సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రెండేళ్లు పూర్తి చేసుకున్న సీఎం ప్రజావాణి | 74 శాతం సక్సెస్ రేటు

On
సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక

హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు):

ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కు తరలివస్తున్నారు.
రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి వారం మంగళవారం మరియు శుక్రవారం నిర్వహించబడుతూ ఇప్పటివరకు 24 సెషన్లు పూర్తి చేసుకుంది.IMG-20260301-WA0016
దరఖాస్తులు – పరిష్కార వివరాలు

రెండేళ్ల కాలంలో సీఎం ప్రజావాణికి మొత్తం 1,12,245 దరఖాస్తులు నమోదు కాగా, వాటిలో 64,558 దరఖాస్తులు పరిశీలనకు తీసుకున్నారు. ఇందులో 47,935 దరఖాస్తులు పూర్తిగా పరిష్కరించగా, మిగిలిన 47,687 దరఖాస్తులు ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పథకాలకు సంబంధించినవి, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కావడంతో సంబంధిత శాఖలకు సిఫార్సు చేశారు.
దీంతో సీఎం ప్రజావాణి 74 శాతం పరిష్కార శాతం నమోదు చేసింది. ఈ స్థాయి సక్సెస్ రేటుతో ప్రజల్లో సీఎం ప్రజావాణిపై మరింత భరోసా పెరిగింది. ప్రస్తుతం ప్రతి వారం సగటున వెయ్యి దరఖాస్తులు నమోదు అవుతున్నాయి.

డాక్టర్ జీ. చిన్నారెడ్డి కీలక పాత్ర
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఆయన స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఓపికగా సమస్యలు విని, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి దరఖాస్తుపై ఎండార్స్‌మెంట్ చేసి స్వయంగా స్టాంప్ వేయడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.
అలాగే అన్ని దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపడం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి.

ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కేంద్రం
గల్ఫ్‌లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంగణంలో ప్రవాసి ప్రజావాణి కేంద్రంను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు
సీఎం ప్రజావాణిలో ప్రజలకు అనేక వసతులు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తులు రాయడానికి హెల్ప్‌డెస్క్
ప్రతి శాఖ అధికారులతో ప్రత్యేక డెస్కులు
వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు
వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ బగ్గీలు, వీల్‌చైర్లు
అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్
తాగునీటి సౌకర్యం
జీహెచ్‌ఎంసీ ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం

దివ్య దేవరాజన్ సేవలు
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, **సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో ఓపికతో సేవలందిస్తున్నారు.

పరిష్కారమవుతున్న ముఖ్య సమస్యలు
పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షలు
వైద్య, ఆరోగ్య శాఖ నియామకాలు
పోలీస్ రిక్రూట్‌మెంట్ జాప్యాలు
రైతుల వ్యవసాయ సమస్యలు
విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్లు
ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
**ఆర్టీసీ కార్మికుల సమస్యలు
గల్ఫ్ కార్మికుల సమస్యలు
సీఎం ప్రజావాణి విజయాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్, గ్రూప్–1 అధికారులు కూడా పరిశీలించారు.

భవిష్యత్ లక్ష్యం
సీఎం ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగడంలో డాక్టర్ జీ. చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి వెల్లడించారు.
Join WhatsApp

More News...

Local News 

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర...
Read More...
Local News 

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే  రొమ్ము, సర్వైకల్  క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా  గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన  హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో  స్థానిక  ఐ...
Read More...
Local News 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక  జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి  నాగేంద్రం  ఎన్నికయ్యారు.     గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్   ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్  కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా  వూడే అవంతిక అంగడి మఠంవీర...
Read More...
Local News 

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా  ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన           గావించి,  కార్యక్రమాలు ప్రారంభించారు.   మహిళలు ఆటపాటలతో  అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు...
Read More...
Local News 

రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి

రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు): రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది. ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:00 గంటలకు కరీంనగర్...
Read More...
State News 

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు): తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్...
Read More...
Local News 

సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కు తరలివస్తున్నారు.రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి...
Read More...
Local News 

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం వేములవాడ, మార్చి 01 (ప్రజా మంటలు): సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యువతీ–మహిళలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా వేములవాడలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.లాడ్జిలో మహిళ నగలు, నగదుతో ప్రియుడు పరార్జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే...
Read More...
Sports  State News 

రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్.

రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) :  ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల...
Read More...
Local News 

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు...
Read More...
Local News 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ. 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.     జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన...
Read More...
Local News 

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు    వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని  చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28  రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ను...
Read More...