సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక
* డీఎంఈ డా.నరేంద్ర కుమార్ వార్నింగ్
* గాంధీ ఆసుపత్రి తనిఖీ
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హెచ్ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) డా.నరేంద్రకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ప్రతిరోజు రెగ్యులర్ గా వార్డుల్లో రౌండ్స్ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు:
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్ మెంట్ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్, గదుల్లో లైటింగ్ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి... బీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా
శ్రీ... రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్,
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్... వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు... గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా... ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు
ఇబ్రహింపట్నం డిసెంబర్ 30(ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, పకిర్ కోండా పుర్, వేములకుర్తి, ఎర్దండి, కోమటీకోండాపుర్, వర్షకోండ, ఇబ్రహీంపట్నం, డబ్బ గ్రామాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర
ఈకార్యక్రమంలో... ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం
గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు... జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... 