లోక కళ్యాణార్థం హరిహరాలయంలో రామకోటి పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల ప్రాచీన హరిహరాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా లోక కళ్యాణార్థం భక్తులు అనునిత్యం మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముల వారి నామస్మరణ చేస్తూ రామకోటి రాయడానికి పుస్తకాలను ఆదివారం భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
హరిహరాలయంలో శ్రీ సీతారాముల పరివార విగ్రహాలు సాలగ్రామ శిలచే దశావతారాలు విగ్రహాల చుట్టూ ఉండడమే కాకుండా రామలక్ష్మణ విగ్రహాలు కోర మీసాలు కలిగి ఉండడం ఓ ప్రత్యేకత .అంతేకాకుండా పరమశివుడు నర్మదా బాణం శిలచే రూపుదిద్దుకొని భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నర్మదా కంకర్ బోలా శివశంకర్ అన్న నానుడిలా ప్రతినిత్యం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నర్మదా బాణ రూపుడైన సాంబశివుని అభిషేకించడం ఆలయంలో అనునిత్యం జరిగే క్రతువు. ఇలాంటి మహిమాన్వితమైన ఆలయంలో రామకోటి పుస్తకాలను ఉంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు తమ శక్త్యానుసారం రామకోటి రాసి భక్తి భావాన్ని చాటుకోవడానికి ఆలయంలో పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రామకోటి యజ్ఞక్రతువు ఒక సంవత్సరం లోపు పూర్తి చేయగలమని భక్తులు సంకల్పం చేశారు. ఈ యజ్ఞ సంకల్పాన్ని బుడి అరుణ్ శర్మ భక్తులచే చేయించారు. ఈ కార్యక్రమంలో సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ, నూతనంగా ఆలయ కమిటీ పదవి బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు, మరియు కమిటీ సభ్యులు ,ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
