300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

On
300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజామంటలు): 

 పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహకారంతో పాఠశాల నుండి 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోటా నీలిమ, మహంకాళి ఏసిపి సైదయ్య, ప్రధానోపాధ్యాయురాలు యల్. స్వరూప, ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ వి. కృష్ణమూర్తి, , ఇన్స్ పెక్టర్లు నర్సింగరావు, పరశురాం తో కలిసి ఈ ర్యాలీని ప్రారంభించారు.

ర్యాలీ ఆద్యంతం భారతమాత కీ జై, వందే మాతరం, మారతరం... మాతరం..., జై జవాన్... జై కిసాన్... జైహింద్.... మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం... అంటూ  పాఠశాల నుండి సి లైన్, నల్లగుట్ట మార్కెట్, చుట్టాల బస్తి ఇలా మీదుగా తిరిగి పాఠశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జలంధర్ గౌడ్ మాట్లాడుతూ.....
ముందుగా భారతదేశ ఫౌరులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్ర్య సమరయోదుల పోరాట త్యాగాలను ఈ తరానికి తేలియచేయడానికి మక్తాల ఫౌండేషన్ గత 15 సంవత్సరాల నుండి పలు పాఠశాలలు, పట్టణ విధులల్లో, గ్రామల్లో భారీ జాతీయ పతకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు, యువకుల్లో దేశభక్తిని పెంపోందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.  

 IMG-20250815-WA0018 భారత దేశానికి స్వతంత్రం లభించినప్పుడు దేశంలో పచ్చదనం సమారుగా 50 శాతం ఉండేదనీ ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనకు స్వచ్ఛమైన గాలి లభించాలంటే పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, పచ్చదనం   తగ్గడం వల్ల వాతావరణం కలుషితమై భారతవని అనారోగ్య పాలవుతుందనీ, ప్రస్తుతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందనీ అన్నారు.

అదే మనం ఒక మొక్క నాటి అది వృక్షంగా మారేవరకు కాపాడుకోగలిగితే ఆ వృక్షం తర తరాలకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తుందని వివరించారు. అంతేకాక దీనివల్ల భారత దేశ పచ్చదనాన్ని విస్తరింప చేయడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామనీ, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క నాటి సంరక్షణతో పాటు ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ కు అడ్డుకట్ట వేసిన వారమవుదామనీ పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో  ఉపాద్యాయులు ఎ. ప్రమోద్, ఆర్.కె. పద్మప్రియ, విద్యార్థులు మరియు  త్రికాల్ మనోజ్ ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, అంజనేయులు, హరికుమార్, శ్రావన్, అభిలాష్, నర్సింహచారి, ప్రకాష్, పూర్ణచందర్, సుబ్బు, ప్రభు, జె. ప్రకాష్, వేణు, గంగాధర్  పాల్గోన్నారు.

Tags

More News...

Local News 

ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు    జగిత్యాల ఆగస్ట్ 15 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ వందనం స్వీకరించారు ఆర్డీవో అనంతరం ఆర్డీవో కార్యాలయం గ్రౌండ్ లో  ఆర్డీవో మధుసూదన్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు....
Read More...
Local News 

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్   జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు)స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి బి. సత్య ప్రసాద్ తన క్యాంప్ ఆఫీస్ తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.  అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో   పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.  దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల ఆగస్టు 15 ( ప్రజా మంటలు) జిల్లా పోలీస్ కార్యాలయం  లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ  స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.   ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..  ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 79 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక...
Read More...
Local News  State News 

రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత

 రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్ 15: రేపటి నుండి 15 రోజుల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనకు వెళుతున్నారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్నారు. తన కుమారుడికి కేసీఆర్ గారి ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఫామ్ హౌస్ వెళ్ళారు.అమెరికాలోని కళాశాలలో ఆర్య ను గ్రాడ్యుయేషన్ లో చేర్పించనున్న...
Read More...
Local News 

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 15 (ప్రజామంటలు) : దేశస్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేఛ్చవాయువులను పీలుస్తున్నామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమా అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోట...
Read More...
Local News 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.  ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వర్ష కొండలోని అక్షర భారతి కాన్వెంట్స్ స్కూల్లో  ఉదయం 8 గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి, మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని, విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత  భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దగ్గుల అశోక్...
Read More...
Local News 

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్) మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఉదయం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగనీయుల కృషి ఫలితంగా ఈనాడు మనం స్వాతంత్ర్య ఫలాల్ని అనుభవిస్తున్నామన్నారు....
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి ఇబ్రహీంపట్నం ఆగస్టు 15( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఈనెల 18వ తేదీన బహుజన ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల...
Read More...
Local News 

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జడ్పీహెచ్ఎస్ వర్షకొండ నందు ఘనంగా జరిగాయి, ఉదయం ఏడు గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత  భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలోప్రధానోపాధ్యాయులు రాజేందర్ పతాక ఆవిష్కరణ చేశారు....
Read More...
Local News 

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పౌరులందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ జర్నలిస్టులనేవారు...
Read More...
National  Local News 

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాను - సీఎం రేవంత్  హైదరాబాద్ ఆగస్ట్ 15 (ప్రజా మంటలు): రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.    “మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని     “అధికారం...
Read More...
Local News 

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజామంటలు):    పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహకారంతో పాఠశాల నుండి 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ...
Read More...