సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

On
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక


  *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​
  *  గాంధీ ఆసుపత్రి తనిఖీ

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​, ఆర్​ఎంవోలు ప్రతిరోజు  రెగ్యులర్​ గా వార్డుల్లో రౌండ్స్​ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్​ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్​ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్​, నర్సింగ్​, శానిటేషన్​ స్టాఫ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నారు. 

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్​ తనిఖీలు:

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్​ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్​ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్​ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్​ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్​ ఫైటింగ్ సిస్టమ్​,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్​ మెంట్​ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్​, గదుల్లో లైటింగ్​ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.ఇందిరా, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్​ఈవో వేణుగోపాల్​ గౌడ్​, టీజీఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు): గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెర్రెల్ల...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన...
Read More...

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి    జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో...
Read More...

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్        జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన  మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
National  State News 

ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం

 ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం అహ్మదాబాద్ డిసెంబర్ 26: గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం...
Read More...
Local News  State News 

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80)  అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మాజీ...
Read More...
Local News  Crime  State News 

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు నంద్యాల డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి...
Read More...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...