ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM... చాచా నెహ్రూ నగర్లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా... గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన
(అంకం భూమయ్య(
గొల్లపల్లి నవంబర్ 25 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీరాములపల్లె లో విద్యుత్ వైర్లు, విద్యుత్ పనులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలోశ్రీరాములపల్లె,... భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్ లో భక్తుల రద్దీ
ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు...
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :
సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు... పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్
ఈ క్షణం నుంచే ఎలెక్షన్ కోడ్ అమల్లోకి
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
🗳️పోలింగ్ షెడ్యూల్
1️⃣ తొలి విడత – డిసెంబర్ 11
2️⃣ రెండో విడత –... కాంగ్రెస్లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు
డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…“వర్గాల వేటగాళ్ల లీగ్”లేదా“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”
ఎందుకంటే బయటకు కాంగ్రెస్... 