గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

On
గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 30( ప్రజా మంటలు) : 

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... 

గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.

పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.

ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.

జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.

పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు. 

జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. 

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు...
Read More...

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్ జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం మేరకు, అఖిల్ తల్లి...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం హైదరాబాద్‌, నవంబర్ 06 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్‌పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ...
Read More...
Local News  Crime 

ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం 

ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో  ఎస్సారెస్పీ  కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన  మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల  వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల...
Read More...
Local News  Crime 

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన  ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన   ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి   (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్   జాగ్రూకత దివస్  సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ  మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన...
Read More...
Local News 

టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు

టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో  ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు జగిత్యాల (రూరల్) lనవంబర్ 06:(ప్రజా మంటలు): ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పట్టణ విశ్వ బ్రాహ్మణ  సంఘం  కమిటీ హాల్లో   టి డబ్ల్యూ జె ఎఫ్  సంఘ సభ్యులు...
Read More...
National  Sports 

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు. రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌  ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్ పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):  మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్‌ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గురువారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది....
Read More...
Local News 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు  బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు)  తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు వారి మీద అధిక...
Read More...
Local News  Spiritual  

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం ఈ నెల 15న శివపార్వతి కళ్యాణం సికింద్రాబాద్,  నవంబర్ 06 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ఎం.ఎన్.కె సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో కార్తీక పూర్ణిమ  సందర్భంగా దీపోత్సవం, శివారాధన ఘనంగా జరిగింది. రెసిడెంట్స్, ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జి. వనిత, లలిత, వంశీ, ఆర్....
Read More...

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో  “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు. ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో  జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,...
Read More...

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ జగిత్యాల నవంబర్ 6 (ప్రజా మంటలు)   పెండింగ్ ఫీజు బకాయిల విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా కలెక్టర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు., సిబ్బంది., గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న...
Read More...