జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? ఫ్లెక్సీ మార్పుతో మొదలైన చర్చ

On
జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):

జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.

దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో పాటు మరికొందరు మాజీలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహద్యమంతనాలు పార్టీలోని అసంతృప్తులను ఒక దగ్గరికి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మార్చ్ నెల కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండాన్ని తెచ్చిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డా. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ పరిణామం తరువాత జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాల్లో తిరుగుబాటు కౌన్సిలర్లను గెలిపించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.

ఉగాది తరువాత కీలక నిర్ణయం?

గత కొంతకాలంగా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని జీవన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన వెంటనే పార్టీ మారుతారా, లేక మరికొంత కాలం వేచి చూస్తారా అన్నది ప్రస్తుతం “లక్ష డాలర్ల ప్రశ్న”గా మారింది.

వామపక్ష భావజాలం నుంచి కాంగ్రెస్ వరకు

జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం విభిన్న దశలను దాటింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పటి జనతా పార్టీతో సంబంధం కొనసాగించారు.

1981లో సమితి అధ్యక్ష ఎన్నికల్లో మల్యాల ప్రాంతం నుంచి పార్టీరహితంగా గెలిచారు. తరువాత 1982లో మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశాన్ని కూడా వదిలేశారు

కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆయనను ఢిల్లీకి కూడా పిలిచినా ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు రాలేదు.

ఆర్థికంగా బలమైన వనరులు లేకపోవడం వల్లనే ఆ బాధ్యత తీసుకోలేదని ఆయన సమీప వర్గాలు చెబుతాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అడ్డంకిగా మారారనే భావన అప్పటి రాజకీయ పరిణామాల్లో కనిపించింది.

పార్టీ అంతర్గత విభేదాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై జీవన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు కూడా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలకు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాను పార్టీని విడిచిపెడతానని జీవన్ రెడ్డి పలుమార్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.

బీజేపీ వైపు వెళతారా?

ఇప్పుడు ఆయన తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలతో జీవన్ రెడ్డి పెద్దగా ఏకీభవించరని ఆయన సన్నిహితులు చెబుతారు.

అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌తో కుటుంబపరమైన అనుబంధం ఉండటం వల్ల ఆయన బీజేపీ వైపు వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసిన నాయకుడు ఆ పార్టీలో చేరడం అనేది రాజకీయంగా పెద్ద మలుపే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్‌ఎస్‌లోకి వెళితే పరిస్థితి?

ఇక మరో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆ పార్టీలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ వంటి నాయకులు ఉన్నారు.

అయితే వీరంతా ప్రారంభం నుంచే జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్‌లో చేరినా స్థానికంగా వర్గపోరు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పద్మవ్యుహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

భవిష్యత్తులో ఆయన స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది స్పష్టంగా కనిపించడం లేదు.

ఒక రాజకీయ పాఠమా?

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పార్టీ కోసం పోరాడిన సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో చూపిస్తున్న ఉదాహరణగా కూడా చూడవచ్చు.

జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటన్నది మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

More News...

Crime 

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష జగిత్యాల: జూలై 29  (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్‌కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత...
Read More...
State News 

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):   కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల...
Read More...
State News 

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు): గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,...
Read More...
Local News 

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు    జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Local News 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.  జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్. 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.    జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.  జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...
Read More...
State News 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత    సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన...
Read More...
State News 

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్ హైదరాబాద్, జూలై 28: హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం...
Read More...
State News 

జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

 జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక...
Read More...
Filmi News  State News 

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు): ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....
Read More...
Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...