నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
రూ.7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు,5050/- రూపాయల నగదు స్వాధీనం.
జగిత్యాల ఆగస్టు 3( ప్రజా మంటలు)
నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర రావు తెలిపారు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం కి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, మల్లయ్య ల్లయ్య, అశోక్ అనే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5050/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పై ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుని మరియు ఇద్దరిద్దరూ చొప్పున ఇద్దరు కారులో, ఇద్దరు బైక్ పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు పోలీసులు అని అరుస్తూ అసలు డబ్బులు ఇస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి అందరూ ఒకచోట కలుసుకొని ఆ యొక్క డబ్బుల్ని పంచుకొని జల్సాలు చేసేవారు. దాదాపు సంవత్సర కాలం నుండి పై ఆరుగురు హైదరాబాదులో ముగ్గురిని, ధర్మపురిలో ఒకరిని, కరీంనగర్ లో ఒకరిని, జన్నారం లో ఒకరిని, జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకొని రమ్మని దాదాపు పది లక్షల వరకు లాక్కొని పరారీలో ఉన్న వీరు ఈ నెల 1వ తేదీన స్థానిక పెద్ద గుండు వద్ద ధాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష రూపాయలు లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.ఐ నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి, రాజు గాలింపు చర్యలో భాగంగా ఈ రోజు వెంకటరావుపేట వీరేంద్ర దాబాలో గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ యొక్క నకిలీ నోట్ల ముఠాను చాకిచకంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్.ఐ లు చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం ఉదయం కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే, పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నేళ్లుగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో తలదాచుకుని... నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారులకు ఇంజక్షన్ వికటింపు… 17 మందికి అస్వస్థత
నాగార్జునసాగర్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న 17 మంది శిశువులకు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో వారు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆస్పత్రి వాతావరణం ఒకింత గందరగోళంగా మారింది.
ఇంజక్షన్ ఇచ్చిన అరగంటలోనే లక్షణాలు
వైద్యులు... శ్రీనగర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు : నిర్వహణ లోపమే?
శ్రీనగర్ (కాశ్మీర్) నవంబర్ 15:
శుక్రవారం రాత్రి (నవంబర్ 14, 2025), శ్రీనగర్ నగరంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. వెతుకుతున్న సమాచార ప్రకారం, ఈ పేలుడు “ఉగ్రమైన అనుకోకుండా ప్రమాదం” గా ఉంది, అధికారులు ప్రమాదానంతర పదార్థాలను తనిఖీ చేస్తున్న సమయంలో అది స్ఫోటించింది.
అత్యల్పంగా 7 మంది చనిపోయినట్టు అధికారులు... కృష్ణానగర్ కాలనీలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
సికింద్రాబాద్,నవంబర్ 14 (ప్రజా మంటలు):
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో చోటుచేసుకున్న విషాద ఘటనలో యువ ఐటీ ఉద్యోగి విశాల్ గౌడ్ (28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై తండ్రి సుర్వి శ్రీనివాస్ గౌడ్ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ బోస్ కిరన్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానగర్ కాలనీలో నివసించే... సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు
తాడోంగ్ (సిక్కిం) నవంబర్ 14:
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే), తేలికపాటి ముక్కు రక్తస్రావం మరియు రక్తపోటు పెరగడం కారణంగా శుక్రవారం సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆయన పరిస్థితి తక్షణమే స్థిరపడింది.
డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సీఎం... రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం
మెదక్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట తొలి రోజు పర్యటన నిర్వహించారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, ఘనపూర్, వనదుర్గ, మెదక్ వంటి ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కాలనీలు—అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా... జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ సంబరాలు కొనసాగాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో భాగమయ్యారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్... గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో... జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం
నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు
జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల... జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం సందర్భంగా జగిత్యాల పట్టణంలో భారీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద... మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494)
ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు... గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ
జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది... 