ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?

On
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?

ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన

ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన

హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :

భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు.  గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.

 ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు  జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.

ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60  శాతం  గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.

భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.

గల్ఫ్ ఓటు బ్యాంకు

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%). 

ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది.  కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.

ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 

టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'

2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల  కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది. 

2019  పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్

2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.

 నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.

 చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.

ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి...
Read More...
Local News  State News 

బీఆర్‌ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

బీఆర్‌ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభలో బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా శ్రీ...
Read More...
Local News 

రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):    తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్...
Read More...
Local News  Spiritual  

వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు

వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు): సికింద్రాబాద్  శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు...
Read More...

గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో  కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...
Local News 

ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు

ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఇబ్రహింపట్నం డిసెంబర్ 30(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, పకిర్ కోండా పుర్, వేములకుర్తి, ఎర్దండి, కోమటీకోండాపుర్, వర్షకోండ, ఇబ్రహీంపట్నం, డబ్బ గ్రామాలలో  వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర ఈకార్యక్రమంలో...
Read More...
Local News 

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు...
Read More...

జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక 

జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక  జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు   ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్...
Read More...

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి.  ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, 

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి.  ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,  జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ...
Read More...

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు): టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత...
Read More...

అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు): అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన...
Read More...