ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కవిత అన్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై సూచనలు ఇవ్వడానికి తమను ఆహ్వానించినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులకు తన సూచనల ద్వారా కొంతైనా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో కలిసి పోరాడిన వ్యక్తిగా, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని అంతర్గత వేదికల్లో పోరాడిన వ్యక్తిగా తాను బలయ్యానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
స్వతంత్ర సమరయోధుల పథకాలను అధ్యయనం చేయాలి
ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరిత అంశాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనను కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మందిలో గుర్తింపు పొందిన వారికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్గా గుర్తించి ప్రత్యేక నిబంధనల ద్వారా పెన్షన్లు అందించిన అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
జైలు, ఎఫ్ఐఆర్, పోలీస్ దాడులు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యం
తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు ఎదుర్కొన్నవారిని ఆలస్యం లేకుండా గుర్తించాలని కవిత సూచించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. అండర్గ్రౌండ్లో పనిచేసినవారు, హౌస్ అరెస్ట్కు గురైనవారు, ఆస్తి నష్టం, వైకల్యం, పోలీస్ అణచివేతకు గురైనవారిని కూడా గుర్తించాలన్నారు.
ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవారు, ముళ్లకంచెలపై పడి తీవ్రంగా గాయపడిన రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డి వంటి వారి త్యాగాలను గుర్తించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు కోల్పోయినవారు, ఉపాధ్యాయులు, డీలర్షిప్లు కోల్పోయినవారి విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం
ఉద్యమకారులు మరణించిన సందర్భంలో వారి భార్యకు, ఆమె లేని పక్షంలో పిల్లలకు, తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత అన్నారు. సంక్షేమ పథకాలు స్కామ్లకు దారితీయకుండా కఠినమైన పారదర్శక విధానం రూపొందించాలని సూచించారు.
ఉద్యమకారుల వివరాల సేకరణలో సహచర ఖైదీలతో పాటు విద్యావంతుల వేదికలు, ఉద్యమ సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో పనిచేసిన వేలాది మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాలపరిమితిలో గుర్తింపు పూర్తి చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం విచారకరమని కవిత అన్నారు. ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాతే కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. నిర్ణయం తీసుకునే సమయం ఏదైనా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీ నుంచే ఉద్యమకారులకు ప్రయోజనాలు వర్తించేలా చూడాలని కోరారు.
జార్ఖండ్లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, శాశ్వత కమిటీ వంటి విధానాలు అమలులో ఉన్నాయని కవిత తెలిపారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో అమలవుతున్న పథకాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
“కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది. అది తప్పని ఈ కమిటీ నిరూపించాలి. ఒక కాలపరిమితిలో ఉద్యమకారులను గుర్తించి, వారికి ఏ విధంగా ప్రయోజనం కల్పిస్తారో స్పష్టంగా ప్రకటించాలి” అని కల్వకుంట్ల కవిత కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం... ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు) సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు. శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి
ఈ... సూపర్ ఎల్నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత
గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి
కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు):
సూపర్ ఎల్నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప... దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్
ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు):
రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్వర్క్తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో... మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు
జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు...
పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ... కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు )
కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి... ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్
మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో వర్షపు నీరు సంరక్షణ... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం
జగిత్యాల జులై 15(ప్రజా మంటలు)
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం... చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... 