భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

On
భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం
నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. 49వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పద్మశాలి సేవా సంఘం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. కాగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ మాత, శ్రీ భక్త మార్కండేయుడు, శ్రీ సీతారామంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కొలువై ఉన్నారు. నిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూ పూజలు నిర్వహిస్తూ మొక్కలు చెల్లించుకోవడంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.  

ఆదివారం 09 ఫిబ్రవరి  నుంచి  13వ తేదీ  వరకు ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద బ్రామ్మణుల  మంత్రోచ్ఛారణ మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి రోజు ఆదివారం రోజున ఉదయం 9.00 ని'లకు  గణపతి, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణధారణ, ఋత్విక్ వర్ణనం, నవగ్రహ చతుషష్టి యోగిని, వాస్తుక్షేత్రపాలక, లింగతోభద్ర దేవతల స్థాపన, సాయంత్రం నుండి  ధ్వజారోహణం, అంకురారోపణ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ప్రారంభమై సోమవారం ఉ"9:00ని"లకు స్థాపిత దేవతారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, తీర్థప్రసాద వితరణ, మంగళవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, వేదమాత గాయత్రీ మాతకు పంచామృత అభిషేకం, స్థాపిత దేవత హవనం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది.

సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, డోలోత్సవం, వేద సదస్సు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, బుదవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతలకు రుద్రాభిషేకం, రుద్ర హవనం, మన్యుసూత్ర పారాయణం, పంచసుక్త హవనం, వసంతోత్సవం, మంగళహారతి, మంతపుష్పం, తీర్థప్రసాద వితరణ, గురువారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, హవనం, బలిహరణం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, నాకబలి, ధ్వజారోహణం, కుంభోద్వాసన, దేవతాప్రొక్షణం, పల్లకి సేవ, ఏకంతసేవ, మహదాశిర్వచనం, ఆచార్య రుత్విక్ సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు  ముగుస్తుందని పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

IMG-20250208-WA0228 ఐదు రోజుల పాటు వేడుకలు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రధాన అర్చకులు మేడిపెల్లి శ్రీనివాస్ శర్మ పాటు, శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ, ఆంజనేయ శర్మ, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహించనున్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైదరాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు): 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి   హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సేవ, శాస్త్ర–సాంకేతికం, వైద్యం, విద్య, సాహిత్యం, కళల రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ...
Read More...

2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు

2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వచ్చిన అవార్డుల వివరాలు న్యూఢిల్లీ, జనవరి 25 (ప్రజా మంటలు): మొత్తం 131 పద్మ అవార్డులు – 2026 ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయకు పద్మభూషణ్ తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్‌కు 4 పద్మశ్రీ అవార్డులు దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ ఏడాది విశేష గుర్తింపు భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ...
Read More...
Local News  Sports 

జింఖానా గ్రౌండ్‌లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు

జింఖానా గ్రౌండ్‌లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు): ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం  సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్‌నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సనత్‌నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల...
Read More...

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జనవరి 25 (ప్రజా మంటలు): కరీంనగర్ పాత మార్కెట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్...
Read More...

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)" మెడల్‌ కు ASI ఆనందం ఎంపిక అభినందించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)      జగిత్యాల జనవరి 25 ( ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ ఆనందం  కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన  మెడల్ ఫర్ మెడిటోరియస్ సర్వీస్ (ఎం ఎస్ ఎం) మెడల్‌ కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. విధి నిర్వహణలో...
Read More...

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు): హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు. జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక...
Read More...
National  Comment  International  

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా? జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు....
Read More...

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు న్యూయార్క్ జనవరి 25: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే...
Read More...
National  State News 

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం చెన్నై / మామల్లపురం జనవరి 25: తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై...
Read More...
National  State News 

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు): భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్‌, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం నిజామాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు): నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి ముఠా దారుణంగా దాడి చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులు సౌమ్యను ఢీకొట్టి, ఆమె కడుపు మీద నుంచి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో...
Read More...

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా...
Read More...