పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న
విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు
- టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా
హైదరాబాద్ ఏప్రిల్ 02:
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక సేవలను కూడా బీజేపీ ప్రభుత్వం ఆపివేసిందని టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా అన్నారు.
ఆయన ఒక ప్రకటన చేస్తూ, గల్ఫ్ ఏజెంట్ల వల్ల మోసపోయిన వారిని ఆదుకోవడంలో ఎంపీ లు కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదని అన్నారు.
ఇంకా, మలేసియాలో గత మూడు సంవత్సరాలుగా ఎజెంటు మోసానికి బలై నరకయాత్ర అనుభవిస్తూ ఎరగట్ల మండలానికి చెందిన పోత్కూరి లింగారెడ్డి ఈ రోజు స్వదేశానికి చేరుకున్నాడు. ఇవన్నీ చూసిన గ్రామస్తులు మరియు బంధువులు ఆవేశానికి గురై ఆనందంతో కంట తడపెడుతూ వారి ఆవేదన వాళ్ళ హక్కు అన్నారు. వర్షకొండకు చెందిన ఒక ఎజెంటు 90 వేల రూపాయలు తీసుకొని మలేసియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విసిట్ విస్పాపై పంపడం జరిగినది. మలేసియాలో చేరిన నుండి సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటికి ఒక రూపాయి కూడా పంపకుండా అక్కడ ఇక్కడ తలదాచుకుంటూ కాలం గడిపాడు. పోత్కూరి లింగారెడ్డి గత సంవత్సరం ఇంటికి రావాల్సిందిగా ఔట్ పాస్పోర్ట్ వున్న ఎయిర్ టికెట్ డబ్బులు లేకపోవడంతో ఔట్ పాస్పోర్ట్ టైం కూడా ముగిసిపోయింది.
గత 3 నెలలు క్రితం ఓ బస్సు ప్రమాదంలో కాలు జారి క్రింద పడడంతో మోకాలు చిప్ప పగిలిపోయినది. ఇట్టి విషయాన్ని వీడియో తీసి ఎరగట్ల గ్రామస్తుడు మాజీ ఎంపీటీసీ , జగిత్యాలకు చెందిన టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషాకు ఫోన్ ద్వారా తెలీజేయడం జరిగినది.
విషయం తెలుసుకున్న చాంద్ పాషా న్యాయ సలహాలతో భారత ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీ మలేషియాకు ఈ మెయిల్ సమాచారం పంపడం జరిగినది. ఇట్టి విషయాన్ని పత్రికా ప్రకటనలో చూసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ రెడ్డి మలేసియా నుండి ఇండియా రావడానికి ఎయిర్ టికెట్ కొని ఇవ్వడం జరిగినది. పోత్కురి లింగారెడ్డి స్వంత బావ N. శేఖర్ రెడ్డి Rs.35000 హాస్పిటల్ ఖర్చులకు మలేషియాకు పంపడం జరిగినది, మరియు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి రావడానికి అంబులెన్సు ఖర్చులు కూడా భరించుకున్నాడు.
మలేసియాలో వున్న తెలుగు అసోసియేషన్ బృందం నాయకుడు సత్యం దాదాపు Rs.1,10,000 (ఒక లక్ష పది వేల రూపాయలు) మలేసియా ప్రభుత్వానికి ఓవర్ స్టే పెనాలిటీ చెల్లించడం జరిగినది. అంతేకాక 2 నెలలు 15 రోజులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని పొత్కూరి లింగారెడ్డి బాగోగులు చూసుకొని నిన్న అనగా 30-04-2025 రోజున మలేసియా ఎయిర్లైన్ ద్వారా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు.
తెలుగు వారికి విదేశాల్లో అస్ట కష్టాలు మొదలయ్యాయి . ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తెలుగోడు చందాలు వేయించుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది.
2006 సంవత్సరం నుండి 2014 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాంద్ పాషా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించిన వెంటనే లక్షల మంది భావితులను కేంద్ర ప్రభుత్వ ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ ఎంత ఖర్చు అయిన భరించి ఇండియా రప్పించినారు.
కాని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ సేవలు పూర్తిగా నిలిపివేయ పడ్డాయి. ఇట్టి వైఫల్యాన్ని కేంద్రాన్ని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల లింగారెడ్డి వంటి వాళ్ళు కష్టాలు ఎదుర్కుంటూ విధేశంలోనే మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఇట్టి అంశాలను పార్లమెంటులో లేవదీయక పోవడం ఆశ్చార్యానికి గురిచేస్తుంది. లింగారెడ్డి లాంటి ఎందరో అమాయకలు ఏజెంట్లు మోసాలకు గురై జైలు పాలు అవుతున్నారు. రాష్ట్ర కేంద్ర నాయకలు ఏజెంట్లు కు వత్తాసు పలకడం ద్వారా ఇలాంటి మోసాలకు పోలీసు శాఖ వారు కూడా అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా బాధితులకు ఇండియన్ హై కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా బాధితులను ఇండియా రప్పించవచ్చని. మాజీ విదేశాంగ మంత్రి స్వర్గీయ సుష్మ స్వరాజ్ ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ, విదేశాల్లో చిక్కుకున్న బాధితులను ఇండియా క్షేమంగా రప్పించుటకు ప్రయత్నం చేయాలని ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ Mr. షేక్ చాంద్ పాషా డిమాండు చేస్తున్నారు. లేని యెడల మరో ఎన్ఆర్ఐ బాధితుల ఉద్యమం తెరపైకి వస్తుందని హెచ్చరించారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
