భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి - జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి
- జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
బారాస నుండి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు ఆత్మ విమర్శ చేసుకొని అభివృద్ధి సంక్షేమం కోసం తిరిగి రావాలని, వారికి ఎల్లవేళలా భారత రాష్ట్ర సమితి స్వాగతం పలుకుతుందని బారాస జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు నెలల క్రితం పార్టీని వీడిన 30వ వార్డు కౌన్సిలర్ సజ్జు వాస్తవాలు గ్రహించి తిరిగి ఘర్ వాపసి బారాస లోకి తిరిగి రావడానికి ఆయన స్వాగతించారు. పాత్రికేయుల బారాస కార్యకర్తల సమావేశంలో ఆయనకు తిరిగి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగాయని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ని ఎలాగా కొలుస్తున్నామో మనకు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కూడా మనం అంతే గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిచి కెసిఆర్ ను బారాస నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం ఆలోచించాలని హితవుపలికారు.
హైడ్రా పేరుతో సొంత పార్టీ వాళ్లను వదిలేసి, బడా బాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేయడం సబబు కాదని, మీరు ప్రజల మేలుకోరే వారైతే ముందుగా వారికి ఇతర గృహాలు కేటాయించి అందులోకి మార్చిన తర్వాత వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు పర్యాయాలు తనకు కోరుట్ల ప్రజలు పట్టం కట్టారని అందుకు కోరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను అని మరొక మారు నా హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి తన తనయుడిని ఆశీర్వదించాలని తనలాగే తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్రమంతా ప్రజా సమస్యల కోసం తిరుగుతూ ప్రజలలో మమేకమైతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ ప్రజలు చాలా తెలివైన వారిని ఎక్కడ వారు చేసే పనులు బయటపడకుండా ఎలక్షన్ సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారాస నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చీటీ వెంకట్రావు, దారిశెట్టి రాజేష్, పహీం, రహీం పాషా బొమ్మ నరసయ్య గెల్లే గంగాధర్, పీర్ల సత్యం, అన్వర్, బాబా తదితరులున్నారు.
--------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు... మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ మార్చ్ 02 (ప్రజా మంటలు):
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం... తెలంగాణ విద్యా కమిషన్పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి... కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి
జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి... అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు
కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.
కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా
ఆయన... ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి
కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు):
రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది.
ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు.
ఉదయం 10:00 గంటలకు కరీంనగర్... కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్... సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక
హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కు తరలివస్తున్నారు.రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి... 