బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం
హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
హోమశాలలో ప్రత్యేక పూజలు
శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆది వారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కండాలై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, పాలెపు గణేశ్,
సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆద్వర్యంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
దేవస్థానానికి గణనీయ ఆదాయం
బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానానికి 10వ తేదీ నుండి 15 వరకు ఆరు రోజులకు గాను
గణనీయ ఆదాయం లభిస్తున్నది. వివిధ టికెట్ల ద్వారా 17,33,886 రూపాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదం ద్వారా 19,34,010 రూపాయలు,
అన్నదానం ద్వారా 4,26,388 రూపాయలు, మొత్తం 40,94,284 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
ప్రశంసా పాత్రం... అన్నపూర్ణ సమితి సేవాభావం
స్థానిక అన్నపూర్ణ సేవా సమితి బ్రహ్మోత్సవాలలో చేస్తున్న సేవలు ప్రశంసాపా త్రాలు అవుతున్నాయి. సామాజిక సేవే పరమావధిగా పట్టణ వాసులకు ఎన్నో ప్రజాహిత సేవలు అందిస్తున్న సేవాసమితి, ఈ సారి బ్రహ్మోత్సవాలలో అనుదినం దేవస్థాన
నం ...గోదావరి మార్గంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు శీతల పానీయాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా తెప్పోత్సవం, డోలోత్సవాల సందర్భంగా లస్సీ మజ్జిగ అందించి ప్రశంసలను పొందుతున్నారు. పెద్దంభట్ల నరేందర్ శర్మ నేతృత్వంలో , కొరిడే శంకర్, గుండి రామనాథం, కోరిడే దత్తాత్రేయ,
పెండ్యాల బాల కృష్ణ, రవీందర్, మధు శంకర్, కషోజ్జల రాజేశ్వర శర్మ, అలువాల దత్తాత్రి, సంగన భట్ల నరేందర్, లక్ష్మీకాంత్, బావి మురళి తదితర సేవా సమితి బాధ్యులు స్వచ్ఛంద సేవలు అందించి ప్రశంసలను అందుకుంటున్నారు.

బ్రహ్మ పుష్కరిణిలో...
కోనేటి రాయుని జలవిహారం
రామ కిష్టయ్య సంగన భట్ల...
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆది వారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, విజయ్, వంశీ, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.
అవధులు దాటిన ఆనందం..
బ్రహ్మోత్సవాలలో భాగంగా, యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, మంగళ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి డీఎస్పీ రఘు చందర్, సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. నంది
విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.
రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు
నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీసుల కుటుంబ సభ్యులో... రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా... సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు.
జగిత్యాల డీఎస్సీ రఘు చందర్, ధర్మ పురి సిఐ రాం నరసింహా రెడ్డి, సిఐలు వేణు, రవి,
ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు శ్రీధర్ రెడ్డి, సాగర్, సతీష్, ఎఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. పోలీస్ అధికారులు సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు, పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ , అర్చకులు మూర్తి, అరుణ్, ప్రవీణ్, వంశీ, అశ్విన్,
, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు నాయకులు,
పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా
ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది... ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన
కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు?
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది.
నిర్మాణ సంస్థ... పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!
కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని... రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) :
తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుందని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ... గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి
బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
*ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి
హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి. జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు.
తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం
బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం... ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?
గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం.
దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు... అమెరికా బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం
బర్మింగ్హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది... సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో మంటలు
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు... హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో
హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా, అలాగే ఇన్చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం.
వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ను కూడా... 