పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?
*వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం
*యువత సమైక్య భారత్ నిర్మాణానికి ముందుకు రావాలి
*రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్
*సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు
సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్ ఆధీనంలో ఉండేదని రాజ్యసభ సభ్యుడు డా.కే.లక్ష్మన్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరగనున్న సర్దార్@150 ఏక్తా మార్చ్ లో యువత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం కవాడిగూడ సీజీఓ టవర్స్ లోని పీఐబీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నిజాం పాలనలో ఉన్న పూర్వపు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణకు సర్దార్ పటేల్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ధైర్యవంతమైన నిర్ణయాలతో ఈ ప్రాంత సమైక్యత, సార్వభౌమత్వం కాపాడబడ్డాయి అన్నారు.కులమత భేదాలకతీతంగా జాతీయ సమైక్యత సాధనలో సర్దార్ పటేల్ నాయకత్వం అపూర్వమని ఆయన పేర్కొన్నారు.
ఆయన ఆశయం అయిన సమైక్య భారత్ను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆయన చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం అయ్యాయని అన్నారు. లేనట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఏక్తా మార్చ్ పాదయాత్రల ద్వారా తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం, యువతలో దేశభక్తిని నింపడం లక్ష్యమని వివరించారు. సమైక్యత, స్వదేశీ భావన, మాదకద్రవ్యాల రహిత వికసిత్భారత్ నిర్మాణం వైపు యువత ముందుకు రావాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రతి యువకుడు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి పాదయాత్ర పోస్టర్ ను డా. లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మాధవి కొల్లి, ఏక్తా మార్చ్ నామినేట్ సామల పవన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా యువజన అధికారి సైదా నాయక్, మై భారత్ హైదరాబాద్ జిల్లా యువజన అధికారి ఖుష్బు గుప్తా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్ విసిరిన కొత్త మైత్రి కూటమి!
కొత్త రాజకీయ కూటమి అవతరించిన ఈశాన్య భారతదేశంలో, NEDA భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కూటమికి ఇది పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 04:
ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని **నార్త్... కోయంబత్తూర్ గ్యాంగ్ రేప్ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్
కోయంబత్తూర్, తమిళనాడు నవంబర్ 04:
కోయంబత్తూర్లో జరిగిన ఘోరమైన గ్యాంగ్ రేప్ హత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన బోయ్ఫ్రెండ్తో కలిసి కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన విమానాశ్రయం సమీపంలోని బ్రిందావన్నగర్ వద్ద చోటుచేసుకుంది.... ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ
సూర్యకుమార్ యాదవ్కు 30% మ్యాచ్ ఫీ జరిమానా – హారిస్ రౌఫ్కు రెండు మ్యాచ్ల నిషేధం
దుబాయ్, నవంబర్ 4 (ప్రజా మంటలు):
ఏషియా కప్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త ఘటనలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు పాకిస్తాన్ వేగవంతమైన బౌలర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ (ICC) క్రమశిక్షణా చర్యలు... దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు
కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరిన TPCC NRI సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా
హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజా మంటలు):
దుబాయ్లో సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన యువకుడు అనిల్ (s/o బాలయ్య, చిర్లవంచ గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) కేసు విషయాన్ని, TPCC... “సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత
జాగృతి జనం బాట ఆదిలాబాద్లో కల్వకుంట్ల కవిత
నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి
తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత
ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33... జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు
– పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక
జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు.
తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు.... తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు
* పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా విమర్శ
సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజామంటలు):
మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన పదేళ్ల బిఆర్ఎస్... పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?
*వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం *యువత సమైక్య భారత్ నిర్మాణానికి ముందుకు రావాలి *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్ *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు
సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్... శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు
- అభినందించిన కళాశాల యాజమాన్యం...
సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు) :
పట్టుదలతో చదివితే విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కె. రాధా కిషన్ రావు అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, పి. హేమశ్రీ అసాధారణ విజయాన్ని గర్వంగా జరుపుకుంది. జవహర్లాల్... వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్
ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన... ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ
జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):
ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 25 (తేదీ 12.08.2021) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరగాలని పిఆర్టియుటిఎస్ (PRTUTS) జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యా... బహరేన్లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు
మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్కు తరలించడం సాధ్యం కాదని బహరేన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది.... 