ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము    జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు) దొంత రాజేశ్వరి గిర్ధవర్ ఆర్చరికి ఘన సన్మానం దొంత రాజేశ్వరి గిర్దావర్ వెల్గటూర్        మండలం   ఓపెన్ మాస్టర్ గేమ్స్ 2025 లో నేషనల్ గేమ్స్ గోవా : బంగారు పథకం ఉత్తరఖాండు :బంగారు పథకం హిమాచల్ ప్రదేశ్ : బంగారు పథకం సౌత్ కొరియ : 2023 లో...
Read More...
Local News 

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”*

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”* *“ జగిత్యాల మార్చి 26 ప్రజా మంటలు)  జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో...
Read More...
Crime  State News 

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన...
Read More...
National  State News 

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు): రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్  ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని...
Read More...
State News 

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు జగిత్యాల, మార్చ్ 25 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది.“ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ” అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం...
Read More...
State News 

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి...
Read More...
Local News 

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 24 ( ప్రజా మంటలు)కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు, ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  ఈ సందర్భంగా మాట్లాడుతూ తరచు వాహనములు మరమ్మతుకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయిల్ చేంజ్ సకాలంలో చేస్తూ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. పట్టణ...
Read More...
Local News 

క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల మార్చి 24 (ప్రజా మంటలు)ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్...
Read More...
Local News  State News 

తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.

తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). నేటి  తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు  హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). : 1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది. మత...
Read More...
Local News 

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి  ఐసిడిఎస్ సిడిపిఓ మమత    జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...