ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరు
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాం
గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడతారని ఆమె హెచ్చరించారు.
విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ ప్రతిపాదనలను తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ఒక్కో పాఠశాలకు సుమారు రూ.146 కోట్లు ఖర్చు చేయనున్నారని, మొత్తం 72 పాఠశాలల నిర్మాణానికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ పనుల్లో సగానికి పైగా కాంట్రాక్టులు మేఘా, కేఎంవీ సంస్థలకే దక్కాయని ఆరోపించారు.
ఈ సంస్థలు 5 శాతం అదనపు కోట్ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.600 కోట్లకు పైగా అదనపు భారం పడుతోందని కవిత అన్నారు. 72 పాఠశాలల టెండర్లలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెండర్లలో ‘రింగ్’ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ఎంపీకి చెందిన ‘వెలుగు’ పత్రికలోనే దీనిపై వార్త ప్రచురితమైందని ఆమె అన్నారు.
“గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యం. కానీ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. పిల్లలకు ఇస్తామని చెప్పిన బ్రేక్ఫాస్ట్ కూడా అందడం లేదు” అని కవిత విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేస్తే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికల విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ కాంట్రాక్టులు కూడా అదే సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని ఆరోపించారు.
“గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని మూసివేసి గ్రామాల్లోకి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. బడ్జెట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారు” అని కవిత అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా తగ్గిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుకు ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తోందని, బయట మార్కెట్లో గుడ్డు ధర రూ.8గా ఉందని కవిత తెలిపారు. విద్యార్థులకు వారానికి మూడు రోజులు కాకుండా ఐదు రోజులు గుడ్డు అందించాలని, ఒక్కో గుడ్డుకు చెల్లించే ధరను రూ.8కు పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను తెలంగాణ రక్షణ సేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని కవిత స్పష్టం చేశారు. గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలని, దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వల్ల బాలికలు, పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితిలో, ముందుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని కవిత పేర్కొన్నారు. గ్రామ సర్పంచులు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
“ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడతారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేసే కుట్రలను ప్రజలతో కలిసి తిప్పికొడతాం” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు) సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు. శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి
ఈ... సూపర్ ఎల్నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత
గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి
కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు):
సూపర్ ఎల్నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప... దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్
ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు):
రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్వర్క్తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో... మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు
జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు...
పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ... కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు )
కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి... ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్
మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో వర్షపు నీరు సంరక్షణ... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం
జగిత్యాల జులై 15(ప్రజా మంటలు)
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం... చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)
యూసుఫ్గూడ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్... 