స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేవలం ప్రకటనల వల్ల ఉపయోగం లేదు
అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ ఫిబ్రవరి 04:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.

కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతుందని, ఇది కేవలం జనాభాను తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు. 

ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. "2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా 10 సంవత్సరాలలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్నది అంచనా. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా కనిపిస్తుంది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?" అని ప్రశ్నించారు. 

తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్ బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యులుగా, మూడేళ్ల కాలం పాటు నియామకం అయిన ట్రస్ట్ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి నియామకానికి సహకరించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య   బైక్ దొంగను తరలిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో,కానిస్టేబుల్ ప్రమోద్‌ ఘాట్‌ గాయాలతో మృతి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):   వినాయక్‌ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై శుక్రవారం సూక్ష్మ కత్తితో దాడి జరిగింది. బైక్ దొంగతనాల్లో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ,స్టేషన్‌కు తరలించే తీవ్ర...
Read More...
Local News 

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్‌ రెడ్డి 

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి  - చిలకలగూడ ఏసీపీ శశాంక్‌ రెడ్డి  సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 19 (ప్రజామంటలు): దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిలకలగూడ డివిజన్‌ ఏసీపీ శశాంక్‌ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు పలు  సూచనలు చేశారు. చిన్న పిల్లలు క్రాకర్లు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు....
Read More...
Local News  International  

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు 

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు  సికింద్రాబాద్,  అక్టోబర్ 18 (ప్రజా మంటలు):   యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటలో శనివారం రాత్రి పలువురు ప్రవాస హైదరాబాదీలు  దీపావళి పండుగను ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు.  దీపావళి వేడుకలను పురస్కరించుకొని తమ ఇండ్ల ముందు వివిధ రకాల పూలతో అందమైన రంగవల్లికలు వేసి అందులో దీపాలు పెట్టి సాంప్రదాయ బద్ధంగా కాకర...
Read More...
Local News 

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ 

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించి.మొక్కజొన్న రైతుల కొనుగోలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, రైతులకు జిల్పలా కలెక్టర్ సత్య ప్రసాద్  సూచనలు చేశారు.ధరల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.రైతులు తేమ శాతం 14 శాతం ఉండేవిధంగా చూసుకోవాలని...
Read More...
Local News 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా  జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజా మంటలు): టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్బాషా గారు జగిత్యాల జిల్లా అతిథి గృహములో ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి, కండువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా గల్ఫ్...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం    హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): జ్యోతి సురేఖ వెన్నం (జననం: 3 జూలై 1996, చల్లపల్లి, కృష్ణ జిల్లా ఆంధ్రప్రదేశ్) భారతీయ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్చర్. కాంపౌండ్ బోว์ విభాగంలో ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. K L యూనివర్సిటీ నుండి బీటెక్ మరియు ఎంబిఎ పూర్తి చేసిన జ్యోతి, 2024...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం! జ్యోతి సురేఖ వెన్నం – తొలి భారత మహిళా కంపౌండ్ ఆర్చర్‌గా వరల్డ్ కప్ ఫైనల్ పతక విజేత అమెరికాలో జరిగిన ఫైనల్‌లో కాంస్య పతకం అంతర్జాతీయ స్థాయిలో మరో గర్వకారణమైన ఘనత హైదరాబాద్ అక్టోబర్ 18: భారతీయ ఆర్చరీలో కొత్త చరిత్ర రాసింది తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం. వరల్డ్ కప్...
Read More...
Local News 

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో గల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల కార్యాలయంలో శనివారం రోజున పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పల్లికొండ నరేష్
Read More...
Local News 

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు జగిత్యాల అక్టోబర్ 18 ( ప్రజా మంటలు) తెలంగాణ వ్యాప్తంగాబీసీ రిజర్వేషన్ బిల్ మద్దతుగా 42% రిజర్వేషన్ బీసీ లకు కల్పించాలని చట్టసభలలో రాష్ట్రమంతట బీసీ రిజర్వేషన్ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించిన రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని బిల్ లో సమస్యలు ఉన్నాయని రిజర్వేషన్ను తాత్కాలీకంగా గా నిలుపుదల చేసారు. అందుకు ఈ బిల్...
Read More...
Local News 

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీ లోరెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్...
Read More...
Local News 

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత    జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి  తేదీ : 26/10/2025 రోజున తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగ్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి లు మరియు వివిధ...
Read More...