హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.
నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) :
తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.
పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.
ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.
దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.
పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.
ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.
అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండియా vs సౌత్ ఆఫ్రికా — ఎడెన్ గార్డెన్స్లో, సౌత్ ఆఫ్రికా ఉత్కంఠ భరిత విజయం
ఇండియా vs సౌతాఫ్రికా ఎడెన్ గార్డెన్స్ టెస్ట్ 2025లో సౌతాఫ్రికా 30 రన్లతో గెలిచింది. బుమ్రా ఫైవర్, హ్యార్మర్ 8 వికెట్లు, బవుమా కీలక ఇన్నింగ్స్, ఇండియా 93కి ఆలౌట్ – పూర్తి మ్యాచ్ విశ్లేషణ ఇక్కడ చదవండి. రామోజీరావు ఎక్స్లెన్స్ అవార్డుల ప్రకటన
రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2025 ఈ సంవత్సరం మరోసారి సేవ, ప్రతిభ, కృషికి ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో నిరూపించాయి. సమాజానికి నిజమైన సేవచేసే వ్యక్తులకు ఇది మరొక ప్రమేయం, మరొక ప్రోత్సాహం. మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్
స్వయంసేవకులు తమ అవసరాలను తగ్గించుకుని, స్వచ్ఛందంగా సంస్థకు సహకరిస్తారు : మోహన్ భగవత్
జైపూర్ రాజస్తాన్, నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ జైపూర్లో జరిగిన, వంద సంవత్సరాల RSS సభలో, ఆర్ఎస్ఎస్ ప్రయాణం, సేవా కార్యకర్తల త్యాగం, సంస్థ నిధుల వ్యవస్థపై విశదీకరించారు. సంఘం... తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.
మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి... రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్కోట్లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్లకే ఆలౌట్
రాజ్కోట్, నవంబర్ 16:
రాజ్కోట్లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... 