సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక
* డీఎంఈ డా.నరేంద్ర కుమార్ వార్నింగ్
* గాంధీ ఆసుపత్రి తనిఖీ
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హెచ్ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) డా.నరేంద్రకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ప్రతిరోజు రెగ్యులర్ గా వార్డుల్లో రౌండ్స్ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు:
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్ మెంట్ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్, గదుల్లో లైటింగ్ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి. జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయినా ఉద్యోగుల... విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారని దాని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థానిక తహశీల్ చౌరస్తాలోనిరసన ధర్నా చేపట్టిబంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు
ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు... నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)నవ్య బాలికల జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ హాజరై ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల నెలకొల్పి అతికొద్ది కాలంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ,... అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి _అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
కోరుట్ల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం... తాడిచెల్లి నూతన సర్పంచ్ రామిడి రాజిరెడ్డికి ఘన సత్కారం
రం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం తాడిచెల్లి గ్రామానికి నూతన సర్పంచ్గా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి రాజిరెడ్డిని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... ట్రిపుల్ ఆర్, భూసేకరణ, రైతు–చేనేత సమస్యలపై జాగృతి పోరాటం – భువనగిరిలో కవిత సంచలన వ్యాఖ్యలు
భువనగిరి డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్మీట్లో విస్తృత అంశాలపై స్పందించారు. తాను తెలంగాణ ప్రజల బాణమని, ఎవరో ఆపరేట్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో బరిలో ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు... పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు... పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్ ముఖాముఖి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పొలాస వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య,... ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ఇందిరా భవన్లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జీవన్రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల... 