సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

On
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక


  *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​
  *  గాంధీ ఆసుపత్రి తనిఖీ

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​, ఆర్​ఎంవోలు ప్రతిరోజు  రెగ్యులర్​ గా వార్డుల్లో రౌండ్స్​ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్​ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్​ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్​, నర్సింగ్​, శానిటేషన్​ స్టాఫ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నారు. 

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్​ తనిఖీలు:

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్​ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్​ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్​ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్​ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్​ ఫైటింగ్ సిస్టమ్​,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్​ మెంట్​ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్​, గదుల్లో లైటింగ్​ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.ఇందిరా, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్​ఈవో వేణుగోపాల్​ గౌడ్​, టీజీఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు...
Read More...
Local News 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ. 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.     జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన...
Read More...
Local News 

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు    వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని  చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28  రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ను...
Read More...
Local News 

వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు కాకినాడ ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):) వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి18 మంది మృతి – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండకాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు ప్రాణాలు...
Read More...
National  International  

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్...
Read More...
National  State News 

లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?

లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు? ప్రత్యేక కథనం ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?”...
Read More...
National  State News 

రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి?

రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి? : హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో “రుణభారం తగ్గింది” అని చెబుతోంది. వడ్డీ రేటు తగ్గించామని, ఇన్‌స్టాల్మెంట్లు (EMI) తక్కువయ్యాయని చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — నిజంగా రుణం తగ్గిందా? లేక కేవలం చెల్లింపు విధానం మారిందా?...
Read More...
State News 

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): మెట్‌పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.ప్రస్తుతం మెట్‌పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని,...
Read More...
Local News 

బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము

బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్‌జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ జగిత్యాల ఫిబ్రవరి 27 ( ప్రజా మంటలు)రాష్ట్ర స్తాయి సీఎం కప్ లో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అభినందించారు సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ విభాగంలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొని   ఏ  హర్షిత్...
Read More...
Local News 

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్ జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు)పిఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 'పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు....
Read More...
State News 

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా?

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా? హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం 2026” నివేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసేలా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్,...
Read More...