ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం 

జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం  జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ...

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ... సికింద్రాబాద్, జనవరి 18( ప్రజామంటలు): హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్రయులు, సంచారజాతులను గుర్తించి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవన పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్...
Read More...

అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ  జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం విద్యా నగర్ ఎడ్లంగడి సమీపంలో ని, శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో, అన్నపూర్ణ సేవాసమితి, వారు అన్న ప్రసాద వితరణ ఈ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ...
Read More...
Local News  Crime 

తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం

 తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా...
Read More...

డ్రంక్ అండ్ డ్రైవ్  నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

డ్రంక్ అండ్ డ్రైవ్  నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా...
Read More...
State News 

ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు   రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.   ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ కూసుమంచిలో ...
Read More...
Local News  Sports  State News 

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా మెటుపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదిలాబాద్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు. 8 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 60 మీటర్ల...
Read More...

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి...
Read More...

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్: కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్...
Read More...
State News 

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి ఖమ్మం, జనవరి 18 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా తరిమికొట్టాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పేదలను మోసం...
Read More...
National  International  

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం బ్రస్సెల్స్ జనవరి 18: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత...
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి,

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి, (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 18 జనవరి (ప్రజా మంటలు) :  సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్...
Read More...