బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం
హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
హోమశాలలో ప్రత్యేక పూజలు
శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆది వారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కండాలై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, పాలెపు గణేశ్,
సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆద్వర్యంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
దేవస్థానానికి గణనీయ ఆదాయం
బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానానికి 10వ తేదీ నుండి 15 వరకు ఆరు రోజులకు గాను
గణనీయ ఆదాయం లభిస్తున్నది. వివిధ టికెట్ల ద్వారా 17,33,886 రూపాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదం ద్వారా 19,34,010 రూపాయలు,
అన్నదానం ద్వారా 4,26,388 రూపాయలు, మొత్తం 40,94,284 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
ప్రశంసా పాత్రం... అన్నపూర్ణ సమితి సేవాభావం
స్థానిక అన్నపూర్ణ సేవా సమితి బ్రహ్మోత్సవాలలో చేస్తున్న సేవలు ప్రశంసాపా త్రాలు అవుతున్నాయి. సామాజిక సేవే పరమావధిగా పట్టణ వాసులకు ఎన్నో ప్రజాహిత సేవలు అందిస్తున్న సేవాసమితి, ఈ సారి బ్రహ్మోత్సవాలలో అనుదినం దేవస్థాన
నం ...గోదావరి మార్గంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు శీతల పానీయాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా తెప్పోత్సవం, డోలోత్సవాల సందర్భంగా లస్సీ మజ్జిగ అందించి ప్రశంసలను పొందుతున్నారు. పెద్దంభట్ల నరేందర్ శర్మ నేతృత్వంలో , కొరిడే శంకర్, గుండి రామనాథం, కోరిడే దత్తాత్రేయ,
పెండ్యాల బాల కృష్ణ, రవీందర్, మధు శంకర్, కషోజ్జల రాజేశ్వర శర్మ, అలువాల దత్తాత్రి, సంగన భట్ల నరేందర్, లక్ష్మీకాంత్, బావి మురళి తదితర సేవా సమితి బాధ్యులు స్వచ్ఛంద సేవలు అందించి ప్రశంసలను అందుకుంటున్నారు.

బ్రహ్మ పుష్కరిణిలో...
కోనేటి రాయుని జలవిహారం
రామ కిష్టయ్య సంగన భట్ల...
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆది వారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, విజయ్, వంశీ, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.
అవధులు దాటిన ఆనందం..
బ్రహ్మోత్సవాలలో భాగంగా, యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, మంగళ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి డీఎస్పీ రఘు చందర్, సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. నంది
విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.
రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు
నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీసుల కుటుంబ సభ్యులో... రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా... సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు.
జగిత్యాల డీఎస్సీ రఘు చందర్, ధర్మ పురి సిఐ రాం నరసింహా రెడ్డి, సిఐలు వేణు, రవి,
ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు శ్రీధర్ రెడ్డి, సాగర్, సతీష్, ఎఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. పోలీస్ అధికారులు సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు, పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ , అర్చకులు మూర్తి, అరుణ్, ప్రవీణ్, వంశీ, అశ్విన్,
, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు నాయకులు,
పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..
.
ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు)
శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది.
దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2... దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక... ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం
బెంగళూరు డిసెంబర్ 25:
కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం
అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు 50 మంది నాయకులు
బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్... శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి... తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... 