భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి - జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి
- జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
బారాస నుండి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు ఆత్మ విమర్శ చేసుకొని అభివృద్ధి సంక్షేమం కోసం తిరిగి రావాలని, వారికి ఎల్లవేళలా భారత రాష్ట్ర సమితి స్వాగతం పలుకుతుందని బారాస జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు నెలల క్రితం పార్టీని వీడిన 30వ వార్డు కౌన్సిలర్ సజ్జు వాస్తవాలు గ్రహించి తిరిగి ఘర్ వాపసి బారాస లోకి తిరిగి రావడానికి ఆయన స్వాగతించారు. పాత్రికేయుల బారాస కార్యకర్తల సమావేశంలో ఆయనకు తిరిగి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగాయని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ని ఎలాగా కొలుస్తున్నామో మనకు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కూడా మనం అంతే గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిచి కెసిఆర్ ను బారాస నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం ఆలోచించాలని హితవుపలికారు.
హైడ్రా పేరుతో సొంత పార్టీ వాళ్లను వదిలేసి, బడా బాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేయడం సబబు కాదని, మీరు ప్రజల మేలుకోరే వారైతే ముందుగా వారికి ఇతర గృహాలు కేటాయించి అందులోకి మార్చిన తర్వాత వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు పర్యాయాలు తనకు కోరుట్ల ప్రజలు పట్టం కట్టారని అందుకు కోరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను అని మరొక మారు నా హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి తన తనయుడిని ఆశీర్వదించాలని తనలాగే తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్రమంతా ప్రజా సమస్యల కోసం తిరుగుతూ ప్రజలలో మమేకమైతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ ప్రజలు చాలా తెలివైన వారిని ఎక్కడ వారు చేసే పనులు బయటపడకుండా ఎలక్షన్ సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారాస నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చీటీ వెంకట్రావు, దారిశెట్టి రాజేష్, పహీం, రహీం పాషా బొమ్మ నరసయ్య గెల్లే గంగాధర్, పీర్ల సత్యం, అన్వర్, బాబా తదితరులున్నారు.
--------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... రాయికల్లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,... పలు వార్డులలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డ్ లలో యూత్ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మాజీ... జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ....ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర... జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు):
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు
జగిత్యాల జనవరి (26 ప్రజామంటలు)జిల్లా కార్యాలయంలో ఘనంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు
ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో... రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ... భారత రాజ్యాంగం ఎంతో గొప్పది రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం కల్పించింది ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలు కలిగి ఉండాలి
జగిత్యాల జనవరి 26 (ప్రజామంటలు)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందించిందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుఎల్లాల రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తహసిల్ చౌరస్తాలో గల జగిత్యాల ప్రెస్ క్లబ్ ( టి యు డబ్ల్యు జే ఐజేయు) లో జాతీయ జెండాను ఆవిష్కరించి... 