హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.
నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) :
తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.
పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.
ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.
దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.
పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.
ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.
అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)పట్టణంలోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస పద్మావతి ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను... డాలర్పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
డాలర్ ముందు రూపాయి తన బలాన్ని చాటింది. గత కొంతకాలంగా డాలర్ కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నా, గత వారం ఒక్కసారిగా బలపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మూడేళ్లలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. మొత్తం వారంలో రూపాయి 1.4 శాతం బలపడగా, ఇది జనవరి 2023 తర్వాత... షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య
షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12... జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ లో "స్కూలొంపిక్స్-2026" పేరిట క్రీడా ఉత్సవాలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడోత్సవాలు ఈ సంవత్సరం *“స్కూలోంపిక్స్ –2026 Annual Sports Meet”* పేరుతో ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ఈ క్రీడోత్సవాలు 2026 ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీలలో జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్... విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం
నిజామాబాద్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గతేడాది కత్తిపోటుతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్... అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం ఆలూరు, రాజ్నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు కాగా, ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య,... జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్లు నిర్వహించింది. టీఆర్ నగర్లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్,... యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.
2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్,... ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం
గొల్లపల్లి (బుగ్గారం) ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వని విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 2022 మే 17న చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు సమాచారం అందించకపోవడంతో ఆయన... ఎపిస్టీన్తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జెఫ్రీ ఎపిస్టీన్కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.
మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం,... టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్ఓ రవి స్వాగతం పలికారు.
ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం... 