ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 36వ వార్డ్ అభ్యర్థి పుల్ల సుమలత-హరీష్ ,21వ జగ్గుల శిరీష కి మద్దతుగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి... రాయికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో... కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్
రామగుండం, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని విస్తృత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా... రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం శనివారం రోజంతా ఫోక్ పాట చిత్రీకరణతో కళకళలాడింది. స్థానిక ప్రజల జీవనశైలిని, గ్రామీణ భావోద్వేగాలను ప్రతిబింబించే ‘కడదాకా తోడుంటనే’ అనే ఫోక్ సాంగ్ షూటింగ్ భారీ ఆసక్తి నడుమ సాగింది.
ఈ పాటను బొమ్మరిల్లు ఫోక్స్ యూట్యూబ్ ఛానల్... దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు
మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్లో కలకలం రేగింది.... ఉచిత రేషన్కు గుడ్బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా కోట్లాది పేదలకు ఉచిత రేషన్ రూపంలో బియ్యం, గోధుమలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ... బ్యాక్డోర్లో బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్?: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని పలువురు నిరుద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత తీవ్ర నిరాశలో ఉందని... అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
జగిత్యాల, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు – అంకం భూమయ్య):
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అత్యంత దారుణమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారి, ఆమెను అమానుషంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భర్త–భార్యల మధ్య కొంతకాలంగా... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుప లేని ప్రధాని మోదీ : పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రశ్నలు
భారత పార్లమెంటు సాంప్రదాయాల్లో అత్యంత కీలకమైనది — రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ. జవాబు. ఇది కేవలం ఒక విధి కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే సందర్భం. అలాంటి కీలక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రసంగించకపోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది.... భారత్–అమెరికా మధ్య అంతరిమ వాణిజ్య ఒప్పందం: కీలకాంశాలు
ఇదిగో మీ వెబ్సైట్ “ప్రజా మంటలు” కోసం, పూర్తి స్థాయి **తెలుగు సమగ్ర నివేదిక (Comprehensive Report)**తో పాటు SEO Meta Title, Description కూడా ఇస్తున్నాను. వార్తా శైలి, విశ్లేషణ, ఉపశీర్షికలతో సిద్ధంగా ఉంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ చూపించేలా **అంతరిమ... అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)పట్టణంలోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస పద్మావతి ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను... 