ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... 