పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జూలై 2 ( ప్రజా మంటలు)
పట్టణ 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న cc రోడ్డు పనులను పరిశీలించారు.
30,8వార్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తా అన్నారు.
నూతనంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి 50 కోట్ల ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి.
రాష్ట్రంలో ఎక్కడాలేని విదంగా 4520 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
డబల్ బెడ్ రూం ఇండ్ల కు మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నానని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన ,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,వైస్ చైర్మన్ గోలి
శ్రీనివాస్,ఆడువాల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, డి ఈ వరుణ్, ఏ ఈ లు శరన్,అనిల్, నాయకులు క్యాదాసు నాగయ్యా,దుమల రాజ్ కుమార్,పంబల రాము ,ఖాజిం అలీ,కొలగాని ప్రేమలత సత్యం,వరనాసి మల్లవ్వ తిరుమలయ్య,రంగు మహేష్,ఓరుగంటి ప్రభాకర్ రావు,మహేందర్ రావు,ఈశ్వర్,మున్సిపల్ సిబ్బంది,మాజీ కౌన్సిలర్ లు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు
