హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.
నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) :
తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.
పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.
ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.
దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.
పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.
ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.
అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు
న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి.
నిరసనకారులు పెద్ద ఎత్తున... జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.
ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్లోని వాహనంలో... బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
సోమవారం విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు... హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు
ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ... రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాలలో 68వ శాఖ ప్రారంభం
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా... కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC
హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్... ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం... ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి... 