రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
- ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
- - సోనియాతో మాయావతి చర్చలు సఫలం
- - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ. హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ
రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.
గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది.
మల్లికార్జున్ ఖర్గే దళితుడే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.
ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది
ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.
బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి
ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.
గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?
ప్రత్యేక కథనం
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?”... రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి?
: హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో “రుణభారం తగ్గింది” అని చెబుతోంది. వడ్డీ రేటు తగ్గించామని, ఇన్స్టాల్మెంట్లు (EMI) తక్కువయ్యాయని చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — నిజంగా రుణం తగ్గిందా? లేక కేవలం చెల్లింపు విధానం మారిందా?... మెట్పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
మెట్పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.ప్రస్తుతం మెట్పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని,... బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా... సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల ఫిబ్రవరి 27 ( ప్రజా మంటలు)రాష్ట్ర స్తాయి సీఎం కప్ లో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అభినందించారు
సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ విభాగంలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొని ఏ హర్షిత్... విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు)పిఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
'పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు.... తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా?
హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం 2026” నివేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసేలా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్,... ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చీట్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 27:
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రద్దు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక... న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:
క్లాస్–8 సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను అవినీతిగ్రస్త సంస్థగా చిత్రీకరించడం వెనుక “లోతైన, పద్ధతిగల కుట్ర” ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయంచాలకంగా (సుయో మోటు) కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం,ఈ పాఠ్యాంశాలు చిన్న వయసు విద్యార్థుల “అమాయక మనసుల్లో”... నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్
జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామము మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మౌనికను కాలుతో తన్ని ఆ చిన్నారి మరణానికి కారణమైన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిసి ఎస్సి ఎస్టి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆ చిన్నారి ఆత్మకు శాంతి... పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్... ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా... 