జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
కాంగ్రెస్కు గుడ్బై చెప్పబోతున్నారా? ఫ్లెక్సీ మార్పుతో మొదలైన చర్చ
బీఆర్ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.
దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో పాటు మరికొందరు మాజీలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహద్యమంతనాలు పార్టీలోని అసంతృప్తులను ఒక దగ్గరికి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మార్చ్ నెల కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండాన్ని తెచ్చిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డా. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ పరిణామం తరువాత జగిత్యాల కాంగ్రెస్లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాల్లో తిరుగుబాటు కౌన్సిలర్లను గెలిపించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.
ఉగాది తరువాత కీలక నిర్ణయం?
గత కొంతకాలంగా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని జీవన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన వెంటనే పార్టీ మారుతారా, లేక మరికొంత కాలం వేచి చూస్తారా అన్నది ప్రస్తుతం “లక్ష డాలర్ల ప్రశ్న”గా మారింది.
వామపక్ష భావజాలం నుంచి కాంగ్రెస్ వరకు
జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం విభిన్న దశలను దాటింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పటి జనతా పార్టీతో సంబంధం కొనసాగించారు.
1981లో సమితి అధ్యక్ష ఎన్నికల్లో మల్యాల ప్రాంతం నుంచి పార్టీరహితంగా గెలిచారు. తరువాత 1982లో మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశాన్ని కూడా వదిలేశారు
కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆయనను ఢిల్లీకి కూడా పిలిచినా ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు రాలేదు.
ఆర్థికంగా బలమైన వనరులు లేకపోవడం వల్లనే ఆ బాధ్యత తీసుకోలేదని ఆయన సమీప వర్గాలు చెబుతాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అడ్డంకిగా మారారనే భావన అప్పటి రాజకీయ పరిణామాల్లో కనిపించింది.
పార్టీ అంతర్గత విభేదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకురావడంపై జీవన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు కూడా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలకు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాను పార్టీని విడిచిపెడతానని జీవన్ రెడ్డి పలుమార్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.
బీజేపీ వైపు వెళతారా?
ఇప్పుడు ఆయన తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలతో జీవన్ రెడ్డి పెద్దగా ఏకీభవించరని ఆయన సన్నిహితులు చెబుతారు.
అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్తో కుటుంబపరమైన అనుబంధం ఉండటం వల్ల ఆయన బీజేపీ వైపు వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసిన నాయకుడు ఆ పార్టీలో చేరడం అనేది రాజకీయంగా పెద్ద మలుపే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్ఎస్లోకి వెళితే పరిస్థితి?
ఇక మరో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆ పార్టీలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ వంటి నాయకులు ఉన్నారు.
అయితే వీరంతా ప్రారంభం నుంచే జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్లో చేరినా స్థానికంగా వర్గపోరు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పద్మవ్యుహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
భవిష్యత్తులో ఆయన స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది స్పష్టంగా కనిపించడం లేదు.
ఒక రాజకీయ పాఠమా?
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పార్టీ కోసం పోరాడిన సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో చూపిస్తున్న ఉదాహరణగా కూడా చూడవచ్చు.
జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటన్నది మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది.
సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు... జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్ 92వ జయంతి ఉత్సవాలు
జగిత్యాల మార్చి 15) ప్రజా మంటలు) జిల్లా దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది .కాన్షిరం కలలు కన్నా రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో సాధించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇంచార్జి దువ్వక శివ మహారాజ్,... ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 15 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని,,శ్రీ శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో, ప్రతి మాసం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని, శ్రీదేవి,భూదేవి,సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది.
ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగం... జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం
జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ బి నారాయణ తెలిపారు
మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము... సోనం వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం
న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):
లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్పై నమోదైన ఎన్ఎస్ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం... 