ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలు చేయాలి ,-సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన

On
ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలు చేయాలి ,-సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం డిసెంబర్ నాటికి పూర్తి
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం

 

హైదరాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు):

ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం  చేస్తోందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఫార్చూన్ 500 కంపెనీల్లో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ #FCDA భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

IMG-20250928-WA0028

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాథికార సంస్థ భవనంతో పాటు కొంగరకలాన్ నుంచి ఆమనగల్ వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ -1 నిర్మాణానికి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ నమూనా చిత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. "సింగరేణి సంస్థ కార్పొరేట్ గ్లోబల్ కార్యాలయం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు కేటాయిస్తున్నాం. 2026 డిసెంబర్ నాటికి సింగరేణి కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలి.

ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం డిసెంబర్ నాటికి పూర్తి

ఈరోజు శంకుస్థాపన చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. దీని సమీపంలోనే నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కూడా డిసెంబర్ లో ప్రారంభించుకుంటాం. అప్పుడు నెలకు మూడుసార్లు తాను ఇక్కడికి వస్తా. భవిష్యత్తు కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే తీసుకుందాం.

గతంలో కులీకుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, గత పాలకులు ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధికి పునాదులు వేసినట్టుగానే భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం. భారత దేశమే కాకుండా ప్రపంచం గర్వించే ఒక గొప్ప సిటీని నిర్మిస్తాం.

గడిచిన 70 ఏళ్లుగా న్యూయార్క్, సింగపూర్, టోక్యో, దుబాయ్ నగరాలను చూసొచ్చామని.. అలా ఇంకెంత కాలం చెప్పుకుంటాం. న్యూయార్క్ లో ఉన్న వారు సైతం ఫ్యూచర్ సిటీ చూసొచ్చామని చెప్పుకునే తీరుగా దీన్ని తీర్చిదిద్దుతాం.

ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం

ఎగుమతి, దిగుమతి వ్యాపార కార్యకలాపాల కోసం పోర్టుతో అనుసంధానం చేయడానికి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతోంది. అలాగే ఇక్కడి నుంచి వయా అమరావతి - చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.

ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు వేసుకుంటున్నాం. దాంతో పాటు బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం.

ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక క్రమంలో భూములు కోల్పోతున్న కొంతమందికి నష్టం, కష్టం వచ్చి ఉండొచ్చు. ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకుంటుంది. తగిన పరిహారం ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్ సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుందాం.

నేనెవరికీ అన్యాయం చేయను. న్యాయంగా పరిష్కరించుకుని ముందుకు వెళదాం. ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు, ఏటీసీ, ఆసుపత్రి ఇవ్వాలని ఇప్పటికే సూచన చేశా. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది" అని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వయోవృద్ధులకు టాస్కా ఆసరా

వయోవృద్ధులకు టాస్కా ఆసరా మూగ మహిళకు వస్త్రాలు,దుప్పట్లు అందిస్తున్న హరి ఆశోక్ కుమార్ అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం .   జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు):    వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ...
Read More...
Local News 

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 2( ప్రజా మంటలు)జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని టవర్ సర్కిల్ లోని ధర్మస్థల్ లో కాషాయ ధ్వజనికి  ప్రత్యేక పూజలు నిర్వహించి కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్.. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు....
Read More...
Local News 

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 2 ( ప్రజా మంటలు)మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ  గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం...
Read More...
Local News 

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం 

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం  జగిత్యాల అక్టోబర్ 1 ( ప్రజా మంటలు)  జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో కొలువై ఉన్న సనాతన దుర్గ దేవి మంటపం వద్ద సిరిసిల్ల వారి పూర్వీకుల నివాసంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతుండగా బుధవారం మహర్నవమి ని పురస్కరించుకొని సాయంత్రం ప్రదోష పూజా అనంతరం నంబి వాసుదేవ ఆచార్యచే దేవీ భాగవత ప్రవచనామృతం...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి సికింద్రాబాద్,  అక్టోబర్ 02 (ప్రజా మంటలు):  గాంధీ మెడికల్ కళాశాలలో గురువారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర కాలేజీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ పేరుతో ఏర్పాటుచేసిన గాంధీ మెడికల్ కళాశాలను రాష్ట్రంలో అన్ని కళాశాలలో కంటే అత్యున్నతమైన వైద్య ప్రమాణాలు అందించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు...
Read More...
Local News  Spiritual   State News 

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు   ,(రామ కిష్టయ్య సంగన భట్ల 944059549 'శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ' ...భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ప్రాధాన్యత కల్పించ బడింది. శమీకే అపరాజిత అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ నామాంకితయైన జగజ్జనని. శరన్నవరాత్రి వేడుక లలో...
Read More...
Local News  Spiritual  

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు.. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు): బల్కంపేట శ్రీఎల్లమ్మ, శ్రీపొచమ్మ దేవస్తానంలో దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పదవరోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.  బుధవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే.శివసేనా రెడ్డి, మాజీ...
Read More...
Local News  Spiritual  

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు   - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు   - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం హాజరైన ఎండోమెంట్ కమిషనర్ శైలజా రామయ్యర్ సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు) ::దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో బుధవారం మహా‌నవమి సంధర్బంగా చండీహోమం, పూర్ణాహుతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి హోమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ,దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఫౌండర్...
Read More...
Local News 

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి జగిత్యాల అక్టోబర్ 1(ప్రజా మంటలు)   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాఠశాల విద్యకి పెద్ద ప్రోత్సాహని అందించిందన్నారు. తెలంగాణకు ఈ సహకారం అందించినందుకు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ జి కి, కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ జి కి మరియు కేంద్ర విశ్వవిద్యాలయం జగిత్యాల(చలిగల్) లో ఏర్పాటు...
Read More...
Local News 

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు. 33 జిల్లాల్లో వాసవి క్లబ్ సేవ కార్యక్రమాలు బేష్    రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి    జింఖానా గ్రౌండ్ లో వాసవి క్లబ్ ఫౌండేషన్ డే    డ్రగ్స్ కు వ్యతిరేకంగా  గాల్లోకి లక్ష బెలూన్స్.. సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచంలో చాలా మంది బిజినెస్  మెన్స్ ఛారిటీ చేస్తారని, ఛారిటీ చేసే వారు...
Read More...
Crime  State News 

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ అక్టోబర్ 01 (ప్రజా మంటలు) ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని. డీజీపీ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఉదయం 9.45 గంటలకు నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన  శివధర్ రెడ్డి, తర్వాత పత్రికలతో మాట్లాడారు.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.... లోకల్ బాడీ ఎన్నికలు...
Read More...
National 

ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!

ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే! న్యూ ఢిల్లీ అక్టోబర్ 01 (ప్రజా మంటలు): కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఆసుపత్రిలో చేరారు.మల్లికార్జున ఖర్గే (83 సంవత్సరాలు) అనారోగ్యం కారణంగా ఈ ఉదయం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ సమాచారాన్ని ధృవీకరిస్తూ, ఖర్గే కుమారుడు మరియు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇలా అన్నారు: "ఖర్గే...
Read More...