సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన పొన్నం ప్రభాకర్, రాజేశం గౌడ్

On
సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన పొన్నం ప్రభాకర్, రాజేశం గౌడ్

జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు):

పట్టణ బైపాస్ రోడ్డులో గొల్లపల్లి క్రాస్ వద్ద,  సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించబడింది. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ గారి సేవలు, త్యాగాలు, వీరగాథను స్మరించుకుంటూ గౌడ సమాజం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకట్ స్వామి, మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, గవర్నమెంట్ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, దావా వసంత హాజరై విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.IMG-20250813-WA0003

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు మాజీ మంత్రివర్యులు జి. రాజేశం గౌడ్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, గౌడ సంఘం తరఫున ముఖ్య అతిథుల దృష్టికి కొన్ని ముఖ్యమైన సమస్యలను తీసుకువెళ్లారు. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని గౌడ హాస్టల్ సమస్యలు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే విద్యార్థుల విద్యా అవసరాలు, వసతి సౌకర్యాల లోపం వంటి అంశాలను వివరించారు.

గౌడ సంఘం తరఫున ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని కోరారు.

ఈ అభ్యర్థనలపై కార్యక్రమానికి విచ్చేసిన అన్ని ముఖ్య అతిథులు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.IMG-20250813-WA0006

కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సర్వాయి పాపన్న చేసిన వీరోచిత పోరాటాలను, ఆయన గోల్కొండ కోటను పరిపాలించిన చారిత్రక ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, పాపన్న గారి జీవితం ధైర్యసాహసాలకు, సమానత్వం కోసం చేసిన పోరాటానికి నిదర్శనమని తెలిపారు.

కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామస్తులు,యువత పెద్ద ఎత్తున పాల్గొని, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలతో సమానమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వేడుక గౌడ సమాజ ఐక్యతకు, అభ్యున్నతికి కొత్త ఊపును అందించింది.

Tags

More News...

Local News 

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు):  పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, కవాడిగూడ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర యోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఉద్యోగుల సంక్షేమ సంఘం దీప్ శిఖ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, వైద్యాధికారులు మెడికల్ స్టూడెంట్స్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం...
Read More...
Local News 

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు సికింద్రాబాద్,  ఆగస్టు 15 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ సీతాఫల్మండి మేడి బావి ఆర్య సమాజ్ లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ ఎమ్ ఆర్ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన నేతల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో డాక్టర్ కోడూరి సుబ్బారావు కృష్ణారావు...
Read More...
Local News 

బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 

బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్  సికింద్రాబాద్  ఆగస్టు 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడ లోని ఎం ఎన్ కె విట్టల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అసోసియేషన్ ట్రెజరర్ కె. సేతు మాధవ రావు త్రివర్ణ పతాకం ఎగురవేయగా ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, సంయుక్త కార్యదర్శి...
Read More...
Local News 

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ధర్మపురి ఆగస్టు 14 (ప్రజా మంటలు)భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ధర్మపురిలో గోదావరి నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి   అశోక్ కుమార్  ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భారీ...
Read More...
Local News 

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు   జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పి  విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు.పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్...
Read More...
Local News 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల ఆగస్టు 14 ( ప్రజా మంటలు)జిల్లాలో  డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టం లపై పూర్తిస్థాయి లో  నిషేధం గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధం అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం హైదరాబాద్ ఆగస్ట్ 14:    పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.    వివిధ విభాగాలకు నూతన భాద్యులు     ఆర్గనైజింగ్ సెక్రెటరీ : శ్రీ దూగుంట్ల నరేష్ ప్రజాపతి  అధికార ప్రతినిధి: శ్రీ నలమాస శ్రీకాంత్ గౌడ్     ఆదివాసీ జాగృతి - రాష్ట్ర...
Read More...
Local News 

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 14 (ప్రజామంటలు): కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్యారసాని గౌరీశంకర్ సతీమణి కమలాదేవి గురువారం కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గౌరీ శంకర్ ఇంటికి వెళ్లి కమలాదేవి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా గౌరీశంకర్  కుటుంబ సభ్యులను ఓదార్చారు....
Read More...
Local News 

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆగస్టు 14( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి గోదావరి నది తీర ప్రాంతంలో  గౌరవ కలెక్టర్ గారు తీర ప్రాంతాన్ని  విజిట్ చేయడం జరిగింది, గత సంవత్సరం వచ్చిన వరదలకు తీసుకున్న చర్యల  గురించి తెలుసుకున్నారు, మరియు ఇప్పుడు తీసుకోవలసిన  చర్యల గురించి ఆదేశాలు సూచనలు  చేసినారు,
Read More...
Local News 

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్ మెట్టుపల్లి ఆగస్టు 14(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాసన్ నియామకం అయ్యారు. ఇందుకు సంబందించిన ఉత్తర్వుల్ని ఆయన గురువారం అధిష్టానం నుండి అందుకున్నారు. ఈ సందర్బంగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్ మాట్లాడుతూ, తనకి అప్పజెప్పిన పార్టీ బాధ్యతలు క్రమశిక్షణ తో నిర్వహిస్తాను తన...
Read More...
Local News 

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి యూరోకిడ్స్ స్కూల్ లో  ముందస్తు సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, ఆగస్టు 14 (ప్రజామంటలు) :    పద్మారావునగర్ లోని యూరో కిడ్స్ స్కూల్ లో గురువారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు వేసి, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టడం, ప్రిన్సిపాల్...
Read More...