సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

On

 

జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)

ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష


సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్‌ పర్సన్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

IMG-20260722-WA0196

జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరించారు. జాతీయ రహదారులపై పార్కింగ్ నిషేధం, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవస్థ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, హైవే భద్రతా పరిధిలో అనధికార వ్యాపారాల నియంత్రణ, హైవే సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, హైవే సర్వేలెన్స్ పెట్రోలింగ్, అత్యవసర స్పందన వ్యవస్థ, వే సైడ్ అమెనిటీస్ (డబ్ల్యూ ఎస్ ఏ), స్పీడ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, సైన్‌బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు, ప్రతి 75 కిలోమీటర్లకు ట్రక్ లే-బై సదుపాయాలు, బ్లాక్‌స్పాట్ల అభివృద్ధి, హైమాస్ట్ లైటింగ్, అంతర్‌రాష్ట్ర సమన్వయం, సమగ్ర స్పందన నివేదికలపై సమావేశంలో వివరించారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,* జిల్లాలో డిస్ట్రిక్ట్ హైవే సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.

  
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని, వరద ముంపునకు గురయ్యే రహదారులపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. గుంతలను వెంటనే పూడ్చి దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.

ప్రధాన రహదారులపై లైటింగ్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్లాక్‌ స్పాట్ల వద్ద హైమాస్ట్ లైట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.

 ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంట ఆక్రమణలను తొలగించి నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 


ప్రతి 15 రోజులకు ఒకసారి రవాణా శాఖ, పోలీసు శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను సమీక్షించాలని ఆదేశించారు.

 జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్–1033పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

IMG-20260722-WA0197

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ,* అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై నిరంతర అవగాహన కల్పిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గత నెలతో పోలిస్తే ఈ నెలలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులు, ఈ-చలాన్ అమలు వివరాలను సమావేశంలో వెల్లడించారు. వర్షాకాలంలో వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాహనదారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా శాఖ, పోలీసు శాఖ, ఆర్&బీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు) ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్‌ పర్సన్ బి. సత్యప్రసాద్...
Read More...
Local News 

రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర

రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర    జగిత్యాల జూలై  22 (ప్రజా మంటలు) రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం  గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో  ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం...
Read More...
State News 

ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత

ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం...
Read More...
State News 

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు): ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర...
Read More...
Local News 

శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి   జల అభిషేకం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి   జల అభిషేకం    జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో  అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు...
Read More...
Local News 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి  జగిత్యాల    జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. జిల్లా కేంద్రంలోని...
Read More...
Local News 

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు)  సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ  దంపతులు పాఠశాల యూనిఫామ్స్  అందజేశారు. శ్రీనివాస్  తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి ఈ...
Read More...
State News 

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు): సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప...
Read More...
Local News  State News 

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్ ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు): రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్‌వర్క్‌తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో...
Read More...
Local News 

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు    జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను  దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు... పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు       జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు ) కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి  డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి...
Read More...
Local News 

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి  ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో  వర్షపు నీరు సంరక్షణ...
Read More...