ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :
భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు. గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.
ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.
ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60 శాతం గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.
భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు
గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%).
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.
ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.
నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... 