సీతా రామాంజనేయ ఆలయంలో బ్రహ్మోత్సవాలు

On
సీతా రామాంజనేయ ఆలయంలో బ్రహ్మోత్సవాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల...
  9440595494)

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల
అమాత్యులు దివంగత జువ్వాడి రత్నాకర్ రావు స్వగ్రామమైన ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్లో నూతన నిర్మిత శ్రీసీతా రామాంజనేయ ఆలయంలో  వార్షిక తిరు 
కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా, ఘనంగా నిర్వహించ నున్నారు. దివంగత రాష్ట్ర మంత్రి రత్నాకర్ రావు కు చెందిన 10 గుంటల స్థలాన్ని దానం చేయగా, సదరు స్థలంలో, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో, 20శాతం క్రింద 6.20 లక్షల విరాళాలను చెల్లింపజేసి, దేవాదాయ శాఖ సర్వ శ్రేయో నిధి ద్వారా 16.50లక్షల రూపాయల మంజూరీ, 5 లక్షలు వేములవాడ దేవస్థాన నిధులకు తోడు 10 లక్షల వ్యయంతో ముఖద్వారం, అర్చిగేటు , ప్రహారీ గోడ ఆది పనులను, మాజీ మంత్రి కుమారులు  నర్సింగరావు, కృష్ణారావుల చేయూతతో 37 వేలు విగ్రహాలకు, 1లక్ష రూపాయలు గ్రానైటు, పాలరాతి పరిచే పనులను పూర్తి చేసి, సంబందిత నూతన ఆలయాన్ని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా చేశారు.

IMG-20250404-WA0002

అనంతరం దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను 2009 సంవత్సరం మార్చి 12 నుండి 15 వరకూ ప్రముఖ యాజ్ఞకులు శ్రీమాన్ నంబి వేణుగోలాచార్య ఆధ్వర్యంలో, వేద పండితులచే నిర్వహింపగా, జువ్వాడి రత్నాకర్ రావు దంపతులచే  కార్యక్రమం నిర్వహించ బడగా, పరమహంస 
పరి వ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ జ్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ శని వారం సాయంత్రం 4గంటలకు కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, రుద్విగ్వరణం రక్షా బంధనం, మృత్సం గ్రహణం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, భజన సంకీర్తనలు కార్యక్రమా లను నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆది వారం ఉదయం 9గంటలకు ధ్వజారోహణం, నిత్య హవనం, బలి ప్రదానం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారామ చంద్రుల తిరు కల్యాణోత్సవం, స్థాలీపాకం, బలి ప్రదానం, అన్నదానం, సాయంత్రం 5గంటలకు గ్రామోత్సవ ఊరేగింపు సేవ, రాత్రి 9గంటలకు భజనలు, 
 7వ తేదీ సోమ వారం ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, బలి ప్రదానం, నిత్య హవనం నాగవెల్లి, పుష్పయాగం, ఆశీర్వచనం, రుత్విక్ సన్మానం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏసీ, ఇఓ సంకటాల శ్రీనివాస్ వివరించారు. 
దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ ధర్మ కర్తలు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రత్నాకర్ రావు కుటుంబ సభ్యులు కార్యక్రమాలలో భాగస్వాములు కానున్నారు. 500 రూపాయలు చెల్లించి, కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తెలిపారు.

Tags

More News...

Local News 

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు):శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు,...
Read More...

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 3 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును సందర్శన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు ,నూతన కోర్టు ,కోర్టు హాల్,నూతన పోస్టుల,అడ్వకేట్...
Read More...
Local News 

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  *అభ్యర్థులు  పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు* *పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*   *ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు  పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.* ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష...
Read More...
Local News 

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్    - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి జగిత్యాల ఏప్రిల్ 03:  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు 2019 లో నిర్వహించిన సమ్మె కాలం నాటి అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ద్వారా ఎత్తివేయించాలని ప్రముఖ ఉద్యమ కారులు మహంకాళి రాజన్న, చుక్క గంగారెడ్డి లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు శనివారం విజ్ఞప్తి...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి...
Read More...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
Spiritual   State News 

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...
State News 

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్ గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల ఎస్ఐ సిహెచ్ ,సతీష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం చేయడం నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు మండలంలో శాంతిభద్రతలను నిలకడగా ఉండడంతో ప్రశంసిస్తూ...
Read More...
Local News 

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ  

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ   సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జియాగూడ లోని గోశాలో గోసేవ, గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బి.లక్ష్మీ వివేకానంద్ స్పాన్సర్ చేయగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈసందర్బంగా గోవులకు ఒక ట్రక్కు పచ్చగడ్డి ని గోశాలకు అందచేశారు. గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్...
Read More...