ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్... నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి
కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ... ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్లో నిర్వహించిన ధర్మపురి మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గాల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి మంత్రి... తుమ్మేనాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
ధర్మపురి సెప్టెంబర్ 5( ప్రజా మంటలు )మండలంలోని "తుమ్మేనాల" ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న "సముద్రాల శిరీష" జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది.
శనివారం జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా విద్యాధికారి... సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు)జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ల పిలుపు మేరకు సెప్టెంబర్ 10న నిర్వహించనున్న... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన మల్యాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ
మల్యాల సెప్టెంబర్5 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న మోతే శివరామకృష్ణ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కళాశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి... తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?
హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు):కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్కుమార్ ఆరోపించారు. కృష్ణా నదీ... శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా "రుద్రాంగి ఈశాన్వి" గోపిక వేషధారణ
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విద్యాసంస్థల్లో పాఠశాల చిన్నారులచే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం తో పాటు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలు అలరించాయి.
ఇదిలా ఉండగా రుద్రాంగి రాఘవేంద్ర శ్రీవిద్య కూతురు రుద్రంగి ఈశాన్వి గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో... రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.... సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్పర్సన్గా, క్యాబినెట్ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు... త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా... 