హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.

నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.

On
హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. -  చెరుకు మహేశ్వర శర్మ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) : 

తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.

పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.

ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.

 నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్‌,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్‌ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.

ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.

దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.

అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.

పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.

కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.

మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.

ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.

కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.

అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.

ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.

వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.

అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో) 🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు జనవరి 6, 2025 – మెట్‌పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి. జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి. ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని...
Read More...
Local News  State News 

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్. సికింద్రాబాద్ డిసెంబర్ 31  (ప్రజా మంటలు): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై....
Read More...

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్ 

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్       జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఆవిష్కరించడం జరిగినది.   ఈ సందర్భంగా ఈ...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title తపోవన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కార్నివల్_ పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, జగిత్యాల 31 (ప్రజా మంటలు)ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివల్. గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి ? ఎలా నేర్చుకోవాలి అనే అవగాహన కొరకు బుధవారం నాడు...
Read More...

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్  బి.సత్య ప్రసాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ...
Read More...

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా  నియామకమైన సుజాత  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్  ఉన్నారు.
Read More...

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన* *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన*  *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* *జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజామంటలు) జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా...
Read More...

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర...
Read More...

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు) పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ అశోక్ కుమార్  పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు. సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో...
Read More...

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్‌సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో...
Read More...
Local News 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి  రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...
Read More...