నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

On
నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

క్రిప్టో కరెన్సీబిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తున్న  మూఠా అరెస్ట్  -గుట్టు  రట్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు 

అధిక లాభాల పేర ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఆన్ లైన్ పెట్టుబడుల మూఠా సభ్యుల అరెస్ట్ -  ఎక్సైజ్ ఎస్ ఐ, ఏ ఆర్ కానిస్టేబుల్ తో సహా ఐదుగురి అరెస్ట్                 

చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు -జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల

 నిర్మల్ సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు) :

ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి  మోసాలు చేస్తున్నారు  కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంత మంది కలిసి  ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళనివ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు  మద్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్  కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లాలో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాలప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని.కొన్ని రోజుల తర్వాత ఈ క్రిప్టో కాయిన్ మోసపూరితమని  తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.   నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల తెలుసుకొని అవినాష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినారు. అయితే వీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని మొదటగా నవాబ్ పేట కు చెందిణ  సళ్ళ రాజ్ కుమార్ ను విచారించగా,  మొత్తం నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు. తరువాత  మూత సభ్యులైన సాయి కిరణ్, కందెలా నరేష్(టీచర్),నిర్మల్ కు చెందిన  గంగాధర్, ఎక్సైజ్  ఎస్ ఐ  గంగాధర్, ఏ ఆర్ కానిస్టేబుల్ మహేష్ లను  తీసుకవచ్చి విచారణ చేయగా మొత్తం వివరాలు తెలిపారని పోలీసులు తెలిపారు.

  సల్ల రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం యు నెట్ క్వీన్, యు- బీట్ క్వీన్  అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి మీకు డాలర్ల రూపంలో మీకు వస్తాయి లేకుంటే మాది పూచీకత్తు అంటూ మరియు 500 రోజులలో (ఏడాదిన్నర) 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం ! కనీస కొనుగోలు :- 50$ (5,000). గరిష్ట కొనుగోలు :- 10,000$ (10 లక్షలు). నాన్ వర్కింగ్ ఇన్ కం :- స్టేకింగ్ బోనస్ రోజుకు 0.5% అంటే నెలకు 15% (500 రోజులు). వర్కింగ్ ఇన్ కం :- రిఫరల్ బోనస్ 1% - 100%. లెవెల్ బోనస్ 1 - 50 లెవెల్స్. లీడర్ షిప్ బోనస్ :- 1- 7%,  10 కోట్ల ఇది కంపెనీ కాదు. ఉద్యోగం కాదు. వ్యాపారం కాదు. పెట్టుబడి కాదు.

మీరు ఎంత మందిని జాయిన్ చెపిస్తే మీకు అంతా లాభాలు  వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి ఇట్టి వ్యాపారంలో  చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్నమధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు.  ఇట్టి వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితులపై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతోంది,అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈ వ్యాపారం వెబ్ పోర్టల్ పనిచేయకపోతే ముందుగా జాయిన్ అయిన వారు లభ్యపడతారని కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టినవారు నష్టపోతున్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యాపారం రూపొందించబడింది.

వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుకవస్తారు.  మళ్లీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సళ్ళ రాజ్ కుమార్  మెటా మసక  లో ఖాతాను సృష్టించి,  మరియు ఆ తర్వాత యు బీట్  క్రిప్టోలో ఖాతాను తెరిచాడు.

ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందనిఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెబుతాడు. అయితేఅతను కనీసం $3,000 (సుమారు 2,52,000) పెట్టుబడితో ఐదుగురిని చేర్చినట్లయితేఅతను నిర్ణీత కమీషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందడం పొందుతారు. ఇదే కాక ఇంకొక బిజినెస్ లో  కొత్త చేరికలు గొలుసు కట్టులో గొలుసు పెరిగే కొద్దీకమీషన్ కూడా పెరుగుతుందిపెట్టుబడి పెట్టిన డబ్బు విలువ మూడు రెట్లు పెరుగుతుందని వాగ్దానం చేస్తారు. లాభదాయకమైన ఒప్పందాలను అందించడం మరియు తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా ఒక వ్యక్తిని స్కీమ్‌లో చేర్చవచ్చని సళ్ళ రాజ్ కుమార్ వాళ్లని నమ్మిస్తాడు. నిర్మల్ జిల్లాలో యుబీట్ అనే కరెన్సీ నెట్వర్క్ తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపాడు. దీనికంతా ఇతను బాధ్యత వహించినట్లు  విచారణలో అంగీకరించాడు. ఇతను సాయి కిరణ్ ని గుర్తించి యుబీట్ నెట్ వర్క్ ను విస్తరించడంలో సాయికృష్ణ తో పాటు నరేష్మహేష్మరియు గంగాధర్ కీలకంగా ఉన్నారు

వీరందరూ ఒకరి తరువాత ఒకరు వ్యాపారంలో చేరారుతప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు మరియు వారి డబ్బును ఎలా మోసం చేసారు అనే వివరాలను వివరించారు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 0.5% అంటే 500 రూపాయలు ఇస్తానని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి, యు బీట్, క్రీ ప్టో కరెన్సీ, లో పెట్టుబడి పెట్టమని నమ్మించి సళ్ళ రాజ్ కుమార్ మరియు మహేష్గంగాధర్‌తో కలిసి గతంలో స్కూల్‌మేట్ అయిన సాయి కృష్ణతో కుట్ర పన్నారని ఇతను ఒప్పుకున్నాడు.       

డబ్బు సంపాదించడం కోసం మరికొంతమంది అమాయక వ్యక్తులతో వాట్స్ ఆప్  గ్రూప్‌ని సృష్టించారు. ఈ సమాచారాన్ని గ్రూప్ లో చెరవేస్తూ అందరికీ ఆశ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరిని మోసం చేసి జాయిన్ చేపిస్తారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్ లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ లకు పెట్టుకోవద్దనిమీ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దనిఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు..

 కేసుని విచారించటంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డితో పాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎస్సైలు సాయి కృష్ణ,  ఎం రవి,  రవీందర్ మరియు కానిస్టేబుల్ తిరుపతి, గణేష్,  శోకత్,  సతీష్ లను ఎస్పీ  ప్రశంసించారు.

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...