బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు
-పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
* వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
* ఇద్దరు హైదరాబాద్ యాత్రికుల దుర్మరణం
* డెడ్ బాడీలు బాగా డ్యామెజ్ కావడంతో అక్కడే అంత్యక్రియలు
* పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
సికింద్రాబాద్ జూలై 07 (ప్రజామంటలు) :
బద్రీనాథ్ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.
శనివారం ఉదయం ఉత్తరాఖండ్ లో రెండు బైక్లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్ ల మద్యలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్ షాహీ లు నడుపుతున్న బైక్ పై పడ్డాయి.
పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.
పోలీసులు హైదరాబాద్ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్ లో ఆదివారం తెల్లవారుజామున హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్ కావడంతో అక్కడి పోలీస్ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ లో తెలిపారు.
ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే ప్రియా ఆపార్ట్ మెంట్ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్ ఉన్నారు.
–––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
