హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.

నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.

On
హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. -  చెరుకు మహేశ్వర శర్మ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) : 

తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.

పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.

ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.

 నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్‌,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్‌ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.

ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.

దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.

అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.

పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.

కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.

మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.

ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.

కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.

అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.

ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.

వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.

అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :  మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ...
Read More...
National  State News 

చరిత్రలో ఈరోజు జనవరి 21.

చరిత్రలో ఈరోజు జనవరి 21. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  చరిత్రలో ఈరోజు జనవరి 21  సంఘటనలు :  1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జననాలు : 1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995) 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు 1939: సత్యమూర్తి, వ్యంగ్య...
Read More...

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్ హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్...
Read More...

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో  నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో  నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో...
Read More...

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక    జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి  మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ...
Read More...

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన  నితిన్ నబీన్  ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక  హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి...
Read More...

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు...
Read More...

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష ప్రయాగ్‌రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20: మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన...
Read More...

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)   హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం   వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.  క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా...
Read More...
Crime  State News 

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర...
Read More...
State News 

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి జ్యూరిచ్ / దావోస్ జనవరి 20: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు....
Read More...