స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేవలం ప్రకటనల వల్ల ఉపయోగం లేదు
అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ ఫిబ్రవరి 04:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.

కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతుందని, ఇది కేవలం జనాభాను తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు. 

ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. "2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా 10 సంవత్సరాలలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్నది అంచనా. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా కనిపిస్తుంది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?" అని ప్రశ్నించారు. 

తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags
Join WhatsApp

More News...

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి  సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా  ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం...
Read More...

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం 

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  డా .బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం...
Read More...
Local News  State News 

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం సికింద్రాబాద్,  ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల...
Read More...
Local News  Spiritual  

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం  ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం...
Read More...

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత 

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత  జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా (బాస్ )బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ జనగామ నాగరాజు జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకొని అఖిల బ్రాహ్మణ  అర్చక సేవా సంఘము అధ్యక్షులు సిరిసిల్ల పార్థసారథి శర్మను జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం లో కలిసి బ్రాహ్మణ...
Read More...
National  Comment  International  

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం — రాజకీయ విశ్లేషణ ఎప్స్టీన్ ఫైల్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావన రావడం దేశ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెరలేపింది. న్యాయపరంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్షాల చేతుల్లో ఒక రాజకీయ ఆయుధంగా మారుతున్న తీరే అసలు చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ వ్యవహారంలో అసలు ప్రశ్న...
Read More...
National 

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన న్యూఢిల్లీ ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 75 నిమిషాల తన ప్రసంగం, సామాన్యులను, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేక పోయింది. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, పన్ను సంస్కరణలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. Union Budget 2026-27...
Read More...
Local News  Spiritual  

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర  బీమదేవరపల్లి  మండలంలో   ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు   తండోప  తండాలుగా  తరలివచ్చారు. గ్రామాల  నలుమూలల నుంచి   మాత్రమే...
Read More...
Local News  Crime 

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు....
Read More...

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ...
Read More...

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన       ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ...
Read More...

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే...
Read More...