ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?

On
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?

ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన

ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన

హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :

భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు.  గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.

 ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు  జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.

ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60  శాతం  గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.

భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.

గల్ఫ్ ఓటు బ్యాంకు

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%). 

ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది.  కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.

ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 

టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'

2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల  కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది. 

2019  పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్

2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.

 నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.

 చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.

ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి హైదరాబాద్‌, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్‌కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు...
Read More...
Local News  State News 

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు....
Read More...
National  Crime  State News 

పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం

పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం పుణె, నవంబర్ 13 (ప్రజా మంటలు): ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై పుణె నగర అవుట్‌స్కర్ట్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం నవలే బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ఒక కారు రెండు భారీ కంటెయినర్ ట్రక్కుల మధ్య నలిగిపోవడంతో, అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో...
Read More...
Local News  State News 

అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి

అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను...
Read More...
Local News  State News 

అందెశ్రీ - నీ కీర్తి  మా స్ఫూర్తి

అందెశ్రీ - నీ కీర్తి  మా స్ఫూర్తి నీ కీర్తి  మా స్ఫూర్తి -- చెన్నాడి వెంకటరమణారావు         9912114028- తెలుగువారికి కీర్తిభావి తరము స్ఫూర్తిమనిషి మనిషిలో ఆర్తివసివాడని కవితామూర్తిజాతి కులములనెవ్వడడిగేనువిశ్వకవిగా ఎదను నింపుకున్నరు నిన్నుమనిషి జాతికి నువ్వు శివుని మూడో కన్నుమరువలేము నిన్నుఎందరెందరో మరెందరెందరోనీ పాటను పలవరించుతారుకాలమున్నన్నాళ్ళు  తెలుగు కాళిదాసుగ...
Read More...
Local News 

వారాసిగూడ లో  వ్యక్తి అదృశ్యం

వారాసిగూడ లో  వ్యక్తి అదృశ్యం సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు): సికింద్రాబాద్ వారాసిగూడ  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీదెం రాఘవేందర్ (38) అనే యువకుడు వారాసిగూడ పీఎస్ పరిధిలోని సంజీవపురం ప్రాంతంలో తండ్రి జగన్నాథం(84) తో కలసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 4న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్ళిన రాఘవేందర్...
Read More...
Local News 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు. .సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు): ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యాముందస్తు భద్ర తా చర్యలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్,జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు.ప్రయాణీకుల లగేజీలు,ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో బ్లేజ్ అనే స్నిప్ప ర్ డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని...
Read More...
Local News 

మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం..  మొక్కజొన్న  రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో  ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం.

శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం. (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు)   గొల్లపల్లి మండలం లోని మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన టెండర్లను ఈనెల 15,వ శనివారం ఉదయం 11 గంటలకు  దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు  గ్రామ కమిటీ సభ్యులు పత్రికా ప్రకటనలో తెలిపారు.  గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ద శ్రీ మల్లికార్జున స్వామి కావున...
Read More...
Local News 

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు...
Read More...
Local News 

జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు. 🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు...
Read More...
State News 

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్ RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు. 🔹 2021...
Read More...