ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :
భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు. గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.
ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.
ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60 శాతం గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.
భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు
గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%).
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.
ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.
నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు.
మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి... గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ
గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్గా నన్ను గెలిపించిన సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ
గొల్లపల్లి... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది - కవిత
కొత్తగూడెం డిసెంబర్ 18 :ప్రజా మంటలు)::తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలను తెలుసుకొని, బాధితులతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇల్లందు: దర్గా–ఆలయ సందర్శన, మత సామరస్యానికి నిదర్శనం... వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు
హైదరాబాద్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. షమీం అక్తర్ సువో–మోటోగా పరిగణనలోకి తీసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా, కోతూర్ మండలం, మల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు దప్పు మల్లయ్య తన సంతానం నిర్లక్ష్యానికి గురై, ఆస్తి నుంచి... డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి... వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి... ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ఇందిరా భవన్ నుండి తహశీల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులూ,కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు
తహసిల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల బైఠాయించారు
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా... ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రాలలో ఈ నెల 24 న నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు ఏ.నరేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ... మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించి సహస్ర లింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి సహస్ర లింగాలకు భక్తుల స్వహస్తాలతో అభిషేకించి చక్కగా వస్త్రాలతో అలంకరించి... మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వెల్గటూర్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ 17 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు... రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)మండలం మాంఖ్యనాయక్ తండ సర్పంచ్ గా మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నూతనంగా ఎన్నికైనందున మరియు ఓడ్డేలింగాపూర్ ఉపసర్పంచిగా బుక్యా శేఖర్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..... జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో
సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్జగిత్యాల/ బీర్పూర్/ సారంగాపూర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బీర్పూర్ .....మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా... 1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)
మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్:
ముంబై డిసెంబర్ 18:
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా... అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే
యాది....
*అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.
- అల్లె రమేష్
*మానేటి మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు
సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన
తెలుగు... 