స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేవలం ప్రకటనల వల్ల ఉపయోగం లేదు
అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఫిబ్రవరి 04:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతుందని, ఇది కేవలం జనాభాను తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు.
ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. "2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా 10 సంవత్సరాలలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్నది అంచనా. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా కనిపిస్తుంది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?" అని ప్రశ్నించారు.
తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11(ప్రజా మంటలు)రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఏ.సుగుణ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1లక్ష 20 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ తదితరులు... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)మొదటి విడత సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు... పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్
సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 8న జరిగిన... మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన... శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని... మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి
రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్... కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత
కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు):
కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు... రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి
జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు)నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కి గతంలో జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల రురల్ మండల్ అనంతరం గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడం, నిత్యం ప్రమాదాలు జరగడం మరియు జగిత్యాల్ అర్బన్ మండల్ అంబారిపేట్ రోడ్డు విస్తరణ మరియు రైల్వే... బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,)
బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5... మొదటి విడత 11వ తేదీన జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్
మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు ) మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ను జిల్లా కలెక్టర్... కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు
ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు)
(S. వేణు గోపాల్)
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను వేర్వేరుగా కలిశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.
కేంద్ర రైల్వే శాఖ... స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి
కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను... 