సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

On
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక


  *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​
  *  గాంధీ ఆసుపత్రి తనిఖీ

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​, ఆర్​ఎంవోలు ప్రతిరోజు  రెగ్యులర్​ గా వార్డుల్లో రౌండ్స్​ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్​ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్​ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్​, నర్సింగ్​, శానిటేషన్​ స్టాఫ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నారు. 

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్​ తనిఖీలు:

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్​ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్​ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్​ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్​ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్​ ఫైటింగ్ సిస్టమ్​,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్​ మెంట్​ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్​, గదుల్లో లైటింగ్​ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.ఇందిరా, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్​ఈవో వేణుగోపాల్​ గౌడ్​, టీజీఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Comment  State News 

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా? నలుగురి మధ్యలో పోటీ జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున...
Read More...

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు) మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి...
Read More...
Local News  State News 

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు...
Read More...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో...
Read More...

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు11.30,  ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా వార్డు నంబర్ పార్టీ గెలిచిన అభ్యర్థి 1 ఇండిపెండెంట్ చెట్టే గంగాధర్ 4 కాంగ్రెస్ క్యాదాసు నవీన్ 7 బీఆర్ఎస్ కోరుకంటి రాము 10 (TR నగర్) కాంగ్రెస్ చాంద్ పాషా 14 కాంగ్రెస్ బాలే లత శంకర్ 16 కాంగ్రెస్ దూమాల రాజ్ కుమార్...
Read More...

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత   జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో...
Read More...

శతాధిక ఆచార్యుని పరమపదం 

శతాధిక ఆచార్యుని పరమపదం  లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో  ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు. ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు...
Read More...
Crime 

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే...
Read More...
Crime  State News 

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ...
Read More...

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి...
Read More...
State News 

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత   న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి...
Read More...
National  Comment  International  

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం    యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146...
Read More...