రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
- ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
- - సోనియాతో మాయావతి చర్చలు సఫలం
- - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ. హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ
రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.
గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది.
మల్లికార్జున్ ఖర్గే దళితుడే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.
ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది
ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.
బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి
ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.
గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను... రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,... సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్... వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున వచ్చాయి.
కాగా ప్రవీణ్ రామన్నపేట---... పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ తన భార్య శ్యామలాదేవితో కలిసి పాషం... కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు
హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
వి. ప్రకాష్ అనే వ్యక్తి... మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... 