చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెద్ద మిల్లర్లతో ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని, చిన్న మిల్లర్లను మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
కవిత మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో 8 నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించి రైతులను నష్టపరిచారని, ఈ వ్యవహారంలో సుమారు రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే పెద్ద బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద నుంచి ప్రభుత్వానికి దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. మరోవైపు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై విచారణలు, కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు భరించలేక కరీంనగర్కు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో లక్షా 40 వేల టన్నుల దొడ్డు బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు కిలో రూ.48 చొప్పున విక్రయించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం అదే బియ్యాన్ని ముందుగా రూ.24, తర్వాత రూ.21.70కు విక్రయించేందుకు టెండర్లు పిలిచిందని కవిత ఆరోపించారు. ఈ టెండర్ను కరీంనగర్కు చెందిన ఓ రైస్ మిల్లర్కు అప్పగించారని, దీనిపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికే 10 వేల టన్నుల బియ్యాన్ని లిఫ్ట్ చేశారని పేర్కొన్నారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలిపైనా కవిత విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గోదాముల అద్దెలు, వడ్డీల భారం కారణంగా చిన్న రైస్ మిల్లర్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. పెద్ద మిల్లర్లకు ఇచ్చిన ధరలకే చిన్న రైస్ మిల్లర్లకు కూడా నిల్వ బియ్యాన్ని విక్రయించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
చిన్న రైస్ మిల్లర్లకు వన్టైమ్ సెటిల్మెంట్ అమలు చేయాలని, పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద మిల్లర్ల అక్రమాలపై చర్యలు తీసుకోకుండా చిన్న మిల్లర్లపై మాత్రమే కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఏ రైస్ మిల్లునైనా తనిఖీ చేయడానికి సిద్ధమని, పెద్ద మిల్లర్ల వద్ద భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
చివరగా, ప్రస్తుతం ఉన్న బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయాలని, చిన్న రైస్ మిల్లర్లకు తెలంగాణ రక్షణ సేన పూర్తి అండగా ఉంటుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)
యూసుఫ్గూడ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్... రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..
ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం
పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా... ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో... కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు
హైదరాబాద్ 12 జూలై (ప్రజా మంటలు) :
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత పైన చేసిన వాఖ్యల పైన శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా స్పందించారు...... జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం
జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ... ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి
జగిత్యాల జులై 12(ప్రజా మంటలు) జిల్లాలో బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఎస్సీ గ్రూప్-1లోని 15 ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును ఆ కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేసింది.
జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా... లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో పాటు అంతర్జాతీయ నేరాలపై విచారణకు రంగం సిద్ధంవాషింగ్టన్/న్యూఢిల్లీ జూలై 12: భారతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని (ఎక్స్ట్రడిషన్) అమెరికా న్యాయశాఖ (US Department of Justice - DoJ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్లోని జైలులో ఉన్న బిష్ణోయ్పై అమెరికా దాఖలు చేసిన అభియోగాల... తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు... బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు):
బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూ... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు
హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.... తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి... 