బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు

On
బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు

అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ

సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు):

బోరబండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్‌ 7062/2025 ఆధారంగా కమిషన్‌ ఈ చర్యలు చేపట్టింది.

ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌, కార్యదర్శి  యోగితా రాణా తక్షణమే బోరబండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులను సరిచేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కమిషన్‌ ఆదేశించింది. కళాశాలలో టాయిలెట్లను మరమ్మతు చేసి శుభ్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, పారిశుద్య కార్మికులను కేటాయించాలని, లెక్చరర్ల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు శుభ్రమైన తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించింది.

రామారావు ఇమ్మానేని తన ఫిర్యాదులో కళాశాలలోని దయనీయ పరిస్థితులను కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఫ్లష్‌ ట్యాంకులు లేకుండా కంపుకొడుతున్న టాయిలెట్లు, నీటి కొరత, పారిశుద్య లోపం కారణంగా విద్యార్థులు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లను వాడాల్సి వస్తోందని వివరించారు. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల కమిషన్‌ ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ప్రజల పిల్లల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
––

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు సికింద్రాబాద్,  డిసెంబర్ 08 (ప్రజామంటలు): :    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ...
Read More...

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
Read More...

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ *కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు....
Read More...

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ ** జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు)   భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ...
Read More...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు) సర్పంచ్  ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్  గ్రామంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా  సి.ఐ సుధాకర్  మాట్లాడుతూ....
Read More...

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం  జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి...
Read More...
National  Filmi News 

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్ కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం...
Read More...
National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...
Local News 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్ మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...