ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వనపర్తి జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ... దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా... ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... పిల్లల సిరప్పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
పిల్లలకు ఉపయోగించే Almont-Kid Syrup విషయంలో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బిహార్కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారు చేసిన ఈ... జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి
జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు... సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం
జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం... నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
మహేశ్వరం జనవరి 9 (ప్రజా మంటలు):
నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని... వీడియో కాల్లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్
కోరుట్ల జనవరి 09 (ప్రజా మంటలు):
కోరుట్ల పట్టణంలో వీడియో కాల్ ద్వారా తుపాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం… కోరుట్ల పట్టణంలోని “కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్” పేరిట మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఎయిర్టెల్ నెట్వర్క్ బిజినెస్... ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత
హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):
గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక... ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్
జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ రమణ రావు జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ పి ఈ మార్చ్ 2026 అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు సంబంధించిన మౌలిక... ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ
జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు)
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న సిరిసిల్ల రాజేంద్ర శర్మ లు కేంద్ర రాష్ట్ర... 