హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు కీలక తీర్పునువెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి
జగిత్యాల జూన్ 25( ప్రజా మంటలు)
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి బుధవారం కీలక తీర్పును వెలువరించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచగా ఈరోజు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి ఏడుగురు నిందితులకు జీవిత ఖైదీతో పాటు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, చేసిన నేరానికి శిక్షలు తప్పవని అందరూ గమనించాలని ఎస్పి సూచించారు.
ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. మల్లికార్జున్ ,దర్యాప్తు అధికారులు అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వెంకట్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్. శ్రీను, సీఎంఎస్ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ టి. రంజిత్ మరియు సి ఎం ఎస్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ , లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
