ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags
Join WhatsApp

More News...

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్ 

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్     జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ  గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్...
Read More...

సి ఎస్ ఐ చర్చిలో అందించిన వైద్యసేవలు మరువలేనివి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సి ఎస్ ఐ చర్చిలో అందించిన వైద్యసేవలు మరువలేనివి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) సి.ఎస్.ఐ చర్చిలో వైద్య సేవలు మరువలేనివని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసి యేషన్  జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సతీమణి...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ . బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ .  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు)ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని...
Read More...

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం జగిత్యాల (రూరల్) నవంబర్ 24 +ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రం, ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో జిల్లా విశ్రాంతి ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని  కలిశారు. కార్యవర్గ నాయకులు శాలువతో పాటు, పుష్పగుచ్ఛాలు అందజేశారు మరియు విశ్రాంతి ఉద్యోగస్తుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో విశ్రాంతి ఉద్యోగస్తుల...
Read More...
Local News 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ చెందిన  పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా  ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ...
Read More...
National  Local News  State News 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన  ముంబై నవంబర్ 23: భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ జట్టు ఇలా ఉంది : బ్యాట్స్‌మెన్: రోహిత్‌ శర్మ, యశస్వి...
Read More...

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శన తర్వాత కవిత...
Read More...
Local News 

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, సత్య సాయి సేవా సమితి...
Read More...
Local News 

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,...
Read More...
Local News 

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్‌లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని   బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్...
Read More...
Local News 

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్...
Read More...