న్యాయ శాస్త్రంలో 'అనన్య'కు 8 బంగారు పతకాలు
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల రూరల్ మార్చి 24 ( ప్రజా మంటలు )
మండలంలోని లక్ష్మీపూర్ చెందిన కూర్మచలం అనన్య న్యాయ శాస్త్రంలో 8 బంగారు పతాకాలను సాధించింది.
ఈ మేరకు అదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ప్రియదర్శిని చేతుల మీదుగా న్యాయశాస్త్ర డిగ్రీ పట్టాతో పాటు 8 బంగారు పతకాలను అనన్య అందుకుంది.
ఉస్మానియా యూనవర్శిటి పరిధిలోని ఆంధ్ర మహిళా సభ లా కళాశాలలో 2020-2023 వరకు బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు పూర్తి చేసింది.
ఈ మేరకు న్యాయ శాస్త్రంలోని లేబర్ లా, కానిస్టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఫ్యామిలా, లా ఆఫ్ జూరిస్క్రిప్రిడెన్స్ విభాగాలతో పాటు ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్, ఎల్ఎల్బి సెకండ్ ఇయర్, 2020-2023 బ్యాచ్ లో అత్యుత్తమ విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు కళాశాల యజమాన్యం 8 బంగారు పతకాలతో సత్కరించింది. అనన్య తండ్రి కూర్మచలం వేణుమాధవ్ జగిత్యాల జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది కాగా, తల్లి పుష్పలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అనన్య భర్త గొనెపట్ల అజయ్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు.
ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ..... న్యాయశాస్త్రంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగేందుకు, సామాన్యుడికి సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
అనన్యకు బంగారు పతకాలు రావడం పట్ల లక్ష్మీపూర్ వాసులతో పాటు జగిత్యాల కోర్టు న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
