సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

On
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక


  *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​
  *  గాంధీ ఆసుపత్రి తనిఖీ

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​, ఆర్​ఎంవోలు ప్రతిరోజు  రెగ్యులర్​ గా వార్డుల్లో రౌండ్స్​ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్​ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్​ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్​, నర్సింగ్​, శానిటేషన్​ స్టాఫ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నారు. 

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్​ తనిఖీలు:

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్​ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్​ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్​ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్​ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్​ ఫైటింగ్ సిస్టమ్​,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్​ మెంట్​ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్​, గదుల్లో లైటింగ్​ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.ఇందిరా, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్​ఈవో వేణుగోపాల్​ గౌడ్​, టీజీఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Local News  Opinion  State News 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..  సెల్యూట్ టు ది లీడర్...   నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు. అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...  రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్...
Read More...
Local News 

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్...
Read More...
Local News 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.  మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం. 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.   మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.     జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు) సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113) చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన...
Read More...
National  Local News  State News 

విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్.

విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) :  జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్....
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య  కొండగట్టు జులై 25( ప్రజా మంటలు)   కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  , శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు...
Read More...
National  Local News  State News 

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.  జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) :  కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు,...
Read More...
National  Local News 

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్...
Read More...
Local News 

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్                           జగిత్యాల జులై 23( ప్రజా మంటలు)  పట్టణం 37 ,38 వార్డ్ లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ ఐ ఆర్  ప్రక్రియను పరిశీలించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.    ప్రజాస్వామ్య విలువలను...
Read More...
National  State News 

తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు

తమిళనాడు లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ...
Read More...
Local News 

NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్

NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్ :చెన్నై ,జులై 22: “న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు...
Read More...
State News 

ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి

ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):   బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల...
Read More...
State News 

ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత

ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు): బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ...
Read More...