ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత    సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన...
Read More...
State News 

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్ హైదరాబాద్, జూలై 28: హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం...
Read More...
State News 

జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

 జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక...
Read More...
Filmi News  State News 

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు): ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....
Read More...
Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...
State News 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం   కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా? హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని...
Read More...
Local News 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం  జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)   సనాతనంగా  సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది. ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం...
Read More...
National  Local News  Opinion  State News 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..  సెల్యూట్ టు ది లీడర్...   నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు. అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...  రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్...
Read More...
Local News 

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్...
Read More...
Local News 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.  మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం. 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.   మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.     జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు) సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113) చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన...
Read More...