క్రైస్తవుల సంక్షేమాన్ని, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
దాడుల నుంచి క్రైస్తవులను రక్షించండి..మీడియా సమావేశంలో జెరూసాలేం మత్తయ్య
సికింద్రాబాద్ జూన్27 (ప్రజామంటలు):
:
తెలుగు రాష్ర్టాల్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, ప్రభుత్వం నుంచి కూడ క్రైస్తవులకు ఆదరణ లభించడం లేదని అన్వేషి టీవీ డైరెక్టర్ జెరూసాలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ రిజుమల్ బిల్డింగ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిస్టియన్ మీడియా హెల్ప్ లైన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాను రాను క్రైస్తవులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితులో తాము ఉన్నామన్నారు. అందుకే ఇటు క్రైస్తవులకు అటు ప్రభుత్వానికి వారథిగా ఉండే మీడియా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు. మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గాని సంబందిత మంత్రి కూడ తమను పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ పాస్టర్ లకు జీతాలను టంచన్ గా ఇస్తున్నారని, జెరుసాలెం ట్రిప్పు కూడ అమలులో ఉందన్నారు.
కాని ఇక్కడ తెలంగాణ లో గతంలో ఉన్న జెరుసాలెం ట్రిప్పు ఇప్పుడు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాము ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం క్రైస్తవులను పట్టించుకోవడం లేదన్నారు. క్రైస్తవులు ఇకపై తాము ఎదుర్కునే ఎలాంటి సమస్యలైన సికింద్రాబాద్ లో తాము ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ కు వచ్చి చెప్పుకోవచ్చాన్నారు. వారానికి ఏడు రోజులు తాము అందుబాటులో ఉంటామని, త్వరలో క్రిస్టియన్ మీడియా హెల్ఫ్ లైన్ సెంటర్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను , ఒక వెబ్సైట్ ను కూడ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో భారత్ క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ భాస్కర్ ములకాల, క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ బిషబ్ తేజోమయ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
