రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 

On
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 

రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 
  • ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
  • - సోనియాతో మాయావతి చర్చలు సఫలం 
  • - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ.                            హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ

రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.

గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది. 

మల్లికార్జున్ ఖర్గే దళితుడే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.

ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని  తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది

 ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.

బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

 బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు 

ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి 

ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.

గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని  బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ  ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది

Tags
Join WhatsApp

More News...

మున్సిపల్ శాఖలో ‘క్యాష్ ఫర్ జాబ్స్’ స్కాం –తమిళనాడు మంత్రిపై ఈడీ నివేదిక

మున్సిపల్ శాఖలో ‘క్యాష్ ఫర్ జాబ్స్’ స్కాం –తమిళనాడు మంత్రిపై ఈడీ నివేదిక తమిళనాడులో మరో పెద్ద కలకలం:  చెన్నై, అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తమిళనాడు రాజకీయ వాతావరణంలో మళ్లీ చర్చ రేపే అంశం వెలుగులోకి వచ్చింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనంలో, రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో భారీ స్థాయి క్యాష్ ఫర్ జాబ్స్ (డబ్బులకి ఉద్యోగాలు)...
Read More...
Local News  State News 

స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ

స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడంలేదు?   హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నగరంలో ఉన్న స్లాటర్ హౌస్ మాఫియాతో...
Read More...
Local News 

మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. సికింద్రాబాద్,  అక్టోబర్ 30 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడవ రోజు గురువారం కూడ ఐటీ రైడ్స్ కొనసాగాయి. ఐటీ లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఈ మేరకు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని మానేపల్లి జ్యువెల్లర్స్ లో ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి 1250...
Read More...
Local News 

గొల్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కె రన్ 

గొల్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కె రన్    (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్  150 వ,జయంతి ని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి ఉదయం 6 30 గంటల గోవిందుపల్లి  X రోడ్ వరకు నిర్వహించు 2కె రన్ మండలంలోని ప్రజా ప్రతినిధులు,...
Read More...
Local News  State News 

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న అకాల వర్షాల వల్ల రైతుల కష్టం నీటి పాలు.. (అంకం భూమయ్య)    గొల్లపల్లి అక్టోబర్ 30 ప్రజా మంటలు  గొల్లపల్లి  మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా రైతుల యొక్క వరి పంట నీట మునిగి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది తడిసి ముద్దైన వరి చేతికి వొస్తున్న వేళలో అకాల వర్షం కారణంగా...
Read More...
Local News  State News 

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు): మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా...
Read More...
Local News 

కొత్తపల్లి గ్రామంలో విషాదం

కొత్తపల్లి గ్రామంలో విషాదం భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజామంటలు) : మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు....
Read More...
National  International  

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య వచ్చే ఏప్రిల్ లో ట్రంప్ చైనా పర్యటన “1 నుంచి 10 వరకు స్కేల్‌లో 12 ఇస్తాను” రేర్ ఎర్త్ మినరల్స్  పై ఒక సంవత్సరం పాటు ఒప్పందం బుసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30 (ప్రజా మంటలు): దక్షిణ కొరియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్...
Read More...
Crime  State News 

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు – రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు   యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 📍 ...
Read More...
State News 

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అక్టోబర్ 30, (ప్రజా మంటలు): తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 📍 రికార్డు స్థాయి వర్షపాతం తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ...
Read More...

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ...
Read More...
National  Opinion  International  

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు ఇరాన్‌లో మహిళల తిరుగుబాటు యూరప్‌లో విరుద్ధ పరిస్థితి అక్టోబర్ 30, (ప్రజా మంటలు): ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్‌లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర ఇరాన్‌లో మహిళల...
Read More...