసాగించారు. దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి సభ్యులు,  
సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆధ్వర్యంలో. ప్రధానాలయ ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, రమణ, కిరణ్, వంశీ, మూర్తి, విజయ్ తదితరులు ప్రధానాలయంలో అలంకృత స్థంభానికి, ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. వివిధ హారతులు, మంత్రపుష్పం. అవధార యుక్త పూజలు గావించారు. పురాణ, వేద పక నాలు గావించారు. ఆస్థాన వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ నామ సంకీర్తన భజనలు చేశారు.

Tags

More News...

Local News 

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసిన వెల్దుర్తి గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.  వెల్దుర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, ఎల్లమ్మ గుడిలో వంటశాలకు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,నాయకులు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే11 ( ప్రజా మంటలు ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష.. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)    పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు                                          సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్  విజయవంతం అయిన సందర్భంగా దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్పస్వామి కి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం...
Read More...

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నవి. కాగా ఆదివారం రాత్రి 8 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఫలాలు, పుష్పాలతో వేదికను అలంకరించి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు....
Read More...
Local News 

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 11 (ప్రజా మంటలు)వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి జగిత్యాల జిల్లా కు అవసరమైన డ్రగ్స్ పెండింగ్  బిల్లు మంజూరు,జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ రిపేర్ చేయాలని,జగిత్యాల నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య సేవలు నిమిత్తం 2 ప్రైమరీ హెల్త్...
Read More...
Local News 

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                             సిరిసిల్ల. రాజేంద్ర  శర్మ  జగిత్యాల మే 11(ప్రజా మంటలు)పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ  తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరిక... పిల్లలు కానీ వారికి ఇదొక...
Read More...
Local News  Spiritual  

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి సికింద్రాబాద్, మే 11 (ప్రజామంటలు) : శ్రీనరసింహస్వామి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఆర్.పీ రోడ్డు బాటా సమీపంలో ఉన్న 200 ఏండ్ల నాటి స్వయంభూ  శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులను చెల్లించి, ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల.) సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ...
Read More...
Local News 

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం గొల్లపల్లి మే 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని బిబి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కీర్తిశేషులు రాసమల్ల తిరుపతి ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో  అతని సహచర ఉద్యోగులు మరియు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శులు శ్రీ వేముల ప్రకాష్,గందే రామయ్య జోగినిపల్లి సత్యనారాయణ రావు, ఏం సత్యనారాయణ రావు...
Read More...
Local News 

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు): వృద్ధుల సంరక్షణ చట్టం పై అన్నివర్గాల్లో అవగాహన కల్పించేందుకు గోడ పోస్టర్లను,కరపత్రాలను రూపొందించి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అతికించి ప్రదర్శిస్తున్నామని   తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శనివారం...
Read More...