సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక
* డీఎంఈ డా.నరేంద్ర కుమార్ వార్నింగ్
* గాంధీ ఆసుపత్రి తనిఖీ
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హెచ్ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) డా.నరేంద్రకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ప్రతిరోజు రెగ్యులర్ గా వార్డుల్లో రౌండ్స్ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు:
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్ మెంట్ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్, గదుల్లో లైటింగ్ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని శ్రీ గాయత్రీ అనాధ వృద్దాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి,,వయో వృద్ధుల చట్టం పై... తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దిశగా “పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం” సహా 30కి పైగా అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ–ఎంబీసీ సాధికారత, మహిళలు, యువత, మైనార్టీలు, గల్ఫ్ కార్మికులు,... ఎంఐఎం బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్.
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా, టౌన్ కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక.
ఎంఐఎం బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. బుధవారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జగిత్యాల జిల్లా,
ఈ... చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల పోస్టర్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8... 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక
జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్లోని ప్రభుత్వ ఉన్నత... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 07 (ప్రజా మంటలు):
*'అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణ*మహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 7 ( ప్రజా మంటలు) *అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణమహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :
సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు):
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న... డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
రాయికల్
ఈ... సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం
గొల్లపల్లి జనవరి 07 (ప్రజా మంటలు):
కథలాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు సభ్యులు పద్మశాలి కమ్యూనిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల... జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ... 