జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాలలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ప్రశ్నలు

On
జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీకి నల్ల దుస్తులు ధరించి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, వారిని వెంటనే విడుదల చేసి శాసనసభకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా, కేటీఆర్ దిశానిర్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000, బీడీ కార్మికులకు పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

జగిత్యాలలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ప్రశ్నలు

జగిత్యాల తహసీల్దార్ కార్యాలయ పరిధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ఏకపక్షంగా ఒక సంస్థకు అప్పగించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్ బంక్ కోసం 20 గుంటల మున్సిపల్ స్థలాన్ని తీసుకుని నాలుగు గుంటల్లో మాత్రమే బంక్ ఏర్పాటు చేసి, మిగిలిన 16 గుంటల భూమి అన్యాక్రాంతమైందని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పి పది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

కొత్త బస్‌స్టాండ్‌లో కూడా పెట్రోల్ బంక్ పేరుతో మరో రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఆక్రమణకు గురైందని ఆయన ఆరోపించారు. పాత బస్‌స్టాండ్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచి మూడేళ్లు గడిచిన తర్వాత మరో ప్రాంతంలో పెట్రోల్ బంక్‌కు అనుమతి ఇవ్వడం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే చారిత్రక భవనాన్ని కూల్చివేశారని, మున్సిపల్ మరియు ఇతర దుకాణాలకు అధిక అద్దెలు వస్తున్నప్పటికీ తక్కువ అద్దెకు కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే వాటిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

అక్రమ తవ్వకాలు, చెరువుల కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

జిల్లాలో సహజ వనరులు, గుట్టలు అక్రమ తవ్వకాలతో కనుమరుగవుతున్నాయని జీవన్ రెడ్డి అన్నారు. తాటిపల్లి గుట్టల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పుకునే ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయల విలువైన గుట్టల అక్రమ తవ్వకాలు కనిపించడం లేదా అని విమర్శించారు.

తిమ్మాపూర్ గ్రామంలోని ముప్పరపు చెరువు కబ్జాకు గురైందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, సహజ వనరులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

చల్గల్‌లో సమగ్ర పాఠశాల ఏర్పాటుకు కలెక్టర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన స్థలాన్ని పక్కన పెట్టి మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం వివక్షకు నిదర్శనమని ఆరోపించారు.

హామీలు అమలు చేయాలని దావ వసంత డిమాండ్

జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో ప్రజలకు పాలన చేరువ చేసేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కలెక్టర్ కార్యాలయాలను నిర్మించారని, అయితే ప్రస్తుతం ఉద్యోగాల హామీ జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని ఆరోపించారు. జిల్లాల్లో గుట్టలు, సహజ వనరులు కనుమరుగవుతున్నాయని, ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని అన్నారు.

రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని దావ వసంత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు.

తెలంగాణలో ఇందిరమ్మ పాలన కనిపించడం లేదని, ప్రతి ఇంటికీ మోసం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More...
State News 

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన    హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం...
Read More...
State News 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్...
Read More...
State News 

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ...
Read More...
State News 

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత    బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
Read More...
Local News  Sports 

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు): విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
Local News 

రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత 

 రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత  జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్...
Read More...
Local News 

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ... జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు): జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో...
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్...
Read More...
National 

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు): బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ...
Read More...
Local News 

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్‌ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్...
Read More...
Local News 

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ...
Read More...