దేశానికి జ్ఞానదీప్తి వెలిగించిన నాయకుడు పీవీ, రేపే పివి జయంతి వేడుకలు
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
భీమదేవరపల్లి ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి
భీమదేవరపల్లి, జూన్ 28 (ప్రజామంటలు) :
దేశ చరిత్రలో పదునైన రాజకీయ విజ్ఞానంతో, బహుముఖ ప్రతిభతో, సంక్షోభాలను సంకల్పాలతో సమర్థంగా ఎదుర్కొన్న నేతలలో పాములపర్తి వెంకట నరసింహారావు అత్యంత ప్రఖ్యాతి గాంచిన నాయకుడు. వంగర గ్రామం ఆయనకు కేవలం జన్మస్థలమే కాక, ఆదర్శభావాలకు కేంద్రంగా నిలిచింది.
1921, జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించిన పీవీ, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరను తన స్వగ్రామంగా పేర్కొనేవారు. బాల్యంలోనే విద్యకు, భాషలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన, నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని నడిపారు.
*విద్యా రంగంలో పీవీ నిష్ణాతుడు*
వేలేరు పాఠశాల నుండి ఉస్మానియా యూనివర్సిటీ వరకూ సాగిన విద్యా ప్రస్థానంలోనూ, తన విద్యాభ్యాసంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. నాగపూర్ లో న్యాయశాస్త్రంలో పట్టా సాధించి, న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, అతి త్వరలోనే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
*సాహిత్య సామర్థ్యంలో విశిష్టత*
1944లో ప్రారంభించిన ‘కాకతీయ’ పత్రిక ద్వారా సాహిత్యంలో సామాజిక అంశాలను ప్రస్తావించారు. కథలు, అనువాదాలు, వ్యాసాల ద్వారా చైతన్యాన్ని నింపిన పీవీ, 17 భాషల్లో పట్టు కలిగిన అరుదైన రచయిత. ‘వేయిపడగలు’కి హిందీలో జీవం పోసిన వారు ఆయన. ‘లోపలిమనిషి’ అనే ఆత్మకథలో ఆయన జీవన విశ్లేషణతో పాటు దేశ పరిస్థితులను లోతుగా విశదపరిచారు.
*ప్రధానిగా పీవీ సంస్కరణలు*
ఆర్థిక సంక్షోభం దశలో భారతదేశం బాధ్యతలు స్వీకరించిన పీవీ, 1991లో దేశానికి కొత్త ఆర్థిక మార్గదర్శిని ఏర్పరిచారు. గడచిన పాత విధానాలకు విరుద్ధంగా, సరైన సంస్కరణలతో జాతీయ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపించిన పీవీ రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందారు.
*జీవితమంతా ప్రజాసేవకే అంకితం*
భూసంస్కరణలు, విద్యా అభివృద్ధి, పారిశ్రామికతకు ప్రోత్సాహం వంటి అంశాలలో ఆయన ఆధునిక దృక్పథంతో ముందుకు సాగారు. సామాన్యుడి సంక్షేమం కోసం వ్యక్తిగత లాభనష్టాలకన్నా దేశ ప్రయోజనాలను ముందుకు పెట్టారు.
*వంగరలో ఘన నివాళులు*
రేపు వంగర గ్రామంలో పీవీ జయంతిని పురస్కరించుకుని స్థానికులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పీవీ సోదరుని కుమారుడు మదన్మోహన్రావు మాట్లాడుతూ, “పీవీ గారి సేవలు, త్యాగాలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకం. యువత ఈ మహనీయుని జీవితం నుండి నేర్చుకోవాలి” అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

#Draft: Add Your Title

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము
