సీతా రామాంజనేయ ఆలయంలో బ్రహ్మోత్సవాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల
అమాత్యులు దివంగత జువ్వాడి రత్నాకర్ రావు స్వగ్రామమైన ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్లో నూతన నిర్మిత శ్రీసీతా రామాంజనేయ ఆలయంలో వార్షిక తిరు
కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా, ఘనంగా నిర్వహించ నున్నారు. దివంగత రాష్ట్ర మంత్రి రత్నాకర్ రావు కు చెందిన 10 గుంటల స్థలాన్ని దానం చేయగా, సదరు స్థలంలో, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో, 20శాతం క్రింద 6.20 లక్షల విరాళాలను చెల్లింపజేసి, దేవాదాయ శాఖ సర్వ శ్రేయో నిధి ద్వారా 16.50లక్షల రూపాయల మంజూరీ, 5 లక్షలు వేములవాడ దేవస్థాన నిధులకు తోడు 10 లక్షల వ్యయంతో ముఖద్వారం, అర్చిగేటు , ప్రహారీ గోడ ఆది పనులను, మాజీ మంత్రి కుమారులు నర్సింగరావు, కృష్ణారావుల చేయూతతో 37 వేలు విగ్రహాలకు, 1లక్ష రూపాయలు గ్రానైటు, పాలరాతి పరిచే పనులను పూర్తి చేసి, సంబందిత నూతన ఆలయాన్ని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా చేశారు.
అనంతరం దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను 2009 సంవత్సరం మార్చి 12 నుండి 15 వరకూ ప్రముఖ యాజ్ఞకులు శ్రీమాన్ నంబి వేణుగోలాచార్య ఆధ్వర్యంలో, వేద పండితులచే నిర్వహింపగా, జువ్వాడి రత్నాకర్ రావు దంపతులచే కార్యక్రమం నిర్వహించ బడగా, పరమహంస
పరి వ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ జ్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ శని వారం సాయంత్రం 4గంటలకు కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, రుద్విగ్వరణం రక్షా బంధనం, మృత్సం గ్రహణం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, భజన సంకీర్తనలు కార్యక్రమా లను నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆది వారం ఉదయం 9గంటలకు ధ్వజారోహణం, నిత్య హవనం, బలి ప్రదానం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారామ చంద్రుల తిరు కల్యాణోత్సవం, స్థాలీపాకం, బలి ప్రదానం, అన్నదానం, సాయంత్రం 5గంటలకు గ్రామోత్సవ ఊరేగింపు సేవ, రాత్రి 9గంటలకు భజనలు,
7వ తేదీ సోమ వారం ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, బలి ప్రదానం, నిత్య హవనం నాగవెల్లి, పుష్పయాగం, ఆశీర్వచనం, రుత్విక్ సన్మానం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏసీ, ఇఓ సంకటాల శ్రీనివాస్ వివరించారు.
దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ ధర్మ కర్తలు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రత్నాకర్ రావు కుటుంబ సభ్యులు కార్యక్రమాలలో భాగస్వాములు కానున్నారు. 500 రూపాయలు చెల్లించి, కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
