ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కవిత అన్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై సూచనలు ఇవ్వడానికి తమను ఆహ్వానించినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులకు తన సూచనల ద్వారా కొంతైనా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో కలిసి పోరాడిన వ్యక్తిగా, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని అంతర్గత వేదికల్లో పోరాడిన వ్యక్తిగా తాను బలయ్యానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
స్వతంత్ర సమరయోధుల పథకాలను అధ్యయనం చేయాలి
ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరిత అంశాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనను కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మందిలో గుర్తింపు పొందిన వారికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్గా గుర్తించి ప్రత్యేక నిబంధనల ద్వారా పెన్షన్లు అందించిన అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
జైలు, ఎఫ్ఐఆర్, పోలీస్ దాడులు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యం
తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు ఎదుర్కొన్నవారిని ఆలస్యం లేకుండా గుర్తించాలని కవిత సూచించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. అండర్గ్రౌండ్లో పనిచేసినవారు, హౌస్ అరెస్ట్కు గురైనవారు, ఆస్తి నష్టం, వైకల్యం, పోలీస్ అణచివేతకు గురైనవారిని కూడా గుర్తించాలన్నారు.
ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవారు, ముళ్లకంచెలపై పడి తీవ్రంగా గాయపడిన రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డి వంటి వారి త్యాగాలను గుర్తించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు కోల్పోయినవారు, ఉపాధ్యాయులు, డీలర్షిప్లు కోల్పోయినవారి విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం
ఉద్యమకారులు మరణించిన సందర్భంలో వారి భార్యకు, ఆమె లేని పక్షంలో పిల్లలకు, తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత అన్నారు. సంక్షేమ పథకాలు స్కామ్లకు దారితీయకుండా కఠినమైన పారదర్శక విధానం రూపొందించాలని సూచించారు.
ఉద్యమకారుల వివరాల సేకరణలో సహచర ఖైదీలతో పాటు విద్యావంతుల వేదికలు, ఉద్యమ సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో పనిచేసిన వేలాది మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాలపరిమితిలో గుర్తింపు పూర్తి చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం విచారకరమని కవిత అన్నారు. ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాతే కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. నిర్ణయం తీసుకునే సమయం ఏదైనా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీ నుంచే ఉద్యమకారులకు ప్రయోజనాలు వర్తించేలా చూడాలని కోరారు.
జార్ఖండ్లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, శాశ్వత కమిటీ వంటి విధానాలు అమలులో ఉన్నాయని కవిత తెలిపారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో అమలవుతున్న పథకాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
“కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది. అది తప్పని ఈ కమిటీ నిరూపించాలి. ఒక కాలపరిమితిలో ఉద్యమకారులను గుర్తించి, వారికి ఏ విధంగా ప్రయోజనం కల్పిస్తారో స్పష్టంగా ప్రకటించాలి” అని కల్వకుంట్ల కవిత కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... 