జాతీయ క్రీడా దినోత్సవం క్రీడ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ టీం ను అభినందించిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జగిత్యాల మినీ స్టేడియంలో జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో క్రికెట్ మరియు బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలు గా నిలిచిన పోలీస్ టీం సిబ్బంది జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా క్రికెట్ లో మొదటి బహుమతి సాధించిన టీం కెప్టెన్ వినోద్ రెడ్డి మరియు జట్టు సభ్యులను, బ్యాట్మెంటన్ పోటీ లో విజేతగా నిలిచిన కానిస్టేబుల్ రాజేందర్ ను ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని అన్నారు. క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుంది, అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుంది. క్రీడల్లో ప్రతిభ చూపిన సిబ్బంది భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించాలని అని అన్నారు.
ఎస్పీ ని కలిసిన వారిలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు వినోద్ రెడ్డి, దినేష్, సుమన్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
