భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

On
భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం
నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. 49వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పద్మశాలి సేవా సంఘం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. కాగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ మాత, శ్రీ భక్త మార్కండేయుడు, శ్రీ సీతారామంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కొలువై ఉన్నారు. నిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూ పూజలు నిర్వహిస్తూ మొక్కలు చెల్లించుకోవడంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.  

ఆదివారం 09 ఫిబ్రవరి  నుంచి  13వ తేదీ  వరకు ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద బ్రామ్మణుల  మంత్రోచ్ఛారణ మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి రోజు ఆదివారం రోజున ఉదయం 9.00 ని'లకు  గణపతి, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణధారణ, ఋత్విక్ వర్ణనం, నవగ్రహ చతుషష్టి యోగిని, వాస్తుక్షేత్రపాలక, లింగతోభద్ర దేవతల స్థాపన, సాయంత్రం నుండి  ధ్వజారోహణం, అంకురారోపణ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ప్రారంభమై సోమవారం ఉ"9:00ని"లకు స్థాపిత దేవతారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, తీర్థప్రసాద వితరణ, మంగళవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, వేదమాత గాయత్రీ మాతకు పంచామృత అభిషేకం, స్థాపిత దేవత హవనం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది.

సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, డోలోత్సవం, వేద సదస్సు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, బుదవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతలకు రుద్రాభిషేకం, రుద్ర హవనం, మన్యుసూత్ర పారాయణం, పంచసుక్త హవనం, వసంతోత్సవం, మంగళహారతి, మంతపుష్పం, తీర్థప్రసాద వితరణ, గురువారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, హవనం, బలిహరణం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, నాకబలి, ధ్వజారోహణం, కుంభోద్వాసన, దేవతాప్రొక్షణం, పల్లకి సేవ, ఏకంతసేవ, మహదాశిర్వచనం, ఆచార్య రుత్విక్ సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు  ముగుస్తుందని పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

IMG-20250208-WA0228 ఐదు రోజుల పాటు వేడుకలు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రధాన అర్చకులు మేడిపెల్లి శ్రీనివాస్ శర్మ పాటు, శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ, ఆంజనేయ శర్మ, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహించనున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి, జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్‌కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు....
Read More...
National  Comment  International  

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి? న్యూఢిల్లీ, జనవరి 17: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ...
Read More...
National  State News 

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు): తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ...
Read More...
State News 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి  వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్ సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):  రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి...
Read More...
National  Comment  International  

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు కోపెన్‌హేగెన్, జనవరి 17 : విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్‌లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా...
Read More...

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె...
Read More...

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల    జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)   జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్...
Read More...
State News 

లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి

లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ...
Read More...
Local News  State News 

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు): బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ...
Read More...
Local News 

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు): మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది. జనరల్ (ఓపెన్) వార్డులు వార్డు నంబర్లు 01, 03, 17, 21, 23 మొత్తం : 5 వార్డులు జనరల్ – మహిళ వార్డులు వార్డు...
Read More...
State News 

తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు

 తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు  ) BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు 🔹 BC మహిళ మున్సిపాలిటీ ఎల్లందు జగిత్యాల కామారెడ్డి బాన్సువాడ...
Read More...
State News 

జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు

జగిత్యాల బిసి మహిళా,  కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్‌రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది. జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్...
Read More...