బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

On
బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
 (రామ కిష్టయ్య సంగన భట్ల)

  బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

హోమశాలలో ప్రత్యేక పూజలు

 శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆది వారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కండాలై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్,  చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, పాలెపు గణేశ్, 
 సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆద్వర్యంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు. 

 దేవస్థానానికి గణనీయ ఆదాయం

బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానానికి 10వ తేదీ నుండి 15 వరకు ఆరు రోజులకు గాను 
గణనీయ ఆదాయం లభిస్తున్నది. వివిధ టికెట్ల ద్వారా 17,33,886 రూపాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదం ద్వారా 19,34,010 రూపాయలు, 
 అన్నదానం ద్వారా 4,26,388 రూపాయలు, మొత్తం 40,94,284 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

ప్రశంసా పాత్రం... అన్నపూర్ణ సమితి సేవాభావం

స్థానిక అన్నపూర్ణ సేవా సమితి బ్రహ్మోత్సవాలలో చేస్తున్న సేవలు ప్రశంసాపా త్రాలు అవుతున్నాయి. సామాజిక సేవే పరమావధిగా పట్టణ వాసులకు ఎన్నో ప్రజాహిత సేవలు అందిస్తున్న సేవాసమితి, ఈ సారి బ్రహ్మోత్సవాలలో అనుదినం దేవస్థాన
నం ...గోదావరి మార్గంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు శీతల పానీయాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా తెప్పోత్సవం, డోలోత్సవాల సందర్భంగా లస్సీ మజ్జిగ అందించి ప్రశంసలను పొందుతున్నారు. పెద్దంభట్ల నరేందర్ శర్మ నేతృత్వంలో , కొరిడే శంకర్, గుండి రామనాథం, కోరిడే దత్తాత్రేయ, 
పెండ్యాల బాల కృష్ణ, రవీందర్, మధు శంకర్, కషోజ్జల రాజేశ్వర శర్మ, అలువాల దత్తాత్రి, సంగన భట్ల నరేందర్, లక్ష్మీకాంత్, బావి మురళి తదితర సేవా సమితి బాధ్యులు స్వచ్ఛంద సేవలు అందించి ప్రశంసలను అందుకుంటున్నారు.

IMG-20250316-WA0010
 బ్రహ్మ పుష్కరిణిలో...
కోనేటి రాయుని జలవిహారం

రామ కిష్టయ్య సంగన భట్ల...
      
 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆది వారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, విజయ్, వంశీ, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.

అవధులు దాటిన ఆనందం..

 బ్రహ్మోత్సవాలలో భాగంగా, యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, మంగళ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి డీఎస్పీ రఘు చందర్,  సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. నంది 
 విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.


రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు


నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీసుల కుటుంబ సభ్యులో... రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా... సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. 


 జగిత్యాల డీఎస్సీ రఘు చందర్, ధర్మ పురి సిఐ రాం నరసింహా రెడ్డి, సిఐలు వేణు, రవి, 
ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు శ్రీధర్ రెడ్డి, సాగర్, సతీష్, ఎఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. పోలీస్ అధికారులు  సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు, పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ , అర్చకులు మూర్తి, అరుణ్, ప్రవీణ్, వంశీ, అశ్విన్, 
, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో  ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు నాయకులు, 
పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.

Tags
Join WhatsApp

More News...

National  International  

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం బ్రస్సెల్స్ జనవరి 18: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత...
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి,

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి, (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 18 జనవరి (ప్రజా మంటలు) :  సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్...
Read More...
State News 

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోండు ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని...
Read More...
Local News 

జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ

జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గ సభ్యులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఘనంగా సన్మానించారు. శనివారం జగిత్యాలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన...
Read More...

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు రూ.2 లక్షల విలువగల చెక్కులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు...
Read More...
Local News  Crime 

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి, జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్‌కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు....
Read More...
National  Comment  International  

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి? న్యూఢిల్లీ, జనవరి 17: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ...
Read More...
National  State News 

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు): తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ...
Read More...
State News 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి  వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్ సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):  రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి...
Read More...
National  Comment  International  

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు కోపెన్‌హేగెన్, జనవరి 17 : విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్‌లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా...
Read More...

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె...
Read More...

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల    జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)   జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్...
Read More...