కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ఆధునిక ఐ కేర్ సెంటర్ ప్రారంభం
సికింద్రాబాద్, జూన్ 26 (ప్రజా మంటలు):
కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేట్ లో ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఐ కేర్ సెంటర్ ను గురువారం ప్రారంభించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి, చీఫ్ ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ భవాని, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్తమాలజీ డాక్టర్ ఎస్ టి ఎస్ పృధు వ్యాస్ ల నేతృత్వంలో ఈ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే సంకల్పంతోనే ఆధునిక వైద్య సేవలతో కూడిన ఐ కేర్ సెంటర్ ను కిమ్స్శైన్ హాస్పిటల్ బేగంపేటలో ప్రారంభించినట్లు తెలిపారు.
కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కార్నియా క్యాట్రాక్ట్ రెటీనా గ్లూకోమా వంటి విభాగాలకు చెందిన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్తమానాజీ డాక్టర్ ఎస్ టిఎస్ పృధు వ్యాస్ తెలిపారు. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. నొప్పి బాధ తెలియకుండా నిర్వహించే స్కానింగ్ పరీక్షలు, చూపుకోల్పోకుండా ముందుగానే కనిపెట్టే టెక్నాలజీ, డయాబెటిస్ రెటినోపతిని మొదటి దశలోనే కనిపెట్టి తగిన చికిత్స ఇవ్వడం ద్వారా చూపును నిలబెట్టడం అవసరమని అన్నారు.
చిన్నపిల్లల్లో ముఖ్యంగా అంధత్వాన్ని అరికట్టేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలు మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మయోపియా మాస్టర్ అనే ఆధునిక టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశలోనే 100% కచ్చితంగా పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా సరైన చికిత్స, సరైన సమయంలో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. తద్వారా 18 సంవత్సరాలు దాటిన తర్వాత చూపు కోల్పోవడం అనేది ఉండదన్నారు. క్యాట్రాక్ట్ లో ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ అయిన తర్వాత కళ్లద్దాలు పెట్టుకునే అవసరం లేకుండా లెన్స్ ఇంప్లాంట్ పద్ధతి అందుబాటులో ఉందన్నారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఈఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని అంది పుచ్చుకుంటూ వైద్య సేవలు అందిస్తోందని, ఈ కోవలోనే ఐ కేర్ సెంటర్ ను అన్ని రకాల వైద్య సేవలతో ప్రారంభించామని తెలిపారు. ఈ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆప్తమాలజిస్టులు డాక్టర్ జ్యోతి, డాక్టర్ విష్ణు ప్రీతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
