స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేవలం ప్రకటనల వల్ల ఉపయోగం లేదు
అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఫిబ్రవరి 04:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతుందని, ఇది కేవలం జనాభాను తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు.
ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. "2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా 10 సంవత్సరాలలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్నది అంచనా. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా కనిపిస్తుంది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?" అని ప్రశ్నించారు.
తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లశాసన సభలో చెప్పారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, కాలుష్య నివారణ, శుద్ధి నీటి ప్రవాహం... కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే... కౌన్సిల్లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
తాను చేసిన రాజీనామాను కౌన్సిల్లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్ను కోరనున్నట్లు... తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.... బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి
ఢాకా జనవరి 01:
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో... అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?
న్యూ ఢిల్లీ జనవరి 01:
దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం... జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్... ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... 