రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
- ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
- - సోనియాతో మాయావతి చర్చలు సఫలం
- - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ. హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ
రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.
గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది.
మల్లికార్జున్ ఖర్గే దళితుడే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.
ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది
ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.
బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి
ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.
గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను... అందెశ్రీ - నీ కీర్తి మా స్ఫూర్తి
నీ కీర్తి మా స్ఫూర్తి
-- చెన్నాడి వెంకటరమణారావు 9912114028-
తెలుగువారికి కీర్తిభావి తరము స్ఫూర్తిమనిషి మనిషిలో ఆర్తివసివాడని కవితామూర్తిజాతి కులములనెవ్వడడిగేనువిశ్వకవిగా ఎదను నింపుకున్నరు నిన్నుమనిషి జాతికి నువ్వు శివుని మూడో కన్నుమరువలేము నిన్నుఎందరెందరో మరెందరెందరోనీ పాటను పలవరించుతారుకాలమున్నన్నాళ్ళు తెలుగు కాళిదాసుగ... వారాసిగూడ లో వ్యక్తి అదృశ్యం
సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీదెం రాఘవేందర్ (38) అనే యువకుడు వారాసిగూడ పీఎస్ పరిధిలోని సంజీవపురం ప్రాంతంలో తండ్రి జగన్నాథం(84) తో కలసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 4న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్ళిన రాఘవేందర్... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు.
.సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యాముందస్తు భద్ర తా చర్యలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్,జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు.ప్రయాణీకుల లగేజీలు,ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో బ్లేజ్ అనే స్నిప్ప ర్ డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని... మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం.. మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె... శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం.
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన టెండర్లను ఈనెల 15,వ శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు పత్రికా ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ద శ్రీ మల్లికార్జున స్వామి
కావున... జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు... జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్
మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు... ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.
🔹 2021... నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం
రామ కిష్టయ్య సంగన భట్ల
(సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)..“వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని, చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన... రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి,వార్డు లో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
కేంద్రం 2300 మద్దతు ధర ప్రకటించినా... వైద్యుడు సేవా బావముతోనే రాణిస్తాడు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 13(ప్రజా మంటలు)వైద్యుడు సేవా భావము తోనే రాణిస్తాడు అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మోని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మొదటి సంవత్సరం లో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింగ్షన్ లో పాసైన విద్యార్థులను ప్రశంసా పత్రాలు... 