జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? ఫ్లెక్సీ మార్పుతో మొదలైన చర్చ

On
జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):

జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.

దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో పాటు మరికొందరు మాజీలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహద్యమంతనాలు పార్టీలోని అసంతృప్తులను ఒక దగ్గరికి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మార్చ్ నెల కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండాన్ని తెచ్చిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డా. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ పరిణామం తరువాత జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాల్లో తిరుగుబాటు కౌన్సిలర్లను గెలిపించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.

ఉగాది తరువాత కీలక నిర్ణయం?

గత కొంతకాలంగా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని జీవన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన వెంటనే పార్టీ మారుతారా, లేక మరికొంత కాలం వేచి చూస్తారా అన్నది ప్రస్తుతం “లక్ష డాలర్ల ప్రశ్న”గా మారింది.

వామపక్ష భావజాలం నుంచి కాంగ్రెస్ వరకు

జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం విభిన్న దశలను దాటింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పటి జనతా పార్టీతో సంబంధం కొనసాగించారు.

1981లో సమితి అధ్యక్ష ఎన్నికల్లో మల్యాల ప్రాంతం నుంచి పార్టీరహితంగా గెలిచారు. తరువాత 1982లో మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశాన్ని కూడా వదిలేశారు

కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆయనను ఢిల్లీకి కూడా పిలిచినా ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు రాలేదు.

ఆర్థికంగా బలమైన వనరులు లేకపోవడం వల్లనే ఆ బాధ్యత తీసుకోలేదని ఆయన సమీప వర్గాలు చెబుతాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అడ్డంకిగా మారారనే భావన అప్పటి రాజకీయ పరిణామాల్లో కనిపించింది.

పార్టీ అంతర్గత విభేదాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై జీవన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు కూడా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలకు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాను పార్టీని విడిచిపెడతానని జీవన్ రెడ్డి పలుమార్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.

బీజేపీ వైపు వెళతారా?

ఇప్పుడు ఆయన తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలతో జీవన్ రెడ్డి పెద్దగా ఏకీభవించరని ఆయన సన్నిహితులు చెబుతారు.

అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌తో కుటుంబపరమైన అనుబంధం ఉండటం వల్ల ఆయన బీజేపీ వైపు వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసిన నాయకుడు ఆ పార్టీలో చేరడం అనేది రాజకీయంగా పెద్ద మలుపే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్‌ఎస్‌లోకి వెళితే పరిస్థితి?

ఇక మరో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆ పార్టీలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ వంటి నాయకులు ఉన్నారు.

అయితే వీరంతా ప్రారంభం నుంచే జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్‌లో చేరినా స్థానికంగా వర్గపోరు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పద్మవ్యుహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

భవిష్యత్తులో ఆయన స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది స్పష్టంగా కనిపించడం లేదు.

ఒక రాజకీయ పాఠమా?

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పార్టీ కోసం పోరాడిన సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో చూపిస్తున్న ఉదాహరణగా కూడా చూడవచ్చు.

జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటన్నది మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు    జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
Read More...
Local News 

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో...
Read More...
Local News 

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మంచిర్యాలలో...
Read More...
Crime  State News 

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు): (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి...
Read More...
State News 

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా...
Read More...
State News 

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి...
Read More...
Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...