300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజామంటలు):
పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహకారంతో పాఠశాల నుండి 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోటా నీలిమ, మహంకాళి ఏసిపి సైదయ్య, ప్రధానోపాధ్యాయురాలు యల్. స్వరూప, ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ వి. కృష్ణమూర్తి, , ఇన్స్ పెక్టర్లు నర్సింగరావు, పరశురాం తో కలిసి ఈ ర్యాలీని ప్రారంభించారు.
ర్యాలీ ఆద్యంతం భారతమాత కీ జై, వందే మాతరం, మారతరం... మాతరం..., జై జవాన్... జై కిసాన్... జైహింద్.... మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం... అంటూ పాఠశాల నుండి సి లైన్, నల్లగుట్ట మార్కెట్, చుట్టాల బస్తి ఇలా మీదుగా తిరిగి పాఠశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జలంధర్ గౌడ్ మాట్లాడుతూ.....
ముందుగా భారతదేశ ఫౌరులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్ర్య సమరయోదుల పోరాట త్యాగాలను ఈ తరానికి తేలియచేయడానికి మక్తాల ఫౌండేషన్ గత 15 సంవత్సరాల నుండి పలు పాఠశాలలు, పట్టణ విధులల్లో, గ్రామల్లో భారీ జాతీయ పతకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు, యువకుల్లో దేశభక్తిని పెంపోందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
భారత దేశానికి స్వతంత్రం లభించినప్పుడు దేశంలో పచ్చదనం సమారుగా 50 శాతం ఉండేదనీ ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనకు స్వచ్ఛమైన గాలి లభించాలంటే పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, పచ్చదనం తగ్గడం వల్ల వాతావరణం కలుషితమై భారతవని అనారోగ్య పాలవుతుందనీ, ప్రస్తుతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందనీ అన్నారు.
అదే మనం ఒక మొక్క నాటి అది వృక్షంగా మారేవరకు కాపాడుకోగలిగితే ఆ వృక్షం తర తరాలకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తుందని వివరించారు. అంతేకాక దీనివల్ల భారత దేశ పచ్చదనాన్ని విస్తరింప చేయడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామనీ, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క నాటి సంరక్షణతో పాటు ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ కు అడ్డుకట్ట వేసిన వారమవుదామనీ పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో ఉపాద్యాయులు ఎ. ప్రమోద్, ఆర్.కె. పద్మప్రియ, విద్యార్థులు మరియు త్రికాల్ మనోజ్ ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, అంజనేయులు, హరికుమార్, శ్రావన్, అభిలాష్, నర్సింహచారి, ప్రకాష్, పూర్ణచందర్, సుబ్బు, ప్రభు, జె. ప్రకాష్, వేణు, గంగాధర్ పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
