నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

On
నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

క్రిప్టో కరెన్సీబిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తున్న  మూఠా అరెస్ట్  -గుట్టు  రట్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు 

అధిక లాభాల పేర ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఆన్ లైన్ పెట్టుబడుల మూఠా సభ్యుల అరెస్ట్ -  ఎక్సైజ్ ఎస్ ఐ, ఏ ఆర్ కానిస్టేబుల్ తో సహా ఐదుగురి అరెస్ట్                 

చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు -జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల

 నిర్మల్ సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు) :

ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి  మోసాలు చేస్తున్నారు  కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంత మంది కలిసి  ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళనివ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు  మద్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్  కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లాలో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాలప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని.కొన్ని రోజుల తర్వాత ఈ క్రిప్టో కాయిన్ మోసపూరితమని  తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.   నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల తెలుసుకొని అవినాష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినారు. అయితే వీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని మొదటగా నవాబ్ పేట కు చెందిణ  సళ్ళ రాజ్ కుమార్ ను విచారించగా,  మొత్తం నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు. తరువాత  మూత సభ్యులైన సాయి కిరణ్, కందెలా నరేష్(టీచర్),నిర్మల్ కు చెందిన  గంగాధర్, ఎక్సైజ్  ఎస్ ఐ  గంగాధర్, ఏ ఆర్ కానిస్టేబుల్ మహేష్ లను  తీసుకవచ్చి విచారణ చేయగా మొత్తం వివరాలు తెలిపారని పోలీసులు తెలిపారు.

  సల్ల రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం యు నెట్ క్వీన్, యు- బీట్ క్వీన్  అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి మీకు డాలర్ల రూపంలో మీకు వస్తాయి లేకుంటే మాది పూచీకత్తు అంటూ మరియు 500 రోజులలో (ఏడాదిన్నర) 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం ! కనీస కొనుగోలు :- 50$ (5,000). గరిష్ట కొనుగోలు :- 10,000$ (10 లక్షలు). నాన్ వర్కింగ్ ఇన్ కం :- స్టేకింగ్ బోనస్ రోజుకు 0.5% అంటే నెలకు 15% (500 రోజులు). వర్కింగ్ ఇన్ కం :- రిఫరల్ బోనస్ 1% - 100%. లెవెల్ బోనస్ 1 - 50 లెవెల్స్. లీడర్ షిప్ బోనస్ :- 1- 7%,  10 కోట్ల ఇది కంపెనీ కాదు. ఉద్యోగం కాదు. వ్యాపారం కాదు. పెట్టుబడి కాదు.

మీరు ఎంత మందిని జాయిన్ చెపిస్తే మీకు అంతా లాభాలు  వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి ఇట్టి వ్యాపారంలో  చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్నమధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు.  ఇట్టి వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితులపై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతోంది,అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈ వ్యాపారం వెబ్ పోర్టల్ పనిచేయకపోతే ముందుగా జాయిన్ అయిన వారు లభ్యపడతారని కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టినవారు నష్టపోతున్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యాపారం రూపొందించబడింది.

వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుకవస్తారు.  మళ్లీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సళ్ళ రాజ్ కుమార్  మెటా మసక  లో ఖాతాను సృష్టించి,  మరియు ఆ తర్వాత యు బీట్  క్రిప్టోలో ఖాతాను తెరిచాడు.

ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందనిఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెబుతాడు. అయితేఅతను కనీసం $3,000 (సుమారు 2,52,000) పెట్టుబడితో ఐదుగురిని చేర్చినట్లయితేఅతను నిర్ణీత కమీషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందడం పొందుతారు. ఇదే కాక ఇంకొక బిజినెస్ లో  కొత్త చేరికలు గొలుసు కట్టులో గొలుసు పెరిగే కొద్దీకమీషన్ కూడా పెరుగుతుందిపెట్టుబడి పెట్టిన డబ్బు విలువ మూడు రెట్లు పెరుగుతుందని వాగ్దానం చేస్తారు. లాభదాయకమైన ఒప్పందాలను అందించడం మరియు తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా ఒక వ్యక్తిని స్కీమ్‌లో చేర్చవచ్చని సళ్ళ రాజ్ కుమార్ వాళ్లని నమ్మిస్తాడు. నిర్మల్ జిల్లాలో యుబీట్ అనే కరెన్సీ నెట్వర్క్ తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపాడు. దీనికంతా ఇతను బాధ్యత వహించినట్లు  విచారణలో అంగీకరించాడు. ఇతను సాయి కిరణ్ ని గుర్తించి యుబీట్ నెట్ వర్క్ ను విస్తరించడంలో సాయికృష్ణ తో పాటు నరేష్మహేష్మరియు గంగాధర్ కీలకంగా ఉన్నారు

వీరందరూ ఒకరి తరువాత ఒకరు వ్యాపారంలో చేరారుతప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు మరియు వారి డబ్బును ఎలా మోసం చేసారు అనే వివరాలను వివరించారు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 0.5% అంటే 500 రూపాయలు ఇస్తానని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి, యు బీట్, క్రీ ప్టో కరెన్సీ, లో పెట్టుబడి పెట్టమని నమ్మించి సళ్ళ రాజ్ కుమార్ మరియు మహేష్గంగాధర్‌తో కలిసి గతంలో స్కూల్‌మేట్ అయిన సాయి కృష్ణతో కుట్ర పన్నారని ఇతను ఒప్పుకున్నాడు.       

డబ్బు సంపాదించడం కోసం మరికొంతమంది అమాయక వ్యక్తులతో వాట్స్ ఆప్  గ్రూప్‌ని సృష్టించారు. ఈ సమాచారాన్ని గ్రూప్ లో చెరవేస్తూ అందరికీ ఆశ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరిని మోసం చేసి జాయిన్ చేపిస్తారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్ లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ లకు పెట్టుకోవద్దనిమీ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దనిఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు..

 కేసుని విచారించటంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డితో పాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎస్సైలు సాయి కృష్ణ,  ఎం రవి,  రవీందర్ మరియు కానిస్టేబుల్ తిరుపతి, గణేష్,  శోకత్,  సతీష్ లను ఎస్పీ  ప్రశంసించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు): మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్...
Read More...
Local News 

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ...
Read More...

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో   ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్ ఉదయం...
Read More...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు....
Read More...
State News 

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని విద్యార్థులకు...
Read More...
State News 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...
Local News  State News 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం  సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):  ఛత్తీస్‌గఢ్‌ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది....
Read More...

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్ సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9: బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం, ఈ...
Read More...

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన “100...
Read More...