అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
శ్రీధర గణపతి శర్మ
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు. మోతే మదన్ స్వరూప దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ్ లక్ష్మీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా నేరెళ్ల శ్రీనివాస్ చారి కుటుంబ సభ్యులు తలంబ్రాలు సమర్పించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, కళ్యాణ అక్షితలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా లోకకళ్యాణార్థం రామకోటి పుస్తకాల ఆవిష్కరణ నిర్వహించారు .రామనామ స్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంపై ఆసీనులు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు
