బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
అరవింద్–జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా?
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లో కలిసి బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశానని తెలిపారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు.
కేంద్ర మంత్రి జువెల్ ఓరం రాయికల్ పర్యటన సందర్భంగా జగన్నాథ్పూర్ బ్రిడ్జి మంజూరుకు హామీ ఇచ్చారని, అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎస్టీ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి తొలి సంతకం చేశారని, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడంతో మళ్లీ టెండర్ ప్రక్రియ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు.
"2012లో మంజూరైన కోటి రూపాయలు ఏమయ్యాయి?"
2012లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బోర్నపల్లి బ్రిడ్జికి రూ.1 కోటి మంజూరైందని అధికారులతో కలిసి ప్రజలకు ప్రకటించారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజలు సమాధానం కోరుతున్నారని అన్నారు.
అరవింద్–జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా?
గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి పనిచేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
పీఎం జన్మన్ నిధులపై ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం కింద రావాల్సిన నిధుల విషయంలో మాజీ మంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
"తెలిసిన కాంట్రాక్టర్తో పని చేయొచ్చన్న వ్యాఖ్య ఆశ్చర్యం"
రాయికల్లో జరిగిన ప్రెస్మీట్లో "తెలిసిన కాంట్రాక్టర్ను తీసుకొచ్చి పని చేయించొచ్చు" అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారని, గతంలో జగిత్యాలలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తనకు తెలిసిన కాంట్రాక్టర్తో పనులు చేయిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డారని విమర్శించిన వారు, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేయడం విరుద్ధమని అన్నారు.
బ్రిడ్జిల నిర్మాణంపై ప్రశ్నలు
రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి హయాంలో బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జితో పాటు ఇటిక్యాల–రామారావుపల్లి, రామాజీపేట, కోనాపూర్, మైతాపూర్ బ్రిడ్జిల నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ విమర్శలు
గత 25 ఏళ్లుగా టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు రహస్య ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, గట్టు సతీష్, రాయికల్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, పాదం రాజు, సురేందర్ నాయక్, ప్రసాద్, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్, భూమేష్, నక్కల రవీందర్ రెడ్డి, రేపల్లె హరికృష్ణ, కుసరి అనిల్, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, వీరబత్తిని శ్రీనివాస్, బొలిశెట్టి గంగారెడ్డి, అబ్బూరి మల్లేశం గౌడ్, నలువల సురేష్, మహేశ్వర్ రావు, విద్యాసాగర్, సాయి, దయాల్, శరత్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్
జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)
కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్... బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లో... ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.
జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :
జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల... హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని సీఎస్కు ఆదేశం
కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా?
హైదరాబాద్, జూలై 27:
హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని... సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం
జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) సనాతనంగా సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది.
ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం... ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..
సెల్యూట్ టు ది లీడర్...
నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు.
అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.
అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...
రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్... కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు
గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్... గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం. మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.
జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113)
చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన... విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) :
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.... కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కొండగట్టు జులై 25( ప్రజా మంటలు)
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ , శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు... ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) :
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు,... విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్... 