అందరి భాగస్వామ్యం తోనే డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాల పూర్తిస్థాయిలో నిర్మూలన* జిల్లా కేంద్రం లో మాదకద్రవ్యాల నిర్ములన అవగాహన ర్యాలీ
జగిత్యాల జూన్ 26(ప్రజా మంటలు )
డ్రగ్స్, గంజాయి నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు
ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జండా ఊపి ప్రారంభించారు.
ఈ యొక్క ర్యాలీ మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టడియం వరకు నిర్వహించడం జరిగింది. మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి,యాంటి డ్రగ్స్ సోల్జర్ గా సైన్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం ను పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దు- బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ యువతకు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ కళాబృందం జిల్లా లో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని వివిధ శాఖల అధికారులతో కలిసికట్టుగా పని చేసి డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న చాలావరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవే అని మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంట్టుందని చెడు అలవాట్లను దూరం చేసుకొన మంచి అలవాట్లను ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి రాగలుగుతారని అన్నారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ... సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు.తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

#Draft: Add Your Title

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము
