రాహుల్,సోనియా లపై ఈడి చార్జి షీట్రె పై రేవంత్ రెడ్డి స్పందించక పోవడానికి కారణం ఏమిటి? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఖమ్మం ఏప్రిల్ 20:
ఖమ్మం జిల్లా పర్యటనలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
*కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది... కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదు*
ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం పై సమీక్షించలేదు
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరికలే ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు.
రైతులను పలకరించిన పాపాన పోలేదు... ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడూ లేదు*.జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదు.
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసింది
వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నం చేయడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు
కమ్యూనిస్టు పార్టీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణం.ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి... ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్నార
రైతు భరోసా సగం మందికి రానేలేదు
రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది .60 శాతం మందికి రుణమాఫీ కాలేదు .రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదుపథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి.
ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయింది .కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను కోల్పోయింది
తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తున్నది.ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను నిలదీయండి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భక్త రామదాసు ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు అందించారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టలేదు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలనీ కవిత ప్రజలను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
