భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి - జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి
- జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
బారాస నుండి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు ఆత్మ విమర్శ చేసుకొని అభివృద్ధి సంక్షేమం కోసం తిరిగి రావాలని, వారికి ఎల్లవేళలా భారత రాష్ట్ర సమితి స్వాగతం పలుకుతుందని బారాస జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు నెలల క్రితం పార్టీని వీడిన 30వ వార్డు కౌన్సిలర్ సజ్జు వాస్తవాలు గ్రహించి తిరిగి ఘర్ వాపసి బారాస లోకి తిరిగి రావడానికి ఆయన స్వాగతించారు. పాత్రికేయుల బారాస కార్యకర్తల సమావేశంలో ఆయనకు తిరిగి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగాయని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ని ఎలాగా కొలుస్తున్నామో మనకు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కూడా మనం అంతే గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిచి కెసిఆర్ ను బారాస నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం ఆలోచించాలని హితవుపలికారు.
హైడ్రా పేరుతో సొంత పార్టీ వాళ్లను వదిలేసి, బడా బాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేయడం సబబు కాదని, మీరు ప్రజల మేలుకోరే వారైతే ముందుగా వారికి ఇతర గృహాలు కేటాయించి అందులోకి మార్చిన తర్వాత వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు పర్యాయాలు తనకు కోరుట్ల ప్రజలు పట్టం కట్టారని అందుకు కోరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను అని మరొక మారు నా హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి తన తనయుడిని ఆశీర్వదించాలని తనలాగే తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్రమంతా ప్రజా సమస్యల కోసం తిరుగుతూ ప్రజలలో మమేకమైతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ ప్రజలు చాలా తెలివైన వారిని ఎక్కడ వారు చేసే పనులు బయటపడకుండా ఎలక్షన్ సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారాస నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చీటీ వెంకట్రావు, దారిశెట్టి రాజేష్, పహీం, రహీం పాషా బొమ్మ నరసయ్య గెల్లే గంగాధర్, పీర్ల సత్యం, అన్వర్, బాబా తదితరులున్నారు.
--------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లాలో ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది.జనరల్ కోర్సులకు సంబంధించి 4193 విద్యార్థులకు గాను 4138 విద్యార్థులు హాజరు కాగా 55 విద్యార్థులు గైర్హాజరయ్యారు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 847 విద్యార్థులకు గాను 809 విద్యార్థులు హాజరు కాగా 38... త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన
తిరుమల మార్చ్ 06 (ప్రజా మంటలు):
కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత,... త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... 