త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

On
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

IMG-20260305-WA0021
తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.


ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Join WhatsApp

More News...

Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...
Local News  State News 

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర...
Read More...
Crime  State News 

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు): జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్      

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్       జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
National  Comment  State News 

సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?

 సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన? న్యూఢిల్లీ  మార్చ్ 05: భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత...
Read More...
Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...