ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags
Join WhatsApp

More News...

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు ఉజ్జయిని జనవరి 23 (ప్రజా మంటలు): మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వీఎచ్‌పీ (VHP) నాయకుడిపై జరిగిన దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి అల్లర్లు చెలరేగినట్లు సమాచారం. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు ఇళ్లపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. హింస తీవ్రత పెరగడంతో పోలీసులు భారీగా...
Read More...
National 

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం

శ్రీనగర్‌లో మంచుపాతం  రవాణా, విద్యుత్ అంతరాయం శ్రీనగర్‌ జనవరి 23: శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.   మంచు పరిస్థిత శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం...
Read More...
Local News  State News 

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా బీఆర్ఎస్ పార్టీ...
Read More...

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య  ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు.  జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ
Read More...
Local News  State News 

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్ బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు? జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే...
Read More...
Crime  State News 

భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ

 భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు): భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్‌ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్...
Read More...
Crime  State News 

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు): మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న...
Read More...
Spiritual   State News 

బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు

బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు నిర్మల్, జనవరి 23 (ప్రజా మంటలు): తెలంగాణలోని ప్రసిద్ధ విద్యాపీఠమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యాదేవత సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోమాలు,...
Read More...
Local News  Spiritual   State News 

కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు

కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు....
Read More...
State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన దృష్టి మళ్లింపు కుట్రగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు వైఫల్యం, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును ముందుకు...
Read More...
National  Crime 

జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్‌లో అరుదైన పరిణామం

జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్‌లో అరుదైన పరిణామం జైపూర్, జనవరి 23: రాజస్థాన్‌లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులో ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు కోర్టు పరోల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైప్రొఫైల్ దుష్యంత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియ సెత్ (నేహా సెత్) కు...
Read More...

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన డావోస్ | జనవరి 22 : ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
Read More...