రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
- ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
- - సోనియాతో మాయావతి చర్చలు సఫలం
- - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ. హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ
రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.
గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది.
మల్లికార్జున్ ఖర్గే దళితుడే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.
ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది
ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.
బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి
ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.
గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు... బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు):
బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూ... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు
హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.... తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి... ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):టియుడబ్ల్యూజే ఐజేయు కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్... ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి... విజయ్పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్
చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు):
తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి... రాయికల్ మండలం మహితాపూర్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు... తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9... బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా... 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి... పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... 