నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
రూ.7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు,5050/- రూపాయల నగదు స్వాధీనం.
జగిత్యాల ఆగస్టు 3( ప్రజా మంటలు)
నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర రావు తెలిపారు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం కి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, మల్లయ్య ల్లయ్య, అశోక్ అనే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5050/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పై ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుని మరియు ఇద్దరిద్దరూ చొప్పున ఇద్దరు కారులో, ఇద్దరు బైక్ పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు పోలీసులు అని అరుస్తూ అసలు డబ్బులు ఇస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి అందరూ ఒకచోట కలుసుకొని ఆ యొక్క డబ్బుల్ని పంచుకొని జల్సాలు చేసేవారు. దాదాపు సంవత్సర కాలం నుండి పై ఆరుగురు హైదరాబాదులో ముగ్గురిని, ధర్మపురిలో ఒకరిని, కరీంనగర్ లో ఒకరిని, జన్నారం లో ఒకరిని, జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకొని రమ్మని దాదాపు పది లక్షల వరకు లాక్కొని పరారీలో ఉన్న వీరు ఈ నెల 1వ తేదీన స్థానిక పెద్ద గుండు వద్ద ధాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష రూపాయలు లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.ఐ నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి, రాజు గాలింపు చర్యలో భాగంగా ఈ రోజు వెంకటరావుపేట వీరేంద్ర దాబాలో గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ యొక్క నకిలీ నోట్ల ముఠాను చాకిచకంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్.ఐ లు చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా... ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారుప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని... పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్పట్టణ 11 వ వార్డులో 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ 11వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ ను సందర్శించి... సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా? ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు) రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్రంలోని మంత్రులకు ఎన్నికల కమిషన్ నియమావలి వర్తించద అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వసంత మాట్లాడుతూ నవంబర్ 26 సాయంత్రం కోడ్ అమలుపై ఎలక్షన్ కమిషన్... 24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు
డీఎస్పీ రఘు చందర్ తెలిపారు..
శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద ...
మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్ పార్క్... కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి... దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు... కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు
స్టాక్టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30:
అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన... కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు
కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
అంజన్ కుమార్ను కలిసిన వారిలో
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,... జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,... 