దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్

రూ.4,558.89 కోట్ల వ్యాపారం.. 86 శాఖలతో విస్తరణ

On
దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్

ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్
జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు):


రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్‌వర్క్‌తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

26 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బ్యాంకు ప్రస్తుతం 9,36,346 మంది ఖాతాదారులతో మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఎదిగిందన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించిన ఖాతాదారులు, సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో డైరెక్ట్ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలను ప్రారంభించామని, 202 బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా సేవలను వినియోగదారుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.27.21 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, స్టాట్యూటరీ ఆడిటర్లచే ‘ఏ’ క్లాస్ బ్యాంకుగా వర్గీకరించబడిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి రూ.6,204.06 కోట్ల వ్యాపార లక్ష్యంతో పాటు 1.5 లక్షల కొత్త ఖాతాదారులను చేర్చుకునే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇటీవల 24 కొత్త శాఖలను ప్రారంభించడంతో మొత్తం శాఖల సంఖ్య 86కు చేరిందన్నారు. త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్, సాంకేతిక ఆధారిత మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అనంతరం బ్యాంకు సీఈఓ వనమాల శ్రీనివాస్ 2026 మార్చి 31 నాటికి ఆడిటెడ్ జమ–ఖర్చులు, ఆస్తులు–అప్పులు, లాభ–నష్టాల నివేదికలను సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే డిపాజిట్లలో 31.63 శాతం వృద్ధి సాధించి రూ.2,356.68 కోట్లకు చేరుకున్నామని, రుణాల్లో 38.10 శాతం వృద్ధితో రూ.1,868.92 కోట్ల రుణ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రూ.574 కోట్ల పెట్టుబడులు, రూ.27.21 కోట్ల నికర లాభంతో బ్యాంకు బలమైన ఆర్థిక స్థితిని సాధించిందన్నారు.

బ్యాంకు గ్రాస్ ఎన్‌పీఏ 1.02 శాతంగా, నెట్ ఎన్‌పీఏ సున్నా శాతంగా ఉందని తెలిపారు. 71.87 శాతం ప్రాధాన్యతా రంగ రుణాలను అందించామని చెప్పారు. 2000 సంవత్సరంలో కేవలం ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమైన బ్యాంకు ప్రస్తుతం 737 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.

ఖాతాదారుల సౌకర్యార్థం ఏఈపీఎస్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, టోల్‌ఫ్రీ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 132 ఆన్‌సైట్ ఏటీఎంల ద్వారా రూ.1,531.44 కోట్ల లావాదేవీలు, 670.37 లక్షల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయని వెల్లడించారు.

607 కుటుంబాలకు బీమా పరిహారం

సామాజిక బాధ్యతలో భాగంగా గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని సీఈఓ వనమాల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 607 మంది ఖాతాదారుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని అందించి అండగా నిలిచామని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు మరణించిన ఖాతాదారులు దుంపాల రాజ్‌కుమార్, దేవి చంద్రయ్య, మేకల రవి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎస్. రవికుమార్, డైరెక్టర్లు బి. మల్లేశం, జె. ప్రసాద్, ఆర్. సాంబమూర్తి, జక్కని రాజమూర్తి, డింగి కరుణశ్రీ, బాశెట్టి పద్మజ, వానాల శ్రీనివాస్, ఆర్. సతీష్, బి. విజయ్, గెత్తి దయాకర్, ఎస్. సూర్యప్రకాష్ తదితరులు, సభ్యులు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదిని.

Join WhatsApp

More News...

Local News 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి  జగిత్యాల    జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. జిల్లా కేంద్రంలోని...
Read More...
Local News 

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు)  సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ  దంపతులు పాఠశాల యూనిఫామ్స్  అందజేశారు. శ్రీనివాస్  తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి ఈ...
Read More...
State News 

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు): సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప...
Read More...
Local News  State News 

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్ ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు): రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్‌వర్క్‌తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో...
Read More...
Local News 

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు    జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను  దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు... పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు       జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు ) కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి  డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి...
Read More...
Local News 

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి  ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో  వర్షపు నీరు సంరక్షణ...
Read More...
Local News 

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం    జగిత్యాల జులై 15(ప్రజా మంటలు) జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో  సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు  అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం...
Read More...
Local News 

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో...
Read More...
State News 

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు) యూసుఫ్‌గూడ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...
Crime  State News 

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ.. ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):   పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం  జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో...
Read More...